Political News

“తైత‌క్క‌లాడే రోజా కూడా.. ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌డ‌మా?”

మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కురాలు, ఫైర్ బ్రాండ్ రోజాపై జ‌న‌సేన‌నేత‌, మంత్రి కందుల దుర్గేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌బ‌ర్ద‌స్త్‌లో తైత‌క్క‌లాడే రోజా కూడా ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌డమా? అని ఆయ‌న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆమెకు ప‌వ‌న్‌ను విమ‌ర్శించే స్థాయి లేద‌న్నారు. ప‌వ‌న్.. ఆమెలాగా అవినీతి అక్ర‌మాలు చేయ‌లేద‌న్నారు. భూముల క‌బ్జాలు కూడా చేయ‌లేద‌ని.. దొంగ చాటు వ్యాపారాలు కూడా లేవ‌ని మంత్రి వ్యాఖ్యానించారు. “రోజా గురించి.. తిరుప‌తి, న‌గ‌రిలో అడిగితే దారుణాలు ఎలా ఉన్నాయో చెబుతారు” అని మంత్రి అన్నారు. అలాంటి రోజా ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌న్నారు.

రాష్ట్రంలో వైసీపీ హ‌యాంలో తీసుకువ‌చ్చిన వైద్య విద్యా క‌ళాశాల‌ల‌ను పీపీపీ(ప్ర‌భుత్వ‌-ప్రైవేటు-భాగ‌స్వామ్యం) విధానంలో అప్ప‌గించే విష‌యంపై ప్ర‌భుత్వం యోచిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై రోజా స్పందిస్తూ.. ఇంత జ‌రుగుతున్నా.. ప్ర‌శ్నిస్తానన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌న్నారు. దానిలో ఆయ‌నకు ముడుపులు ముడుతున్నాయ‌న్న కోణంలో ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పైనే తాజాగా దుర్గేష్ స్పందించారు. రోజాకు త‌మ నేత‌ను విమ‌ర్శించే హ‌క్కులేద‌న్నారు. ఆమె చేసిన అక్ర‌మాలు.. అన్యాయాలు అంద‌రికీ తెలిసివేన‌ని విమ‌ర్శించారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. న‌ష్ట‌పోయారే.. త‌ప్ప, రూపాయి కూడా సంపాయించుకోలేద‌ని మంత్రి చెప్పారు. ఎంతో మందికి త‌న సొంత నిధులు ఇచ్చి ఆదుకున్నార‌ని చెప్పారు. ఆయ‌న రోజు వారీ స‌మ‌యంలో 90 శాతం ప్ర‌జ‌ల కోసం వెచ్చిస్తున్నార‌ని.. 10 శాతం మాత్ర‌మే సినిమాల‌పై దృష్టి పెడుతున్నార‌ని తెలిపారు. ఇక‌, పీపీపీ విధానం స‌రైందేన‌ని దుర్గేష్ చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పీపీపీ విధానం ప్ర‌భుత్వాల‌కు భారం త‌గ్గిస్తోంద ని చెప్పారు. ప్ర‌వేటుకు ఇచ్చిన‌ప్ప‌టికీ.. పూర్తి అజ‌మాయిషీ, అధికారాలు రాష్ట్ర ప్ర‌భుత్వ చేతిలోనే ఉంటాయ‌ని.. త‌ద్వారా.. ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు లేవ‌న్నారు.

పీపీ విధానం విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌లు, ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌ద్ద‌న్నారు. పీపీపీ విధానంలో మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌ను నిర్మించి.. వాటిని పేద‌ల‌కుచేరువ చేసేదిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంద‌ని మంత్రి తెలిపారు. కొంద‌రికి ప‌నిలేకుండా పోయింద‌ని.. అందుకే.. ఇలా ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని కూడా విమ‌ర్శిస్తున్నార‌ని దుర్గేష్ ప‌రోక్షంగా వైసీపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

This post was last modified on September 15, 2025 11:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

11 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

19 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago