Political News

వారిపై ‘అన‌ర్హ‌త వేటు’ వేయించండి: జ‌గ‌న్

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్సీలుగా ఉండి.. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న ముగ్గురు అభ్య‌ర్థుల‌పై వేటు వేయించాల‌ని ఆయ‌న‌.. మాజీ మంత్రి, శాస‌న మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను ఆదేశించిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని సోమ‌వార‌మే మండ‌లిలో ప్ర‌వేశ పెట్టాల‌ని.. వేటు వేయించే వ‌ర‌కు వ‌దిలి పెట్ట‌వ‌ద్ద‌ని కూడా తేల్చి చెప్పిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు తెలిపాయి. నిజానికి వైసీపీ త‌ర‌ఫున మండ‌లికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌వారు.. టీడీపీలో చేరుతున్నార‌ని వార్త‌లు వ‌చ్చిన వెంట‌నే జ‌గ‌న్ అలెర్ట్ అయిన‌ట్టు తెలిసింది.

వారు ఇంకా పార్టీ మార‌కుండానే.. “ఏం చేద్దాం” అంటూ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌తో జ‌గ‌న్ చ‌ర్చించారు. అనంత‌రం.. రెండు మూడు గంట‌ల్లోనే వారు పార్టీ మారి.. సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ కండువాలు క‌ప్పుకొన్నారు. దీంతో ఇక‌, ఉపేక్షించేది లేద‌ని.. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే.. దీనిని అనుకూలంగా మార్చుకోవాల‌ని జ‌గ‌న్ పార్టీ నాయ‌కుల‌కుముఖ్యంగా బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు తేల్చి చెప్పారు. వైసీపీ త‌ర‌ఫున ఎమ్మెల్సీగా ఉండి.. పార్టీ మారిన వారిపై అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని ఆయ‌న సూచించారు. దీనిపై సోమ‌వార‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. దీంతో ఒక్క‌సారిగా మండ‌లి రాజ‌కీయం వేడెక్కింది.

ఏం జ‌రిగింది?

వైసీపీ త‌ర‌ఫున గ‌తంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు ఎంపికైన వారిలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌(చిల‌క‌లూరిపేట‌), బ‌ల్లి క‌ల్యాణచ‌క్ర‌వ‌ర్తి (గూడూరు), క‌ర్రి ప‌ద్మ‌శ్రీ(తూర్పుగోదావ‌రి)లు.. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయిన ద‌రిమిలా.. ఆ పార్టీకి రాజీనామాలు చేశారు. వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత కాలంలో త‌మ ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు కూడా రాజీనామా స‌మ‌ర్పించారు. అయితే.. అప్ప‌టి నుంచి వారి రాజీనామాలు ఆమోదం పొంద‌లేదు. ఇక‌, ఎన్నాళ్లు వేచి చూసినా వారి రాజీనామాలు ఆమోదం పొంద‌క‌పోవ‌డంతో తాజా వారు సైకిల్ ఎక్కారు. నిజానికి ఐదుగురు రాజీనామా చేశారు. వీరిలో పోతుల సునీత, జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌ కూడా ఉన్నారు. అయితే.. ఆమె ఇటీవ‌ల బీజేపీలో చేరారు. ఆమె రాజీనామా కూడా ఆమోదం పొంద‌లేదు.

వేటు ప‌డుతుందా?

ఇక‌, వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చెబుతున్న‌ట్టు వైసీపీ ఎమ్మెల్సీల‌పై వేటు ప‌డుతుందా? అంటే క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే.. వారు త‌మ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన త‌ర్వాతే పార్టీలు మారారు. కానీ, మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న మోషేన్‌రాజు(వైసీపీ నాయ‌కుడు) ఆయా రాజీనామాల‌ను ఆమోదించ‌లేదు. సో.. త‌ప్పు మండ‌లి చైర్మ‌న్ ద‌గ్గ‌రే ఉంది. దీనిని బ‌ట్టి.. రేపు అన‌ర్హ‌త తీర్మానం ప్ర‌వేశ పెట్టినా.. ఎప్పుడో రాజీనామాలు చేశారు కాబ‌ట్టి.. ఈ తీర్మానానికి ప్రాధాన్యం ఉండ‌దు. అంతేకాదు.. ప్ర‌స్తుతం జ‌య‌మంగ‌ళ వెంక‌ట ర‌మ‌ణ రాజీనామా వ్య‌వ‌హారం హైకోర్టులో పెండింగులో ఉంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ప్ర‌య‌త్నం వృథా అవుతుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

This post was last modified on September 20, 2025 11:08 am

Share

Recent Posts

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

7 minutes ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

9 minutes ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

1 hour ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

2 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

2 hours ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

3 hours ago