Political News

మాట మార్చేసిన వీర్రాజు..ఢిల్లీలో ఏమైంది ?

కమలంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట మార్చేశారు. తొందరలో జరగబోయే తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి జనసేన నుండి బీజేపీ నుండా అనే విషయాన్ని తొందరలోనే ప్రకటిస్తామంటూ చెప్పారు. నిన్నటి వరకు తిరుపతి ఉపఎన్నికలో బీజేపీనే పోటి చేస్తుందని పది సార్లయినా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు నెల రోజుల క్రితమే ఉపఎన్నికలో బీజేపీ నే పోటీ చేస్తుందని వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించేసిన విషయం అందరు చూసే ఉంటారు. అప్పటి నుండి మిత్రపక్షం జనసేనతో సమస్యలు మొదలయ్యాయి.

తమతో మాట మాత్రమైనా మాట్లాడకుండానే వీర్రాజు ఏకపక్షంగా ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని ప్రకటించేయటం ఏమిటంటూ పవన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తన అసంతృప్తిని బయటపెట్టడానికి గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలను వేదికగా మార్చుకున్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కూడా ఏకపక్షంగానే ప్రకటించేశారు. దాంతో బీజేపీకి ఇబ్బందిగా మారింది. అందుకనే జనసేనను పోటి నుండి విత్ డ్రా అయ్యేట్లుగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్వయంగా పవన్ ను కలిసి మాట్లాడారు.

రెండు పార్టీల నేతల మధ్య జరిగిన చర్చల్లో చివరకు పవన్ మెత్తపడ్డారు. అయితే జీహెచ్ఎంసి ఎన్నికల్లో విత్ డ్రా చేసుకున్నాం కాబట్టి తిరుపతి లోక్ సభలో పోటీ చేసే అవకాశం తమకే ఇవ్వాలంటూ పట్టుబట్టారు. ఇదే సమయంలో ఢిల్లీ నుండి కబురు రావటంతో హడావుడిగా వెళ్ళిపోయారు. బహుశా బీజేపీ జాతీయ నేతలతో తిరుపతి విషయాన్ని చర్చించినట్లున్నారు. మరి అక్కడి నుండి ఏమైనా ఆదేశాలు వచ్చాయో ఏమో వీర్రాజుకు.

అందుకనే తాజాగా వీర్రాజు మాట్లాడుతూ పోటీలో ఏ పార్టీ అభ్యర్ధి ఉంటారో ప్రకటన చేస్తామంటూ మాట మార్చేశారు. నిజానికి రెండు పార్టీలకు కూడా ఎన్నికను గెలుచుకునేంత సీన్ లేదని అందరికీ తెలుసు. తామే పోటీ చేయాలనే విషయంలో రెండు పార్టీలు చెప్పుకుంటున్న కారణాలు కూడా లాజిక్ కు అందటం లేదు. తిరుపతి స్ధానంలో తమకే ఎక్కువ ఓట్లున్నాయంటే తమకే ఉన్నాయంటు ఊదరగొడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో రెండు పార్టీలకు కలిపి వచ్చిన ఓట్లు మహా అయితే 50 వేలు కూడా ఉండవు.

ఏదో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే కాస్త హడావుడి చేద్దామని తప్ప మరో ఆలోచన ఏమీ ఉన్నట్లు లేదు. మొత్తానికి ఢిల్లీలో క్యాంపు వేసిన పవన్ ప్రభావం వీర్రాజు మీద పడినట్లే కనిపిస్తోంది. లేకపోతే అభ్యర్ధిని ప్రకటించేయటమే తరువాయిని మాట్లాడిన వీర్రాజు యూటర్న్ తీసుకున్నారంటే అర్ధమేంటి ? కాబట్టి వీర్రాజు చెప్పినట్లుగానే అభ్యర్ధి ఏ పార్టీ వాళ్ళో తేలిపోవాలంటే మరి కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందేనేమో . చూద్దాం ఏమి జరుగుతుందో.

This post was last modified on November 25, 2020 11:27 am

Share
Show comments
Published by
satya

Recent Posts

అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో అన్న‌య్యా..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత‌, సొంత అన్న‌పై ఆమె తీవ్ర‌స్థాయిలో యుద్ధం…

36 mins ago

ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సర్ప్రైజ్

పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్…

45 mins ago

ముద్రగడ సమాధి కట్టేసుకున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…

1 hour ago

ఆ చట్టం జగన్‌ మెడకు చుట్టుకుందా?

ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…

2 hours ago

సరిపోని అల్లరితో నరేష్ ఇబ్బందులు

భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…

3 hours ago

ఎన్టీఆర్ పేరు చెప్పి బాబును టార్గెట్ చేస్తున్న నాని

గుడివాడ‌లో విజ‌యం కోసం నాని నానాపాట్లు ప‌డుతున్నారు. త‌న అనుచ‌రుల ఆగ‌డాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు క‌ష్ట‌ప‌డుతున్నారు. కానీ…

3 hours ago