Political News

జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితి బాగోలేదు: గంటా

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ మాన‌సిక స్థితి స‌రిగాలేద‌ని అన్నారు. ఆయ‌న ఓకే అంటే.. ఏదైనా ఆసుప‌త్రిలో చూపిస్తామ‌న్నారు. తాజాగా విశాఖ‌లో మీడియాతో మాట్లాడిన గంటా.. జ‌గ‌న్ కు పొర‌పాటున 11 సీట్లు ఇచ్చామ‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నార‌ని చెప్పారు. దీనివ‌ల్ల త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌ని బాధ ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు ఈ మాత్రం కూడా రావ‌ని.. ఒక‌టో.. రెండో సీట్లు మాత్ర‌మే ద‌క్కుతాయ‌ని తెలిపారు.

ఇక‌, వైద్య క‌ళాశాల‌ల‌ను ప్రైవేటు ప‌రం చేస్తున్నార‌ని జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను గంటా ఖండించారు. ప్రైవేటు ప‌రం చేయ‌డం లేద‌ని.. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే ఉంచి.. వాటి నిర్మాణాల‌ను మాత్ర‌మే ప్రైవేటుకు ఇస్తామ‌న్నారు. పీపీపీ అంటే కూడా జ‌గ‌న్‌కు తెలియ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు. పైగా.. కాంట్రాక్టు తీసుకునే వారిని ఆయ‌న బెదిరిస్తున్నార‌ని.. విధ్వంస‌క‌ర వ్యాఖ్య‌ల‌తో బెదిరించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. యూరియా విషయంలో జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌లు స‌రికావ‌ని తెలిపారు. పైగా.. సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అచ్చెన్నాయుడు ల‌ను బావిలో దూకాల‌ని అన‌డం దారుణ‌మ‌న్నారు.

ఈ వ్యాఖ్య‌లు చేస్తూ.. జ‌గ‌న్ త‌న మాన‌సిక ప‌రిస్థితిని బ‌య‌ట పెట్టుకున్న‌ట్టుగా ఉంద‌న్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి ఇంకా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టే క‌నిపించ‌డం లేద‌న్నారు. అందుకే.. ఆయ‌న ఓకే అంటే.. ఏదైనా ఆసుప‌త్రిలో చూపి స్తామ‌ని గంటా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో 10 శాతం సీట్లు ఉంటే త‌ప్ప‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా రాద‌న్నారు. ఈ విష‌యం జ‌గ‌న్ కు కూడా తెలుసున‌ని.. అయినా యాగీ చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న బెదిరింపుల‌కు ఎవ‌రూ భ‌య‌ప‌డ‌బోర‌ని తెలిపారు.

జ‌గ‌న్‌ అసెంబ్లీకి రాకుండా.. మీడియా ముందు హెచ్చ‌రిక‌లు, బెదిరింపుల‌కు దిగడం స‌రికాద‌న్నారు. ప్ర‌తిప‌క్ష హోదా అనేది ప్ర‌జ‌లు ఇవ్వాల్సిన అంశమ‌ని గంటా వ్యాఖ్యానించారు. కానీ, జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు సీట్లే ఇవ్వ‌న‌ప్పుడు.. హోదా ఎక్క‌డి నుంచి అడుగుతార‌ని.. ఎవ‌రిని అడుగుతార‌ని దుయ్య‌బ‌ట్టారు. 500 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి విశాఖ‌లో నిర్మించిన ప్యాలెస్ ఎవ‌రి కోసం క‌ట్టారో.. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇది ప్ర‌జా ధ‌నం వృధా కాదా? అని ప్ర‌శ్నించారు.

Satya

Recent Posts

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

3 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

5 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

7 hours ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

8 hours ago

సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…

9 hours ago

పింక్ శారీలో రాశి.. చూపు తిప్పుకోవడం కష్టమే!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…

9 hours ago