Political News

టీడీపీలో గ్రీష్మ‌.. ఏం చేస్తున్నారు చెప్మా.. !

టిడిపి అధినేత సీఎం చంద్రబాబు ఎవరికైనా పదవులు ఇచ్చినా.. ఎవరికైనా అవకాశాలు కల్పించినా.. వారి నుంచి మరింత ప్రయోజనం ఆశిస్తారు. ఇది సహజం. రాజకీయాలైనా వ్యాపారమైనా ఒక రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలు ఆదాయాన్ని కోరుకున్నట్టుగానే ఒక వ్యక్తికి ఏదైనా పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి ద్వారా ఆ పార్టీ ప్రయోజనాలు.. ఆ పార్టీకి సంబంధించిన అనుకూల అంశాలను కోరుకోవడం తప్పేమీ కాదు. ఇది ఆది నుంచి జరుగుతున్న వ్యవహారం. ఈ రకంగానే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు చంద్రబాబునాయుడు ఏరుకోరి ప‌ద‌వి అప్పగించారు.

వాస్తవానికి గ‌త‌ ఎన్నికల్లో గ్రీష్మ‌ ఎమ్మెల్యే టికెట్ ఆశించారని చర్చ జరిగింది. అయితే కొంత పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆమెకు ఎమ్మెల్సీ సీటును ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం మండలిలో బలమైన వాయిస్ వినిపించేవారు ఉన్నప్పటికీ.. మరింత బలమైన వాయిస్ వినిపించేవారు కావాలి. అదేవిధంగా రఫ్ గా వ్యాఖ్యలు చేసేవారు.. రఫ్ గా దూకుడుగా వ్యవహరించే వారు కావాలని చంద్రబాబు ఆసలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కావలి గ్రీష్మను ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం.

టిడిపి నిర్వహించిన ఒంగోలు మహానాడులో ఆమె తొడ కొట్టి మరి వైసీపీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇది చంద్రబాబు నాయుడును ఆకర్షించింది. దీంతో ఆమెకు ప్రమోషన్ చేస్తూ మండలిలో నియమించారు. ఆమె బలమైన వాయిస్ వినిపించాలని కోరుకున్నారు. సరే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇది జరిగి 5, 6 నెలలు అయిపోయినా ఇప్పటివరకు కూడా గ్రీష్మ కనీసం మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఈ లోపు అనేక పరిణామాలు జరిగాయి. జగన్ యాత్రలకు సంబంధించిన వివాదాలు, రైతులకు సంబంధించిన అంశాలు తెర‌మీదికి వచ్చాయి.

యూరియాకి సంబంధించిన అంశాలు వచ్చాయి. ఉల్లిపాయలకి సంబంధించిన విషయాలు వచ్చాయి. తాజాగా వైద్య కళాశాలకు సంబంధించిన అంశాలు కూడా తెరమీద కు వచ్చాయి. ఇన్ని విషయాలు వచ్చినప్పటికీ కూడా గ్రీష్మ పార్టీ తరపున వాయిస్ వినిపించడం కానీ తనదైన శైలిలో ఎదురుదాడి చేయడం కానీ అనేది ఎక్కడ కనిపించలేదు. వినిపించలేదు. మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు? ఆవిడ కోరుకున్నది ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం దీనికి సమాధానం అయితే లేదు.

కానీ, భవిష్యత్తులో ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తారనేది చూడాలి? మరి కొద్ది రోజుల్లో శాసన మండలి ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రీష్మపై పార్టీ మంచి ఆశలు పెట్టుకుంది. బలమైన వైసీపీ గళాన్ని ఎదుర్కొనేందుకు గ్రీష్మ లాంటి రఫ్ గా వ్యవహరించే నాయకురాలు ఉపయోగపడతారని భావిస్తోంది. మరి ఆవిడ ఈ విషయంలో సక్సెస్ అవుతారా లేకపోతే మైనస్ అవుతారా అనేది చూడాలి.

This post was last modified on September 18, 2025 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

11 minutes ago

ఫ్యామిలీ మ్యాన్ హీరో చుట్టూ టైటిల్ వివాదం

రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…

34 minutes ago

చిరు సినిమాలో దురంధర్ పాప?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన…

58 minutes ago

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…

2 hours ago

వారణాసి విశేషాలతో అభిమానుల్లో హుషారు

గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…

2 hours ago

ఐమాక్స్ కోసం రాజమౌళి ధర్నా

ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…

2 hours ago