Political News

టీడీపీలో గ్రీష్మ‌.. ఏం చేస్తున్నారు చెప్మా.. !

టిడిపి అధినేత సీఎం చంద్రబాబు ఎవరికైనా పదవులు ఇచ్చినా.. ఎవరికైనా అవకాశాలు కల్పించినా.. వారి నుంచి మరింత ప్రయోజనం ఆశిస్తారు. ఇది సహజం. రాజకీయాలైనా వ్యాపారమైనా ఒక రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలు ఆదాయాన్ని కోరుకున్నట్టుగానే ఒక వ్యక్తికి ఏదైనా పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి ద్వారా ఆ పార్టీ ప్రయోజనాలు.. ఆ పార్టీకి సంబంధించిన అనుకూల అంశాలను కోరుకోవడం తప్పేమీ కాదు. ఇది ఆది నుంచి జరుగుతున్న వ్యవహారం. ఈ రకంగానే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు చంద్రబాబునాయుడు ఏరుకోరి ప‌ద‌వి అప్పగించారు.

వాస్తవానికి గ‌త‌ ఎన్నికల్లో గ్రీష్మ‌ ఎమ్మెల్యే టికెట్ ఆశించారని చర్చ జరిగింది. అయితే కొంత పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆమెకు ఎమ్మెల్సీ సీటును ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం మండలిలో బలమైన వాయిస్ వినిపించేవారు ఉన్నప్పటికీ.. మరింత బలమైన వాయిస్ వినిపించేవారు కావాలి. అదేవిధంగా రఫ్ గా వ్యాఖ్యలు చేసేవారు.. రఫ్ గా దూకుడుగా వ్యవహరించే వారు కావాలని చంద్రబాబు ఆసలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కావలి గ్రీష్మను ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం.

టిడిపి నిర్వహించిన ఒంగోలు మహానాడులో ఆమె తొడ కొట్టి మరి వైసీపీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇది చంద్రబాబు నాయుడును ఆకర్షించింది. దీంతో ఆమెకు ప్రమోషన్ చేస్తూ మండలిలో నియమించారు. ఆమె బలమైన వాయిస్ వినిపించాలని కోరుకున్నారు. సరే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇది జరిగి 5, 6 నెలలు అయిపోయినా ఇప్పటివరకు కూడా గ్రీష్మ కనీసం మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఈ లోపు అనేక పరిణామాలు జరిగాయి. జగన్ యాత్రలకు సంబంధించిన వివాదాలు, రైతులకు సంబంధించిన అంశాలు తెర‌మీదికి వచ్చాయి.

యూరియాకి సంబంధించిన అంశాలు వచ్చాయి. ఉల్లిపాయలకి సంబంధించిన విషయాలు వచ్చాయి. తాజాగా వైద్య కళాశాలకు సంబంధించిన అంశాలు కూడా తెరమీద కు వచ్చాయి. ఇన్ని విషయాలు వచ్చినప్పటికీ కూడా గ్రీష్మ పార్టీ తరపున వాయిస్ వినిపించడం కానీ తనదైన శైలిలో ఎదురుదాడి చేయడం కానీ అనేది ఎక్కడ కనిపించలేదు. వినిపించలేదు. మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు? ఆవిడ కోరుకున్నది ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం దీనికి సమాధానం అయితే లేదు.

కానీ, భవిష్యత్తులో ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తారనేది చూడాలి? మరి కొద్ది రోజుల్లో శాసన మండలి ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రీష్మపై పార్టీ మంచి ఆశలు పెట్టుకుంది. బలమైన వైసీపీ గళాన్ని ఎదుర్కొనేందుకు గ్రీష్మ లాంటి రఫ్ గా వ్యవహరించే నాయకురాలు ఉపయోగపడతారని భావిస్తోంది. మరి ఆవిడ ఈ విషయంలో సక్సెస్ అవుతారా లేకపోతే మైనస్ అవుతారా అనేది చూడాలి.

This post was last modified on September 18, 2025 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

1 hour ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

1 hour ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

4 hours ago

తమిళంలో అదరగొట్టిన చంద్రబాబు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…

4 hours ago

ధనుష్ కూడా ఇలా చేస్తే ఎలా?

పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్‌గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…

10 hours ago

ముంబై కమ్ బ్యాక్.. ఇది భయంకరమే..

​ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…

11 hours ago