Political News

నాకేం తెలీదు.. న‌న్ను ఇరికించారు: మిథున్‌రెడ్డి

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏ-4 నిందితుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు శుక్ర‌వారం ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కు ఏక‌బిగిన విచారించారు. విజ‌య‌వాడ‌లోని సిట్ కార్యాల‌యానికి తీసుకువ‌చ్చిన ఆయ‌న‌ను.. ముగ్గురు అధికారులు ప్ర‌శ్నించారు. ఈ కుంభ‌కోణంలో డిస్టిల‌రీల(మ‌ద్యం త‌యారు చేసే కంపెనీలు)కు మ‌ద్యాన్ని పంపిణీ చేసే విష‌యంలో టార్గెట్లు విధించ‌డంతోపాటు.. ధ‌ర‌ల నిర్ణ‌యం.. క‌మీష‌న్ల నిర్ణ‌యం వంటివి మిథున్‌రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగాయ‌ని అధికారులు చెబుతున్నారు.

అదేవిధంగా మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన ఓ కంపెనీకి ఓ డిస్టిల‌రీ నుంచి రూ.5 కోట్ల నిధులు జ‌మ అయ్యాయి. అయితే.. ఈ నిధుల‌ను స‌ద‌రు కంపెనీ వెన‌క్కి పంపేసింది. ఈ విష‌యాల‌పైనే సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్ర‌శ్నించారు. డిస్టిల‌రీల‌తో మీరు ఎందుకు చ‌ర్చించాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించిన‌ప్పుడు.. అస‌లు త‌న‌కు ఆ విష‌యాలు ఏమీ తెలియ‌ద‌ని.. త‌న‌ను కావాల‌నే ఇరికించార‌ని.. త‌మ‌కు రాజ‌కీయంగా ప్ర‌జ‌ల నుంచి బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఉంద‌ని.. అందుకే త‌మ‌పై రాజ‌కీయ క‌క్ష క‌ట్టార‌ని ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. అస‌లు తాను ఎంపీన‌ని, నిరంత‌రం త‌న నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌లు, రాష్ట్రానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పైనే ఢిల్లీలో ఉన్నాన‌ని త‌న‌కు ఈ కేసుతో సంబంధం లేద‌ని చెప్పిన‌ట్టు తెలిసింది.

అలానే.. త‌న పేరిట ఎలాంటి కంపెనీ లేద‌న్న మిథున్ రెడ్డి.. తన కుటుంబం న‌డుపుతున్న కంపెనీకి నిధులు వ‌చ్చిన మాట వాస్త‌వమేన‌ని.. దీంతో ఆ నిధుల‌ను(5 కోట్లు) వెన‌క్కి పంపేశామ‌ని, ఇక కేసు ఏముంటుంద‌ని ప్ర‌శ్నించారు. డిస్టిల‌రీల య‌జ‌మా నుల‌తోనూ త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. రాజ‌కీయ ప్రేరేపిత కేసులో తాను ఒక భాగ‌మయ్యాన‌ని, ఈ కేసు నిల‌బ‌డద‌ని.. త‌న‌ను అన‌వ‌స‌రంగా ఇరికించి వేధిస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం. త‌న‌కు తెలిసినంత వ‌ర‌కు లిక్క‌ర్ కుంభ‌కోణానికి సంబంధించిన స‌మాచారం ఏమీ లేద‌న్నారు.

ఇది టీడీపీ నాయ‌కులు సృష్టించిన కేసు అని పేర్కొన్న ఎంపీ.. వారినే అడిగితే బాగుంటుంద‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. మ‌ధ్యాహ్నం.. ఓ హోట‌ల్ నుంచి తెప్పించిన భోజ‌నం చేసిన ఆయ‌న‌.. టీ, కాఫీల‌ను మాత్రం తాగ‌లేద‌ని.. త‌న‌కు అలవాటు లేద‌ని చెప్పిన‌ట్టు అధికారి ఒక‌రు తెలిపారు. వాస్త‌వానికి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కూడా మిథున్ రెడ్డిని విచారించే అవ‌కాశం ఉన్నా.. ఆయ‌న ప‌దే ప‌దే.. త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని చెప్ప‌డంతోపాటు ఏ ప్ర‌శ్న అడిగినా.. అలా ఎందుకు జ‌రిగిందో కూడా త‌న‌కు అర్ధం కావ‌డం లేద‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. దీంతో అధికారులు ఆయ‌న‌ను తిరిగి పంపేశారు. శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌రోసారి విచారించ‌నున్నారు.

Satya

Recent Posts

బుల్లితెర ‘పెద్ది’ బెటర్ అనిపిస్తున్నాడు

నిన్న అర్ధరాత్రి నుంచి పెద్ది నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. థియేటర్ రిలీజ్ నుంచి కేవలం ముప్పై అయిదు రోజుల…

1 hour ago

మంత్రి vs ఎమ్మెల్యే… సీఎంకు తలనొప్పే!

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ప్ర‌స్తుత మంత్రి కొండా సురేఖ‌, ఇదే జిల్లాకు చెందిన స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ…

2 hours ago

చంద్ర‌బాబుగారూ… ఈ స‌మ‌స్య‌పై స్పందించ‌రా?: జ‌గ‌న్ ట్వీట్‌

సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి వైసీపీ అధినేత జ‌గ‌న్ సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో ఆస‌క్తిక‌ర పోస్టు చేశా రు. చంద్ర‌బాబుగారూ.. అని…

8 hours ago

మాటిచ్చిన మరుసటి రోజే… హామీని నెరవేర్చిన పవన్

హస్తకళా మహోత్సవం వేదికపై కళాకారులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను స్వయంగా విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరుసటి రోజే…

13 hours ago

హృదయం మురళి వెనుక తండ్రి కథ

జూలై 10 విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రస్తుతానికి హృదయం మురళి తక్కువ సౌండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ దీని వెనుక…

13 hours ago

పెట్టుబడుల వేటలో లోకేష్ వేట అదిరింది

ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా…

14 hours ago