Political News

మిథున్‌రెడ్డిని కొట్టకండి: కోర్టు ఆదేశం

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసుల క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ.. విజ‌య‌వాడ లోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయ‌న‌ను రెండు రోజుల పాటు విచారించేందుకుఅనుమ‌తి ఇచ్చింది. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో కీల‌క నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి డిస్ట‌రీల నుంచి సొమ్ములు వ‌సూలు చేయ‌డంలోనూ.. టార్గెట్లు నిర్ణ‌యించ‌డంలోనూ ముఖ్య పాత్ర పోషించిన‌ట్టు ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు చెబుతున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే కేసులో మిథున్ రెడ్డిని ఏ4గా పేర్కొన్నారు. ఇక‌, ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డిని మ‌రింత‌లోతుగా విచారించాల‌ని కోరుతూ.. సిట్ అధికారులు గ‌తంలోనే ఏసీబీ కోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై ప‌లు ద‌ఫాలుగా విచార‌ణ కూడా సాగింది. తాజాగా ఆయ‌న‌ను రెండు రోజుల పాటు క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ.. కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌కు పలు ష‌ర‌తులు విధించింది.

ఇవీ ష‌ర‌తులు..

1) ఉద‌యం 8 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే విచారించాలి.
2) విచార‌ణ స‌మ‌యంలో కొట్ట‌డం.. తిట్ట‌డం.. వంటివి చేయ‌రాదు.(గ‌తంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి)
3) మాన‌సిక వేధింపుల‌కు గురి చేయొద్దు.
4) విచార‌ణ స‌మ‌యంలో ఆయ‌న‌కు విరామం ఇవ్వండి.
5) రెండు పూట‌లా ఆయ‌న కోరుకున్న ఆహారం ఇవ్వాలి.
6) విచార‌ణ స‌మ‌యంలో మిథున్ రెడ్డి న్యాయ‌వాదిని అనుమ‌తించాలి.
7) విచార‌ణ మొత్తాన్నీ ఆడియో, వీడియో రికార్డులు చేయాలి.
8) ఈ కేసు విచార‌ణ‌లో సంబంధం లేని వ్య‌క్తులు విచార‌ణ‌లో జోక్యం చేసుకోరాదు.
9) సిట్ నియ‌మించిన అధికారులు మాత్ర‌మే మిథున్ రెడ్డిని విచారించాలి.

సిట్ రాబ‌ట్టే అంశాలు ఏంటి?

1) మ‌ద్యం కేసులో ముడుపులు వ‌సూలు చేయాల‌ని ఎవ‌రు చెప్పారు?
2) ఏడిస్టిల‌రీకి ఎంత టార్గెట్ విధించారు.
3) దుబాయ్ త‌దిత‌ర దేశాల్లో ఎందుకు సిట్టింగులు వేశారు?
4) ఇతర నిందితులతో ఉన్న సంబంధాలు ఏంటి?
5) గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌కు ఈ నిధులు పంపిణీ చేశారా?
6) అంతిమంగా ఈ కేసులో ల‌బ్ధి పొందింది ఎవ‌రు?

This post was last modified on September 18, 2025 9:43 pm

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

1 hour ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

4 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago