ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో తనను, తన పార్టీని ఎవరో ఓడించారని ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ, తనను ఎవరూ ఓడించలేదని అన్నారు. తాను రాజకీయాలను చూడకుండా.. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం 1999లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. అయితే.. ఈ క్రమంలో తాను తీసుకువచ్చిన సంస్కరణలను కొందరు అర్ధం చేసుకోలేక పోయారని.. అదే తనను ఓడించిందని చెప్పారు. అందుకే.. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధికి రెండు వైపుల నుంచి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. తాను అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నానని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలోనే పారిశ్రామికంగా.. పవర్ సెక్టార్ పరంగా రిఫార్మ్స్ తీసుకువచ్చానన్నారు. వాటిని ప్రజలు అర్ధం చేసుకుని.. 1999లో తనను మరోసారి గెలిపించారని చెప్పారు. కానీ.. 2004కు వచ్చే సరికి.. మాత్రం తాను ఒకవైపే చూశానని.. అదే తనను ఓడించిందన్నారు. అంతేతప్ప.. ఎవరో వచ్చి.. తనను ఓడించారన్నది వాస్తవం కాదని చెప్పారు.
సంపద సృష్టిస్తా..
సంపద సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని.. సంపద సృష్టించి.. దానిని లబ్ధిదారులకు పంచుతామన్నారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. కేంద్రంలో 11 సంవత్సరాలుగా ఎన్డీయే ప్రభుత్వం ఉందని.. వచ్చే 2029 ఎన్నికల్లోనూ మళ్లీ మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని తెలిపారు. అలాగే.. ఏపీలోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పారు. ఈ విషయంలో ఎవరూ సందేహాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఇదిలావుంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి.. చంద్రబాబును గద్దె దింపారన్న వాదన తరచుగా వినిపిస్తుంది. కానీ, అది వాస్తవం కాదని.. తనను ఎవరూ ఓడించలేదని.. చంద్రబాబు తాజాగా చెప్పడం విశేషం. ఇక, భవిష్యత్తులో తనను ఎవరూ ఓడించలేరని.. ప్రజలు కూడా తనను ఓడించరని అన్నారు. ఎందుకంటే.. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. అందుకే.. తమకు ప్రజల మద్దతు ఉంటుందన్నారు.
This post was last modified on September 12, 2025 11:37 pm
తమిళేనాడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్న స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అదినేత జోసెఫ్ విజయ్ కి…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఒకప్పుడు ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేశాడో తెలిసిందే. ముఖ్యంగా ‘లగాన్’ దగ్గర్నుంచి…
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…