Political News

ఇప్ప‌డు కొస‌రే… `అస‌లు` ముందుంది: సీఎం చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్ధిపై ఆయ‌న స్పందిస్తూ.. ఇది కొసరేన‌ని.. అస‌లు అభివృద్ధి ముందుంద‌ని చెప్పారు. గ‌త 15 నెల్లలో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్న ఆయ‌న‌.. అస‌లు అభివృద్ధి, పెట్టుబ‌డుల సాధ‌న వంటివి ముందున్నాయ‌ని చెప్పారు. ఈ 15 మాసాల్లో 15 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు ద‌క్కించుకున్నామ‌న్నారు. ఇవి త్వ‌ర‌లోనే సాకారం అవుతాయ‌ని చెప్పారు. త‌ద్వారా ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని వివ‌రించారు. తాజాగా విశాఖ‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు మాట్లాడారు.

రాబోయే నాలుగు సంవ‌త్స‌రాల్లో కూట‌మి ప్ర‌భుత్వం ఏం చేయ‌నుందో సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. “ఏడాదిన్న‌ర కూడా గ‌డ‌వ‌క‌ముందే.. సూప‌ర్ 6 హామీల‌ను అమ‌లు చేశాం. మ‌హిళ‌ల‌కు త‌ల్లికి వంద‌నం, ఉచిత ఆర్టీసీ బ‌స్సులు చేరువ చేశాం. రైతుల‌కు అన్న‌దాత సుఖీభ‌వ ఇచ్చాం. ఇంకా చేయాల్సిన‌వి చాలానే ఉన్నాయి. కొన్ని చెప్పిన‌వి.. చాలా చెప్ప‌నివి కూడా చేశాం. పెట్టుబ‌డులు రానున్నాయి. వీటితో ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు మ‌రింత మెరుగు ప‌డ‌నున్నాయి“ అని చంద్ర‌బాబు చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప్రాజెక్టుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు.

అదేవిధంగా రాజ‌ధానిని 2027 నాటికి స‌గానికిపైగా పూర్తి చేయ‌నున్నట్టు వివ‌రించారు. 2029 నాటికి పోల‌వ‌రం పూర్తి చేసి నీరు అందిస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. బ‌న‌క‌చ‌ర్ల విష‌యంపై కేంద్రాన్ని ఒప్పించే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌ని, దీనికి సంబంధించి డీపీఆర్ కూడా రెడీ అవుతోంద‌న్నారు. అయితే.. ఏదైనా పెద్ద ప్రాజెక్టును సంక‌ల్పించిన‌ప్పుడు చిన్న చిన్న అవాంత‌రాలు వ‌స్తాయ‌ని, కానీ, వీటిని వైసీపీ నేత‌లు పెద్ద‌వి చేసి చూపిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. వీటిని న‌మ్మొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. “రాముడంత‌టి వాడికి కూడా క‌ష్టాలు త‌ప్ప‌లేదు.“ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మ‌నం క‌లియుగంలో ఉన్నామ‌ని, రాక్ష‌సుల‌తో పోరాటం చేస్తున్నామ‌ని ప‌రోక్షంగా వైసీపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

This post was last modified on August 29, 2025 9:07 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

2 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

2 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

3 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

5 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

6 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

6 hours ago