భారత దేశ నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ఈ రోజు ఉదయం జరిగిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే అయినప్పటికీ…ఇండి కూటమి బలపరిచిన సుదర్శన్ రెడ్డి గట్టి పోటీ ఇస్తారని భావించారు. ఈ క్రమంలోనే ముందుగా ఊహించినట్లుగానే సీపీ రాధాకృష్ణన్ ఈ ఎన్నికలో గెలుపొందారు.
రాధా కృష్ణన్ కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. బిజూ జనతా దళ్ (బిజెడి), బీఆర్ఎస్, శిరోమణి అకాళీ దళ్ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా సేవలందిస్తున్నారు. జార్ఖండ్, తెలంగాణ గవర్నర్ గానూ పనిచేశారు.
సౌత్ లో బీజేపీకి బలమైన ప్రతినిధిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆర్ఎస్ఎస్ తో బలమైన అనుబంధం కలిగి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. తమిళనాడు బీజేపీ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేసిన రాధాకృష్ణన్.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లకు నమ్మకస్థుడు. రాధా కృష్ణన్ పాలనా అనుభవం, నిబద్ధత, పార్టీ పట్ల విశ్వసనీయత ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాయి.
This post was last modified on September 9, 2025 7:53 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…