హీరోలు విలన్లుగా మారడం అంత ఈజీ కాదు. ఒక్కోసారి ఆడియన్స్ రిసీవ్ చేసుకోకపోవచ్చు. జగపతిబాబుని బ్రహ్మాండంగా ఆదరించిన ప్రేక్షకులే శ్రీకాంత్ ని అంతే స్థాయిలో నెగటివ్ షేడ్ లో చూడలేకపోయారు. కూలీలో నాగార్జునకీ ఈ పరిస్థితి తలెత్తింది. కాకపోతే ఒకప్పుడు విలన్ గా ఉండి తర్వాత హీరోగా మారి మళ్ళీ విలన్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్ మధ్యలో ఎన్నో సినిమాల్లో ప్రతినాయకుడిగా మెప్పించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీతో హీరోగా మొదలుపెట్టి తిరుగులేని స్టార్ డం సంపాదించుకుని కొన్నేళ్ల పాటు టయర్ 1 స్టార్లకు పెద్ద పోటీ ఇచ్చారు.
తర్వాత ఫ్లాపుల వల్ల తెరమీద కనిపించడం తగ్గించేసిన మోహన్ బాబు అప్పుడప్పుడు తనకు కథలు నచ్చితే తప్ప మేకప్ వేసుకోవడానికి ఇష్టపడటం లేదు. కన్నప్పలో మెప్పించిన ఈ విలక్షణ నటుడు త్వరలో నాని ప్యారడైజ్ లో నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయబోతున్నారనే లీక్ నెలల క్రితమే వచ్చింది. నిర్మాణ సంస్థ, దర్శకుడు అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు కన్ఫర్మ్ అయిన న్యూసే ఇది. ఒకవేళ నిజమైతే మాత్రం రౌడీ తర్వాత మళ్ళీ అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ లో మోహన్ బాబుని చూడొచ్చు. అయితే తండ్రి కన్నా ముందు కొడుకు మంచు మనోజ్ విలన్ పాత్రలకు మంచి ఛాయస్ గా మారుతున్నాడు.
భైరవంలో తొలిసారి విలన్ గా ట్రై చేసిన మనోజ్ కు దాని బాక్సాఫీస్ ఫలితం అంత ఆశాజనకంగా రాలేదు కానీ తాజాగా మిరాయ్ రూపంలో జాక్ పాట్ కొట్టినట్టే ఉన్నాడు. స్క్రీన్ స్పేస్ మరీ ఎక్కువగా దొరకనప్పటికీ ఉన్నంతలో తన విలనీని చూపించిన తీరు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. అందుకే ఇకపై పాత్ర ఛాలెంజింగ్ గా అనిపిస్తే ఇదే తరహా కొనసాగించే ఆలోచనలో మనోజ్ ఉన్నాడు. మిరాయ్ లో గెటప్, బిల్డప్ అన్నీ బాగా కుదిరాయి. ఇంకొంచెం ఎక్కువ వాడుకోవాల్సిందని ఫ్యాన్స్ ఫీలయ్యారు. భవిష్యత్తులో మనోజ్, మోహన్ బాబు ఇలా వరస సినిమాల్లో చూడటం కన్నా మంచు ఫ్యాన్స్ కోరుకునేది ఏముంటుంది.
This post was last modified on September 12, 2025 5:49 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…