Political News

టీడీపీలో గ్రీష్మ‌.. ఏం చేస్తున్నారు చెప్మా.. !

టిడిపి అధినేత సీఎం చంద్రబాబు ఎవరికైనా పదవులు ఇచ్చినా.. ఎవరికైనా అవకాశాలు కల్పించినా.. వారి నుంచి మరింత ప్రయోజనం ఆశిస్తారు. ఇది సహజం. రాజకీయాలైనా వ్యాపారమైనా ఒక రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలు ఆదాయాన్ని కోరుకున్నట్టుగానే ఒక వ్యక్తికి ఏదైనా పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి ద్వారా ఆ పార్టీ ప్రయోజనాలు.. ఆ పార్టీకి సంబంధించిన అనుకూల అంశాలను కోరుకోవడం తప్పేమీ కాదు. ఇది ఆది నుంచి జరుగుతున్న వ్యవహారం. ఈ రకంగానే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు చంద్రబాబునాయుడు ఏరుకోరి ప‌ద‌వి అప్పగించారు.

వాస్తవానికి గ‌త‌ ఎన్నికల్లో గ్రీష్మ‌ ఎమ్మెల్యే టికెట్ ఆశించారని చర్చ జరిగింది. అయితే కొంత పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆమెకు ఎమ్మెల్సీ సీటును ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం మండలిలో బలమైన వాయిస్ వినిపించేవారు ఉన్నప్పటికీ.. మరింత బలమైన వాయిస్ వినిపించేవారు కావాలి. అదేవిధంగా రఫ్ గా వ్యాఖ్యలు చేసేవారు.. రఫ్ గా దూకుడుగా వ్యవహరించే వారు కావాలని చంద్రబాబు ఆసలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కావలి గ్రీష్మను ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం.

టిడిపి నిర్వహించిన ఒంగోలు మహానాడులో ఆమె తొడ కొట్టి మరి వైసీపీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇది చంద్రబాబు నాయుడును ఆకర్షించింది. దీంతో ఆమెకు ప్రమోషన్ చేస్తూ మండలిలో నియమించారు. ఆమె బలమైన వాయిస్ వినిపించాలని కోరుకున్నారు. సరే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇది జరిగి 5, 6 నెలలు అయిపోయినా ఇప్పటివరకు కూడా గ్రీష్మ కనీసం మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఈ లోపు అనేక పరిణామాలు జరిగాయి. జగన్ యాత్రలకు సంబంధించిన వివాదాలు, రైతులకు సంబంధించిన అంశాలు తెర‌మీదికి వచ్చాయి.

యూరియాకి సంబంధించిన అంశాలు వచ్చాయి. ఉల్లిపాయలకి సంబంధించిన విషయాలు వచ్చాయి. తాజాగా వైద్య కళాశాలకు సంబంధించిన అంశాలు కూడా తెరమీద కు వచ్చాయి. ఇన్ని విషయాలు వచ్చినప్పటికీ కూడా గ్రీష్మ పార్టీ తరపున వాయిస్ వినిపించడం కానీ తనదైన శైలిలో ఎదురుదాడి చేయడం కానీ అనేది ఎక్కడ కనిపించలేదు. వినిపించలేదు. మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు? ఆవిడ కోరుకున్నది ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం దీనికి సమాధానం అయితే లేదు.

కానీ, భవిష్యత్తులో ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తారనేది చూడాలి? మరి కొద్ది రోజుల్లో శాసన మండలి ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రీష్మపై పార్టీ మంచి ఆశలు పెట్టుకుంది. బలమైన వైసీపీ గళాన్ని ఎదుర్కొనేందుకు గ్రీష్మ లాంటి రఫ్ గా వ్యవహరించే నాయకురాలు ఉపయోగపడతారని భావిస్తోంది. మరి ఆవిడ ఈ విషయంలో సక్సెస్ అవుతారా లేకపోతే మైనస్ అవుతారా అనేది చూడాలి.

This post was last modified on September 18, 2025 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

3 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

4 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

4 hours ago

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…

6 hours ago

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…

6 hours ago

కల్కి 2 ప్లానింగ్… ఒక పద్ధతి ఒక ప్రణాళిక

ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…

7 hours ago