Political News

విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు, ప్రత్యేకంగా వీరికోసమే!

విశాఖ‌ప‌ట్నానికి సీఎం చంద్ర‌బాబు డ‌బుల్ డెక్క‌ర్ వ‌న్నెలు తెచ్చారు. తాజాగా ప‌ర్యాట‌కుల కోసం.. డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను ఆయ‌న ప్రారంభించారు. విశాఖ ప్ర‌స్తుతం ప‌ర్యాట‌క ప్రాంతాల్లో నెంబ‌ర్ 1గా ఉంద‌ని.. దీనికి మ‌రింత శోభ‌ను చేకూర్చేందుకు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను ప్ర‌వేశ పెట్టామ‌ని సీఎం తెలిపారు. శుక్ర‌వారం విశాఖ‌లో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. సాయంత్రం విశాఖ‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం రామ‌కృష్ణా బీచ్‌లో వీటిని ఆయ‌న ప్రారంభించారు. అనంత‌రం.. పార్టీ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి కొద్ది దూరం ప్ర‌యాణించారు.

నిత్యం ప‌ర్యాట‌కుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన ఈ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు.. ఏపీలోను, ముఖ్యంగా విశాఖ‌లోనూ తీసుకురావ‌డం ఇదే తొలిసారి. జిల్లాలో నిత్యం ఆర్కే బీచ్ నుంచి మ‌రో ప‌ర్యాట‌క ప్రాంతం తొట్లకొండ మ‌ధ్య ఈ బ‌స్సులు సేవ‌లు అందిస్తాయి. మొత్తం 16 కిలో మీట‌ర్ల మేర ఈ బ‌స్సులు ప్ర‌యాణించ‌నున్నాయి. ఇవి పూర్తిగా హ‌రిత ఇంధ‌న మైన విద్యుత్‌తోనే న‌డ‌వ‌నున్నాయి. బ‌స్సుల‌ను ప్రారంభించిన అనంత‌రం చంద్ర‌బాబు వాటిలో కొద్ది దూరం ప్ర‌యాణించి.. విశాఖ తీర అందాల‌ను ఆస్వాదించారు. బ‌స్సులో కూర్చుంటే.. విశాఖ న‌గ‌రం మొత్తం క‌నిపించేలా డిజైన్ చేశార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు.

అనంత‌రం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. విశాఖ‌ను రాజ‌ధానిగా చేస్తామ‌ని గ‌త పాల‌కులు క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్పార‌ని.. బంగారం వంటి అమ‌రావ‌తిని అట‌కెక్కించార‌ని విమ‌ర్శించారు. అయినా.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించార‌ని చెప్పారు. కూట‌మికి ఇక్కడి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని అన్నారు. ఆసియా టెక్నాలజీ హబ్‌గా, రాష్ట్ర ఆర్థిక, ఐటీ క్యాపిట‌ల్‌గా విశాఖ ప‌ట్నం మారుతోంద‌ని, భ‌విష్య‌త్తులో ఈ న‌గ‌రం ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా ఉంటుంద‌ని చెప్పారు. త్వరలో డేటా సెంటర్‌, సీ కేబుల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేబుల్‌ ద్వారా విశాఖతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందని చంద్ర‌బాబు చెప్పారు. దేశంలోని ప‌లు న‌గ‌రాల‌తో విశాఖ పోటీ ప‌డుతూ.. అన్ని రంగాల్లోనూ పుంజుకుంటోంద‌ని వివ‌రించారు.

This post was last modified on August 29, 2025 8:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

36 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

42 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago