Political News

సీబీఐకి ఇస్తే.. పోయేదేంటి?: బీఆర్ ఎస్ చర్చ

కాళేశ్వరం అవినీతి, అక్రమాల నిగ్గు తేల్చేందుకు నియమించిన పినాకి చంద్రఘోష్ (పీసీ ఘోష్) కమిషన్ రిపోర్టుపై చర్చ అనంతరం తెలంగాణ అసెంబ్లీ దీనిపై సీబీఐ విచారణ జరిపించేలా నిర్ణయించింది. దీనిపై కేంద్రానికి లేఖ రాయనున్నారు. ఏయే విషయాల్లో అక్రమాలు జరిగాయో, ఎలాంటి అక్రమాలో వివరించడంతోపాటు ఎంత దుర్వినియోగం జరిగిందో, ఎవరు లబ్ధి పొందారని అనుమానిస్తున్నారన్న విషయాలను కూడా పేర్కొంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయనున్నారు. అనంతరం దీనిపై సీబీఐ దృష్టి పెట్టనుంది.

అయితే వాస్తవానికి ఇలా కీలకమైన కేసులో సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని నాయకులు చిన్నబుచ్చుకుంటారు. తమ ఇమేజ్ పోతుందనే అనుకుంటారు. కానీ బీఆర్ ఎస్‌లో మాత్రం “అయితే ఏంటి? సీబీఐకి ఇస్తే పోయేదేంటి?” అనే కామెంట్లు చేయడం గమనార్హం. అంతేకాదు సీబీఐకి ఇచ్చి మంచి పనిచేశారని ఒకరిద్దరు నాయకులు కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే దేశంలో సుదీర్ఘకాలంగా విచారణలో ఉన్న కేసులు ఏవంటే అవి సీబీఐవే. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు 14 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు.

ఇక జగన్ బాబాయి వివేకా దారుణ హత్య కేసు కూడా సీబీఐకి అప్పగించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన కుమార్తె సునీత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాబట్టి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే సీబీఐ విచారణ అంటేనే దీనిని సాగదీత కోణంలోనే చూస్తారన్నది బీఆర్ ఎస్ నాయకుల మాట. అందుకే “సీబీఐకి ఇస్తే పోయేదేంటి?” అన్న చర్చకు తెరదీశారు. ఇక దీనిపై పార్టీ సుప్రీం కేసీఆర్ ఏమంటారో చూడాలి. ఆయన ఇంకా దీనిపై స్పందించలేదు.

కట్ చేస్తే సీబీఐ విచారణకు ఇప్పుడు ఇచ్చినా ప్రభుత్వం దీనికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికి ప్రభుత్వానికి అందిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులోని అంశాలను ప్రాతిపదికగా చేసుకుని విచారణ చేయాలా? లేక ఆది నుంచి విచారణ చేపట్టాలా? అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఆది నుంచి కనుక విచారణ చేపట్టాలని భావిస్తే ఈ కేసు మరో జగన్ కేసు మాదిరిగా మారడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.

This post was last modified on September 1, 2025 10:40 pm

Share
Show comments
Published by
Satya
Tags: kaleshwaram

Recent Posts

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

20 minutes ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

2 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

2 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

2 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

5 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

7 hours ago