రాజకీయాలు అందరూ చేస్తారు. తమకు తాము కీర్తి కిరీటాలు తగిలించుకుంటారు కూడా. అయితే తాను రాజకీయాలు చేయడమే కాకుండా వాటిని పదిమంది మెచ్చేలా చేయడంలోనే కీలకమైన వ్యూహం దాగి ఉంటుంది. ఇలాంటి వాటిలో అందెవేసిన చేయి టీడీపీ అధినేత చంద్రబాబు. ఎక్కడీ వీపీ సింగ్, ఎక్కడీ ప్రధానమంత్రి మోడీ, ఎన్నో ఎన్నికల తరాలు, ఎన్నో రాజకీయాలు. ఆయన చేసిన పనులు, వేసిన అడుగులు రాజకీయాల్లో సుస్థిరత్వాన్ని సొంతం చేశాయి. జగజ్జేతగా నిలబెట్టాయి.
నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితిలో ప్రధానమంత్రిగా చంద్రబాబు అయితేనే మంచిది అని జాతీయ స్థాయి నాయకులు చేసిన వాదన అక్షరాల నిజం. ఆ స్థాయికి ఆయన ఎప్పుడో చేరుకున్నారు. 1998లోనే చంద్రబాబుకు ఈ ఆఫర్ వచ్చింది. ఇక ప్రపంచ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు చంద్రబాబులో సీఈవోను చూస్తే, రాజకీయ నేతలు ఆయనలోని నేతను నిశితంగా గమనించారు. బిల్ క్లింటన్ వంటి అమెరికా అధ్యక్షుడు సైతం చంద్రబాబును కొనియాడారంటే అతిశయోక్తి ఎలా అవుతుంది? ఆయనలో ఉన్న నేతను పట్టి చూపకుండానే!
స్థానిక పార్టీని విశ్వవ్యాప్తం చేయడమే కాదు, ప్రజలను సైతం ప్రపంచం మెచ్చేలా చేసిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుంది. మెప్మా, డ్వాక్రా వంటి సంఘాల ద్వారా మహిళలు ప్రపంచ దేశాలకు వెళ్లిన ఘటనల వెనుక బాబు వ్యూహం, విజన్ స్పష్టంగా కనిపిస్తాయి. ఇక రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన నాయకుడు చంద్రబాబు. అంతేకాదు ప్రత్యర్థి వీక్నెస్ను ప్రజల మధ్య పెట్టి తనకు అనుకూలంగా మార్చుకునే నేతగా కూడా ఆయన గుర్తింపు పొందారు. విశ్వాన్ని గెలిచిన వాడు జగజ్జేత అయితే, దేశవ్యాప్త రాజకీయ నాయకులు ఏపీ వైపు చూసేలా చేసిన ఘనత ముమ్మాటికీ చంద్రబాబు సొంతం.
ఒకప్పుడు ఏపీ ఎక్కడుందని ప్రపంచంలో వెతుక్కునే పరిస్థితి నుంచి గ్రీన్టిక్తో ఏపీ సగర్వంగా ప్రపంచ పటంలో కనిపించేలా చేసిన నాయకుడు కూడా చంద్రబాబు అనడంలో సందేహం లేదు. తరాలు మారినా వారితోనూ కలిసి పనిచేయడం చంద్రబాబు లక్షణం. వారిని తన బాటలో కాదు, తాను కూడా అవసరమైతే వారి బాటలో నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఐటీ మాత్రమే కాదు, అన్నపెట్టే రైతన్న బాగు కోసం కూడా ప్రపంచ స్థాయి డ్రిప్ ఇరిగేషన్ విధానాలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. అందుకే ఆయన రాజకీయ జగజ్జేత!
This post was last modified on September 1, 2025 2:51 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…