Political News

ఇప్ప‌డు కొస‌రే… `అస‌లు` ముందుంది: సీఎం చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్ధిపై ఆయ‌న స్పందిస్తూ.. ఇది కొసరేన‌ని.. అస‌లు అభివృద్ధి ముందుంద‌ని చెప్పారు. గ‌త 15 నెల్లలో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్న ఆయ‌న‌.. అస‌లు అభివృద్ధి, పెట్టుబ‌డుల సాధ‌న వంటివి ముందున్నాయ‌ని చెప్పారు. ఈ 15 మాసాల్లో 15 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు ద‌క్కించుకున్నామ‌న్నారు. ఇవి త్వ‌ర‌లోనే సాకారం అవుతాయ‌ని చెప్పారు. త‌ద్వారా ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని వివ‌రించారు. తాజాగా విశాఖ‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు మాట్లాడారు.

రాబోయే నాలుగు సంవ‌త్స‌రాల్లో కూట‌మి ప్ర‌భుత్వం ఏం చేయ‌నుందో సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. “ఏడాదిన్న‌ర కూడా గ‌డ‌వ‌క‌ముందే.. సూప‌ర్ 6 హామీల‌ను అమ‌లు చేశాం. మ‌హిళ‌ల‌కు త‌ల్లికి వంద‌నం, ఉచిత ఆర్టీసీ బ‌స్సులు చేరువ చేశాం. రైతుల‌కు అన్న‌దాత సుఖీభ‌వ ఇచ్చాం. ఇంకా చేయాల్సిన‌వి చాలానే ఉన్నాయి. కొన్ని చెప్పిన‌వి.. చాలా చెప్ప‌నివి కూడా చేశాం. పెట్టుబ‌డులు రానున్నాయి. వీటితో ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు మ‌రింత మెరుగు ప‌డ‌నున్నాయి“ అని చంద్ర‌బాబు చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప్రాజెక్టుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు.

అదేవిధంగా రాజ‌ధానిని 2027 నాటికి స‌గానికిపైగా పూర్తి చేయ‌నున్నట్టు వివ‌రించారు. 2029 నాటికి పోల‌వ‌రం పూర్తి చేసి నీరు అందిస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. బ‌న‌క‌చ‌ర్ల విష‌యంపై కేంద్రాన్ని ఒప్పించే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌ని, దీనికి సంబంధించి డీపీఆర్ కూడా రెడీ అవుతోంద‌న్నారు. అయితే.. ఏదైనా పెద్ద ప్రాజెక్టును సంక‌ల్పించిన‌ప్పుడు చిన్న చిన్న అవాంత‌రాలు వ‌స్తాయ‌ని, కానీ, వీటిని వైసీపీ నేత‌లు పెద్ద‌వి చేసి చూపిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. వీటిని న‌మ్మొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. “రాముడంత‌టి వాడికి కూడా క‌ష్టాలు త‌ప్ప‌లేదు.“ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మ‌నం క‌లియుగంలో ఉన్నామ‌ని, రాక్ష‌సుల‌తో పోరాటం చేస్తున్నామ‌ని ప‌రోక్షంగా వైసీపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

This post was last modified on August 29, 2025 9:07 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago