Political News

జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితి బాగోలేదు: గంటా

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ మాన‌సిక స్థితి స‌రిగాలేద‌ని అన్నారు. ఆయ‌న ఓకే అంటే.. ఏదైనా ఆసుప‌త్రిలో చూపిస్తామ‌న్నారు. తాజాగా విశాఖ‌లో మీడియాతో మాట్లాడిన గంటా.. జ‌గ‌న్ కు పొర‌పాటున 11 సీట్లు ఇచ్చామ‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నార‌ని చెప్పారు. దీనివ‌ల్ల త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌ని బాధ ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు ఈ మాత్రం కూడా రావ‌ని.. ఒక‌టో.. రెండో సీట్లు మాత్ర‌మే ద‌క్కుతాయ‌ని తెలిపారు.

ఇక‌, వైద్య క‌ళాశాల‌ల‌ను ప్రైవేటు ప‌రం చేస్తున్నార‌ని జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను గంటా ఖండించారు. ప్రైవేటు ప‌రం చేయ‌డం లేద‌ని.. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే ఉంచి.. వాటి నిర్మాణాల‌ను మాత్ర‌మే ప్రైవేటుకు ఇస్తామ‌న్నారు. పీపీపీ అంటే కూడా జ‌గ‌న్‌కు తెలియ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు. పైగా.. కాంట్రాక్టు తీసుకునే వారిని ఆయ‌న బెదిరిస్తున్నార‌ని.. విధ్వంస‌క‌ర వ్యాఖ్య‌ల‌తో బెదిరించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. యూరియా విషయంలో జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌లు స‌రికావ‌ని తెలిపారు. పైగా.. సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అచ్చెన్నాయుడు ల‌ను బావిలో దూకాల‌ని అన‌డం దారుణ‌మ‌న్నారు.

ఈ వ్యాఖ్య‌లు చేస్తూ.. జ‌గ‌న్ త‌న మాన‌సిక ప‌రిస్థితిని బ‌య‌ట పెట్టుకున్న‌ట్టుగా ఉంద‌న్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి ఇంకా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టే క‌నిపించ‌డం లేద‌న్నారు. అందుకే.. ఆయ‌న ఓకే అంటే.. ఏదైనా ఆసుప‌త్రిలో చూపి స్తామ‌ని గంటా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో 10 శాతం సీట్లు ఉంటే త‌ప్ప‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా రాద‌న్నారు. ఈ విష‌యం జ‌గ‌న్ కు కూడా తెలుసున‌ని.. అయినా యాగీ చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న బెదిరింపుల‌కు ఎవ‌రూ భ‌య‌ప‌డ‌బోర‌ని తెలిపారు.

జ‌గ‌న్‌ అసెంబ్లీకి రాకుండా.. మీడియా ముందు హెచ్చ‌రిక‌లు, బెదిరింపుల‌కు దిగడం స‌రికాద‌న్నారు. ప్ర‌తిప‌క్ష హోదా అనేది ప్ర‌జ‌లు ఇవ్వాల్సిన అంశమ‌ని గంటా వ్యాఖ్యానించారు. కానీ, జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు సీట్లే ఇవ్వ‌న‌ప్పుడు.. హోదా ఎక్క‌డి నుంచి అడుగుతార‌ని.. ఎవ‌రిని అడుగుతార‌ని దుయ్య‌బ‌ట్టారు. 500 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి విశాఖ‌లో నిర్మించిన ప్యాలెస్ ఎవ‌రి కోసం క‌ట్టారో.. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇది ప్ర‌జా ధ‌నం వృధా కాదా? అని ప్ర‌శ్నించారు.

This post was last modified on September 12, 2025 4:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

10 minutes ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

1 hour ago

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

2 hours ago

త్రివిక్రమ్ స్టయిల్లో వెంకీ అట్లూరి

సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్‌గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…

4 hours ago

చిరు సినిమా… చేతులు మారుతుందా?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్‌కు…

4 hours ago

ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ…

4 hours ago