Political News

ఇప్ప‌డు కొస‌రే… `అస‌లు` ముందుంది: సీఎం చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్ధిపై ఆయ‌న స్పందిస్తూ.. ఇది కొసరేన‌ని.. అస‌లు అభివృద్ధి ముందుంద‌ని చెప్పారు. గ‌త 15 నెల్లలో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్న ఆయ‌న‌.. అస‌లు అభివృద్ధి, పెట్టుబ‌డుల సాధ‌న వంటివి ముందున్నాయ‌ని చెప్పారు. ఈ 15 మాసాల్లో 15 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు ద‌క్కించుకున్నామ‌న్నారు. ఇవి త్వ‌ర‌లోనే సాకారం అవుతాయ‌ని చెప్పారు. త‌ద్వారా ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని వివ‌రించారు. తాజాగా విశాఖ‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు మాట్లాడారు.

రాబోయే నాలుగు సంవ‌త్స‌రాల్లో కూట‌మి ప్ర‌భుత్వం ఏం చేయ‌నుందో సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. “ఏడాదిన్న‌ర కూడా గ‌డ‌వ‌క‌ముందే.. సూప‌ర్ 6 హామీల‌ను అమ‌లు చేశాం. మ‌హిళ‌ల‌కు త‌ల్లికి వంద‌నం, ఉచిత ఆర్టీసీ బ‌స్సులు చేరువ చేశాం. రైతుల‌కు అన్న‌దాత సుఖీభ‌వ ఇచ్చాం. ఇంకా చేయాల్సిన‌వి చాలానే ఉన్నాయి. కొన్ని చెప్పిన‌వి.. చాలా చెప్ప‌నివి కూడా చేశాం. పెట్టుబ‌డులు రానున్నాయి. వీటితో ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు మ‌రింత మెరుగు ప‌డ‌నున్నాయి“ అని చంద్ర‌బాబు చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప్రాజెక్టుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు.

అదేవిధంగా రాజ‌ధానిని 2027 నాటికి స‌గానికిపైగా పూర్తి చేయ‌నున్నట్టు వివ‌రించారు. 2029 నాటికి పోల‌వ‌రం పూర్తి చేసి నీరు అందిస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. బ‌న‌క‌చ‌ర్ల విష‌యంపై కేంద్రాన్ని ఒప్పించే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌ని, దీనికి సంబంధించి డీపీఆర్ కూడా రెడీ అవుతోంద‌న్నారు. అయితే.. ఏదైనా పెద్ద ప్రాజెక్టును సంక‌ల్పించిన‌ప్పుడు చిన్న చిన్న అవాంత‌రాలు వ‌స్తాయ‌ని, కానీ, వీటిని వైసీపీ నేత‌లు పెద్ద‌వి చేసి చూపిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. వీటిని న‌మ్మొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. “రాముడంత‌టి వాడికి కూడా క‌ష్టాలు త‌ప్ప‌లేదు.“ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మ‌నం క‌లియుగంలో ఉన్నామ‌ని, రాక్ష‌సుల‌తో పోరాటం చేస్తున్నామ‌ని ప‌రోక్షంగా వైసీపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

This post was last modified on August 29, 2025 9:07 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago