Political News

“జ‌గ‌న్.. నువ్వే కాదు.. నీతాతొచ్చినా.. ఏం చేయ‌లేడు!”

ఏపీలో మెడిక‌ల్ కాలేజీలను పీపీపీ(ప్రైవేటు-ప‌బ్లిక్‌-పార్ట‌న‌ర్ షిప్‌)కి ఇవ్వాల‌న్న స‌ర్కారు నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లు, వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మెజారిటీ రాజ‌కీయ పార్టీలు.. ప్ర‌జాసంఘాలు కూడా వైద్య క‌ళాశాల‌ల నిర్మాణాన్ని ప్రైవేటుకు అప్ప‌గించ‌వ‌ద్ద‌ని కోరుతున్నారు. ఈ వ్య‌వ‌హారంపై వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. తాను ఎంతో క‌ష్ట‌ప‌డి త‌న ప్ర‌భుత్వ హ‌యాంలో 17 మెడిక‌ల్ కాలేజీల‌ను తీసుకువ‌చ్చాన‌న్నారు. వీటిలో ఐదు కాలేజీల నిర్మాణాల‌ను పూర్తి చేసి.. త‌ర‌గ‌తులు కూడా ప్రారంభించామ‌ని చెప్పారు.

మిగిలిన 10 కాలేజీల నిర్మాణాల‌ను మాత్ర‌మే కూట‌మి ప్ర‌భుత్వం పూర్తి చేయాల్సివుంద‌ని.. కానీ, వీటిని ప్రైవేటు ప‌రం చేసే కుట్ర‌లో భాగంగానే పీపీపీ విధానం తీసుకువ‌చ్చార‌ని చెబుతున్నారు. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఒప్పుకొనేది లేద‌ని.. తాము తిరిగి అధికారంలోకి వ‌చ్చాక‌.. పీపీపీల‌ను ర‌ద్దు చేసి.. వెన‌క్కి తీసుకుంటామ‌ని ఇటీవ‌ల మీడియా స‌మావేశంలో వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్య‌లపై కూట‌మి పార్టీల నాయ‌కులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నాయ‌కుడు స‌త్య‌కుమార్ యాద‌వ్ తీవ్ర‌స్థాయిలో జ‌గ‌న్‌పై విరుచుకుపడ్డారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల కాంట్రాక్టర్లను రద్దు చేయడం జగన్ కానీ, జగన్ తాత రాజా రెడ్డి దిగివ‌చ్చినా ఆయ‌న‌ వల్ల కూడా కాదని స‌త్య‌కుమార్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అభివృద్ధి విషయంలో అడ్డుకుంటాను అంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. బాబాయి గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించిన చరిత్ర జగన్ దని సత్య కుమార్ విమ‌ర్శ‌లు గుప్పించారు. గులకరాయి, కోడి కత్తి విషయాల్లో సోషల్ మీడియాలో ద్వారా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశాడని విమ‌ర్శించారు. కాంట్రాక్టర్లను జగన్ బెదిరించి తాము అధికారంలోకి రాగానే మీ అంతు చూస్తానంటే కూట‌మి ప్ర‌భుత్వం చేతులు క‌ట్టుకుని కూర్చోలేద‌న్నారు.

నాలుగేళ్ల తర్వాత తాము అధికారంలోకి వస్తానని జగన్ కలలు కంటున్నాడని స‌త్య‌కుమార్ అన్నారు. “మీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీ లు కట్టకపోవడం వల్ల వేలమంది విద్యార్థులు నష్టపోయారు.” అని వ్యాఖ్యానించారు. 4 ఏళ్ల కాలంలో మెడికల్ కాలేజీ పూర్తి చేయకుండా జగన్ మోహన్ రెడ్డి నిద్రపోయాడుని అన్నారు. వైసీపీ ప్రభుత్వం లో చేసిన అప్పులు తీర్చడానికే మాకు సంవత్సర కాలం పట్టిందన్నారు. పీపీపీ వల్ల విద్యార్థులకు వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవన్న ఆయ‌న కాలేజీల యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయన్నారు. కేవలం 33 ఏళ్ల కాలం మాత్రమే మెడికల్ కాలేజీ నిర్వహణ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుందని తెలిపారు.

This post was last modified on September 12, 2025 6:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

3 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

4 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

4 hours ago

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…

6 hours ago

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…

6 hours ago

కల్కి 2 ప్లానింగ్… ఒక పద్ధతి ఒక ప్రణాళిక

ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…

7 hours ago