Political News

ఏపీ స‌ర్కారుకు.. ‘తుర‌క‌పాలెం’ మ‌ర‌క‌!

ఏపీ ప్ర‌భుత్వానికి.. గుంటూరు జిల్లా తుర‌క‌పాలెంలో జ‌రుగుతున్న భారీ మ‌ర‌ణాలు మ‌ర‌క‌లుగా మారుతు న్నాయి. గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలో 80 మందికి పైగా ఇక్క‌డి ప్ర‌జ‌లు మృతి చెందారు. అంతు చిక్క‌ని జ్వ‌రాల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ఈ జ్వ‌రాల బారిన ప‌డిన‌వారు.. అతిత‌క్కువ కాలంలోనే మృతి చెందుతున్నారు. దీనిపై ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌స్తున్నా.. పెద్ద‌గా ప్ర‌భుత్వం స్పందించ‌డం లేద‌న్న విమ‌ర్శ లు వ‌స్తున్నాయి.

గుంటూరు జిల్లా తురకపాలెంలో ప్రబలిన విషజ్వరాలకు కారణం మెలిడియోసిస్ బ్యాక్టీరియానేనని వైద్యులు స్పష్టం చేశారు. ఈ బ్యాక్టీరియా మనిషి శరీరంలో పరిపక్వత చెందిన తరువాతే గుర్తించగలమని, అత్యంత అరుదైనది అయినందున దీనిని గుర్తించటం ఆలశ్యమైందని వివరించారు. బాధితులకు, మృతులకు ఆసుపత్రి ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందిస్తున్నారు. అలాగే స్థానికంగా వైద్య శిబిరాల‌ను ఏర్పాటు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డి స‌మ‌స్య కొలిక్కిరాలేదు.

సీఎం స్పంద‌న ఏంటి?

తుర‌కపాలెంలో జ‌రుగుతున్న వ‌రుస మ‌ర‌ణాల‌పై సీఎం చంద్ర‌బాబు స్పందించారు. అయితే.. దీనికి ప‌రిష్కారం క‌నుగొన‌లేక‌పోతున్నామ‌ని వైద్య శాఖ చెప్ప‌డంతో ఆయ‌న కేంద్రం నుంచి వైద్యుల‌ను తీసుకువచ్చే అంశంపై దృష్టి పెట్టాల‌ని.. అవ‌స‌ర‌మైతే.. అఖిల భార‌త వైద్య మండ‌లి సేవ‌లు వినియోగించుకోవాల‌ని సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన 80 మంది కుటుంబాల‌కు ఒక్కొక్క కుటుంబానికీ 5 ల‌క్ష‌ల చొప్పున సాయం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. స‌మ‌స్య ప‌రిష్కారం కోసం.. హైద‌రాబాద్‌లోని నిపుణుల‌ను కూడా సంప్ర‌దించాల‌ని చంద్ర‌బాబు కోరారు.

This post was last modified on September 6, 2025 2:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

42 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago