రాజకీయాల్లో ఏ పార్టీకైనా.. నలుగురుకావాలి. నాయకుల తరఫునే కాకుండా.. పార్టీ తరఫున కూడా స్పందిం చేందుకు అధికార ప్రతినిధులు అన్ని పార్టీలకూ చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో ఏపీలోని కీలక పార్టీలు పెద్దగా స్పందించడం లేదని అంటున్నారు. ముఖ్యంగా మూడు పార్టీలకు అధికార ప్రతినిధులు లేకుండాపోయారు. వీటిలో రెండు కూటమిలోనే ఉండగా.. మరొకటి కాంగ్రెస్ పార్టీ. ఈ మూడు పార్టీల్లోనూ అధికార ప్రతినిధుల కొరత వెంటాడుతోంది. ఎవరూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోయినా.. అంతర్గతంగా మాత్రం చర్చకు వస్తోంది.
జనసేన పార్టీ విషయానికి వస్తే.. అధికార ప్రతినిధుల కొరత వెంటాడుతోంది. నిజానికి ఆది నుంచి కూడా పెద్దగా అధికార ప్రతినిధులు లేని పార్టీగా జనసేన పేరుతెచ్చుకుంది. గతంలో నాదెండ్ల మనోహర్ అన్నీ తానై చూసుకునేవారు. ఇక, ఇప్పుడు మంత్రిగా ఉన్నా కూడా.. పార్టీ వ్యవహారాలను ఆయనే చూసుకోవాల్సి వస్తోంది. దీంతో తనపై ఒత్తిడి పెరిగిందని.. అటు తన శాఖను, ఇటు పార్టీ వ్యవహారాలను కూడా బ్యాలెన్స్ చేయలేక పోతున్నానని.. నాదెండ్ల చెబుతున్నారు. ఈ క్రమంలోనే అధికార ప్రతినిధులను నియమించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
విశాఖలో జరిగిన సమావేశంలో ఇటీవల ఈ విషయంపై చర్చ జరిగింది. అందుకే.. త్రిశూల్ వ్యూహాన్ని ప్రకటించారు. కీలక నేతలను ఎంపిక చేసి.. వారిని అధికార ప్రతినిధులుగా నియమించేందుకు ప్రతిపాదనలు రెడీ చేశారు. ఇక, బీజేపీ విషయానికి వస్తే.. దగ్గుబాటి పురందేశ్వరి హయాంలో నలుగురు అధికార ప్రతినిధులుగా ఉండేవారు. అయితే.. ఆమె తర్వాత వారిని కూడా పక్కన పెట్టారు. ఫలితంగా బీజేపీలో ఏపీ చీఫే ఇప్పుడు అన్నీ చూసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా ఆయనకు భారం కావడంతో అధికార ప్రతినిధులను ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇక, కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. ఈ పార్టీలోనూ.. అధికార ప్రతినిధుల కొరత ఉంది. వాస్తవానికి పార్టీ అధిష్టానం అధికార ప్రతినిధులను ఇచ్చినా.. పార్టీ చీఫ్ షర్మిల మాత్రం తనకు ఎవరూ అవసరం లేదని చెప్పడంతో అధికార ప్రతినిధులుగా ఉన్నవారు సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఎవరూలేని పార్టీగా కాంగ్రెస్ కూడా మిగిలింది. అయితే.. అధికార ప్రతినిధులు ఉంటే మేలా? కీడా? అంటే.. నిర్మాణాత్మకంగా వ్యవహరించే వారితో మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు. అందుకే అధికార ప్రతినిధి పోస్టుకు భారీ డిమాండ్ కూడా ఉంది.
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…