ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం.. ఇక, ఎప్పటికీ చెక్కుచెదరని.. టీడీపీ కోటగా మారనుందా? ఇక, ఇక్కడ వేరే పార్టీ కానీ. వేరే జెండా కానీ.. కనిపించే పరిస్థితి ఉండదా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ నాయకులు. సాధారణంగా ప్రజాస్వామ్యంలో ఒక నియోజకవర్గం ఎప్పుడు ఏ ఒక్కరి సొంతం కాదు. ఏ పార్టీ అయినా.. గెలిచే అవకాశం ఉంటుంది. కానీ.. కొన్ని కొన్ని నియోజకవర్గాలుమాత్రం దశాబ్దాలుగా ఒక పార్టీకే.. ఒక నేతకే పట్టం కడుతున్నాయి.
ఇలాంటి వాటిలో కుప్పం ఒకటి. అయితే.. గత ఎన్నికలకు ముందు వైసీపీ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నించింది. దీంతో చంద్రబాబు ఆయన ప్యామిలీ కూడా అలెర్ట్ అయ్యారు. నియోజకవర్గంలో తమ హవాను తక్కువకాకుండా చూసుకునే ప్రయత్నాలు కూడా చేశారు. అలుపెరుగకుండా.. భువనేశ్వరి పాదయాత్ర కూడా చేశారు. ప్రతిమండలంలోనూ పర్యటించారు. మొత్తానికి వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేశారు. ఇక , ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. రాబోయే కొన్ని తరాల పాటు కుప్పంలో టీడీపీ జెండానే ఎగురుతుందని అంటున్నారు స్థానిక నాయకులు.
తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చంద్రబాబు కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. గత 14 మాసాల్లో చూపిన శ్రద్ధ వేరు.. గత 14 ఏళ్ల సీఎంగా ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకున్నది వేరు. సొంతగా ఇల్లు కట్టుకున్నారు. పార్టీ కార్యాలయానికి తాజాగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇక, ఇప్పుడు స్థానికంగా.. కృష్ణా నీటిని తీసుకువచ్చారు. ఇది రికార్డుగా మారింది. గతంలో వైసీపీ ఇది చేసే ఇక్కడి వారి మనసు చూరగొనాలని ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. ఇక, ఇప్పుడు చంద్రబాబు సాకారం చేశారు.
దీనికి తోడు ఏకంగా ఒకేసారి ఆరు కంపెనీలతో పెట్టుబడులు పెట్టించేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఫలితంగా కుప్పంలో ఇంటికో ఉద్యోగం ఖాయమని తెలుస్తోంది. ఇది మరింతగా బాబు గ్రాఫ్ను, టీడీపీ హవాను పెంచుతోందని నాయకులు చెబుతున్నారు. మరోవైపు.. ప్రతి ఇంటిపైనా సూర్య ఘర్ పథకం కింద.. విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇక, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళలకు ఎన్టీఆర్ ట్రస్టు తరఫున చేతి వృత్తుల్లో ప్రావీణ్యం ఇస్తున్నారు. తద్వారా.. కుప్పం.. ఇక, ఎవర్ గ్రీన్.. ఇక, ఇక్కడ వైసీపీ జెండా పీకేయొచ్చని అంటున్నారు టీడీపీ నేతలు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…