Political News

టార్గెట్ డీజీపీ: సాక్షిపై కేసులు!

సాక్షి.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌కు చెందిన మీడియా అనే విష‌యం తెలిసిందే. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాలు రెండూ కూడా జ‌గ‌న్‌వే. అయితే.. ప్ర‌స్తుతం ఈ మీడియాను ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి న‌డుపుతున్నారు. ఇదిలావుంటే.. ఏపీలో అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. స‌ర్కారును తీవ్ర‌స్థాయిలో టార్గెట్ చేస్తున్న జ‌గ‌న్‌, ఆయ‌న మీడియా ప‌దే ప‌దే పోలీసుల‌పైనా వ్యాఖ్యలు చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో పోలీసులపై జ‌గ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు. టీడీపీకి మ‌ద్ద‌తుగా ఉంటూ..వైసీపీ నేత‌ల‌పై కేసులు పెట్టేవారిని ఊరుకునేది లేద‌న్నారు.

వారు ఉద్యోగాలు వ‌దిలి వెళ్లిపోయినా.. ఎక్క‌డున్నా తీసుకువ‌చ్చి శిక్షించి తీరుతామ‌ని చెప్పారు. అంతేకాదు.. బ‌ట్ట‌లూడదీస్తామని.. త‌మ నాయ‌కుల‌కు సెల్యూట్ కొట్టిస్తామ‌ని .. ఇలా ప‌లు సంద‌ర్భాల్లో జ‌గ‌న్ చెప్పారు. అయితే.. త‌మ‌ను రాజ‌కీయాల్లోకి లాగొద్దంటూ.. పోలీసులు కూడా ప‌దేప‌దే విన్న‌వించుకున్నారు. ఇదిలావుంటే.. తాజాగా సాక్షిలో కీల‌క వార్త వ‌చ్చింది. పోలీసు శాఖ‌లో ప‌ద‌వుల‌ను, ప‌దోన్న‌తుల‌ను కూడా అమ్ముకుంటున్నార‌న్న‌ది ఈ క‌థ‌నం సారాంశం. ‘పైసామే ప్ర‌మోష‌న్‌’ పేరుతో నేరుగా రాష్ట్ర డీజీపీని ‘బిగ్ బాస్‌’గా పేర్కొంటూ క‌థ‌నాన్నిరాసుకొచ్చారు.

“కేవ‌లం రాజ్య‌ల‌క్ష్మి ఉంటే స‌రిపోదు.. ధ‌న‌ల‌క్ష్మి ప్ర‌స‌న్నం కూడా ఉండాలి” అని బిగ్ బాస్ వ్యాఖ్యానిస్తున్న‌ట్టు క‌థ‌నంలో సాక్షి రాసింది. అంతేకాదు.. “మాకేమీ ప‌ద‌వులు ఉచితంగా రాలేద‌ని.. ప్ర‌భుత్వ పెద్ద‌లు ఏదైనా చెబుతారు. మాకేమీ ఊరికేనే ఇవ్వ‌లేదు” అని వ్యాఖ్యానించిన‌ట్టుగా రాసింది. ఇది హోం శాఖ‌లో పెనుక‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం డీఎస్పీలుగా ఉన్న‌వారిని ఏఎస్పీలుగా ప్ర‌మోట్ చేయాల్సి ఉంది. ఇది కొన్నాళ్లుగా పెండింగులోనే ఉంది. దీంతో ఈ ప‌దోన్న‌తుల‌ను ఇలా పెండింగులో పెట్ట‌డానికి ధ‌న‌ల‌క్ష్మే కార‌ణ‌మంటూ.. క‌థ‌నంలో ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు.

దీనిపై ఆగ్ర‌హించిన రాష్ట్ర పోలీసు సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జ‌న‌కుల శ్రీనివాస‌రావు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిని త‌ప్పుడు క‌థ‌నంగా పేర్కొన్న ఆయ‌న‌.. సాక్షి ఎడిట‌ర్ ధ‌నుంజ‌య్‌రెడ్డి, క్రైమ్ రిపోర్ట‌ర్ స‌హా.. ఇత‌ర సిబ్బందిపైనా తాడేప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇలా.. సాక్షిపై కేసు న‌మోదు కావ‌డం ఫ‌స్ట్ టైమ్‌. గ‌తంలో అనేక విమ‌ర్శ‌లు చేసినా.. కేవ‌లం ప్రెస్‌మీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయిన పోలీసులు.. తాజాగా డీజీపీని టార్గెట్ చేయ‌డంతో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

Satya

Recent Posts

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

33 minutes ago

తెలంగాణ పాలిటిక్స్‌: ప‌వ‌న్ భ‌య‌మా… ఓట్ల భ‌య‌మా?

తెలంగాణ రాజ‌కీయాలు వ్యూహాత్మ‌క మ‌లుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఒక్క‌సారిగా జ‌న‌సేన పార్టీపై…

39 minutes ago

సీఎం అయినా విజయ్ లో తృప్తి లేదే!

మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…

3 hours ago

విగ్రహాల ధ్వంసం… జగన్ పై జీవి ఆంజనేయులు ఆరోపణలు

ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…

3 hours ago

పవన్ సభకు తెలంగాణ పోలీసుల ‘నో’

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…

4 hours ago

రాజమౌళి లక్ష్యం… సినీ ప్రియుల స్వప్మం

తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…

6 hours ago