Political News

ఏపీ స‌ర్కారుకు.. ‘తుర‌క‌పాలెం’ మ‌ర‌క‌!

ఏపీ ప్ర‌భుత్వానికి.. గుంటూరు జిల్లా తుర‌క‌పాలెంలో జ‌రుగుతున్న భారీ మ‌ర‌ణాలు మ‌ర‌క‌లుగా మారుతు న్నాయి. గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలో 80 మందికి పైగా ఇక్క‌డి ప్ర‌జ‌లు మృతి చెందారు. అంతు చిక్క‌ని జ్వ‌రాల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ఈ జ్వ‌రాల బారిన ప‌డిన‌వారు.. అతిత‌క్కువ కాలంలోనే మృతి చెందుతున్నారు. దీనిపై ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌స్తున్నా.. పెద్ద‌గా ప్ర‌భుత్వం స్పందించ‌డం లేద‌న్న విమ‌ర్శ లు వ‌స్తున్నాయి.

గుంటూరు జిల్లా తురకపాలెంలో ప్రబలిన విషజ్వరాలకు కారణం మెలిడియోసిస్ బ్యాక్టీరియానేనని వైద్యులు స్పష్టం చేశారు. ఈ బ్యాక్టీరియా మనిషి శరీరంలో పరిపక్వత చెందిన తరువాతే గుర్తించగలమని, అత్యంత అరుదైనది అయినందున దీనిని గుర్తించటం ఆలశ్యమైందని వివరించారు. బాధితులకు, మృతులకు ఆసుపత్రి ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందిస్తున్నారు. అలాగే స్థానికంగా వైద్య శిబిరాల‌ను ఏర్పాటు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డి స‌మ‌స్య కొలిక్కిరాలేదు.

సీఎం స్పంద‌న ఏంటి?

తుర‌కపాలెంలో జ‌రుగుతున్న వ‌రుస మ‌ర‌ణాల‌పై సీఎం చంద్ర‌బాబు స్పందించారు. అయితే.. దీనికి ప‌రిష్కారం క‌నుగొన‌లేక‌పోతున్నామ‌ని వైద్య శాఖ చెప్ప‌డంతో ఆయ‌న కేంద్రం నుంచి వైద్యుల‌ను తీసుకువచ్చే అంశంపై దృష్టి పెట్టాల‌ని.. అవ‌స‌ర‌మైతే.. అఖిల భార‌త వైద్య మండ‌లి సేవ‌లు వినియోగించుకోవాల‌ని సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన 80 మంది కుటుంబాల‌కు ఒక్కొక్క కుటుంబానికీ 5 ల‌క్ష‌ల చొప్పున సాయం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. స‌మ‌స్య ప‌రిష్కారం కోసం.. హైద‌రాబాద్‌లోని నిపుణుల‌ను కూడా సంప్ర‌దించాల‌ని చంద్ర‌బాబు కోరారు.

This post was last modified on September 6, 2025 2:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago