Political News

ఇక‌, వైసీపీ జెండా పీకేయాల్సిందే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం.. ఇక‌, ఎప్ప‌టికీ చెక్కుచెద‌రని.. టీడీపీ కోట‌గా మారనుందా? ఇక‌, ఇక్క‌డ వేరే పార్టీ కానీ. వేరే జెండా కానీ.. క‌నిపించే ప‌రిస్థితి ఉండ‌దా? అంటే.. ఔన‌నే అంటున్నారు పార్టీ నాయ‌కులు. సాధార‌ణంగా ప్ర‌జాస్వామ్యంలో ఒక నియోజ‌క‌వ‌ర్గం ఎప్పుడు ఏ ఒక్క‌రి సొంతం కాదు. ఏ పార్టీ అయినా.. గెలిచే అవ‌కాశం ఉంటుంది. కానీ.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలుమాత్రం ద‌శాబ్దాలుగా ఒక పార్టీకే.. ఒక నేత‌కే ప‌ట్టం క‌డుతున్నాయి.

ఇలాంటి వాటిలో కుప్పం ఒక‌టి. అయితే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ ఇక్క‌డ పాగా వేయాల‌ని ప్ర‌యత్నించింది. దీంతో చంద్ర‌బాబు ఆయ‌న ప్యామిలీ కూడా అలెర్ట్ అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ హ‌వాను త‌క్కువ‌కాకుండా చూసుకునే ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. అలుపెరుగ‌కుండా.. భువనేశ్వ‌రి పాద‌యాత్ర కూడా చేశారు. ప్ర‌తిమండ‌లంలోనూ ప‌ర్య‌టించారు. మొత్తానికి వైసీపీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేశారు. ఇక , ఇప్పుడు ఆ ప‌రిస్థితి కూడా లేదు. రాబోయే కొన్ని త‌రాల పాటు కుప్పంలో టీడీపీ జెండానే ఎగురుతుందని అంటున్నారు స్థానిక నాయ‌కులు.

తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు కుప్పంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. గ‌త 14 మాసాల్లో చూపిన శ్ర‌ద్ధ వేరు.. గ‌త 14 ఏళ్ల సీఎంగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకున్న‌ది వేరు. సొంత‌గా ఇల్లు క‌ట్టుకున్నారు. పార్టీ కార్యాల‌యానికి తాజాగా 5 ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయించారు. ఇక‌, ఇప్పుడు స్థానికంగా.. కృష్ణా నీటిని తీసుకువ‌చ్చారు. ఇది రికార్డుగా మారింది. గ‌తంలో వైసీపీ ఇది చేసే ఇక్క‌డి వారి మ‌న‌సు చూర‌గొనాల‌ని ప్ర‌య‌త్నించినా.. సాధ్యం కాలేదు. ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు సాకారం చేశారు.

దీనికి తోడు ఏకంగా ఒకేసారి ఆరు కంపెనీల‌తో పెట్టుబ‌డులు పెట్టించేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఫ‌లితంగా కుప్పంలో ఇంటికో ఉద్యోగం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇది మ‌రింత‌గా బాబు గ్రాఫ్‌ను, టీడీపీ హ‌వాను పెంచుతోంద‌ని నాయ‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు.. ప్ర‌తి ఇంటిపైనా సూర్య ఘ‌ర్ ప‌థ‌కం కింద‌.. విద్యుత్ ఉత్ప‌త్తిని ప్రారంభించారు. ఇక‌, ప్ర‌తి ఇంటి నుంచి ఒక మ‌హిళ‌ల‌కు ఎన్టీఆర్ ట్ర‌స్టు త‌ర‌ఫున చేతి వృత్తుల్లో ప్రావీణ్యం ఇస్తున్నారు. త‌ద్వారా.. కుప్పం.. ఇక‌, ఎవ‌ర్ గ్రీన్‌.. ఇక‌, ఇక్క‌డ వైసీపీ జెండా పీకేయొచ్చ‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు.

This post was last modified on September 2, 2025 9:01 am

Share

Recent Posts

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

26 seconds ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

18 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

22 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago