Political News

`రుషికొండ ప్యాలెస్‌`ను ఏం చేయాలో తెలీట్లా!: పవన్

వైసీపీ పాల‌నా కాలంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ముఖ పర్యాట‌క ప్రాంతం రుషికొండ‌పై నిర్మించిన ప్యాలెస్ ను ఏం చేయాలో తెలియడం లేద‌ని జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. దీని నిర్మాణానికి 500 కోట్ల‌కు పైగానే ప్ర‌జా ధ‌నం వెచ్చించార‌ని తెలిపారు. విశాఖ‌లో సేన‌తో సేనాని కార్యక్రమం నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ రుషికొండ‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. ప్యాలెస్‌లోని ప్ర‌తి గదినీ ప‌రిశీలించారు.

అనంత‌రం.. మాట్లాడుతూ.. ప్యాలెస్‌లోని రెండు బ్లాక్ ల నిర్మాణానికి 90 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశార‌ని తెలిపారు. ఇక‌, ప్ర‌ధాన బ్లాక్‌ను 70 కోట్ల వ్య‌యంతో నిర్మించార‌న్నారు. మొత్తం ఏడు బ్లాకులుగా దీనిని నిర్మించాల‌ని ప్లాన్ చేశార‌ని, కానీ, 4 మాత్ర‌మే నిర్మించార‌ని చెప్పారు. ఈ 4 బ్లాకుల‌తోకే 454 కోట్లను ఖర్చు చేశారని, మిగిలిన వాటికి అంచ‌నాలు లేవ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జాధ‌నాన్ని వృథా ఎలా చేయొచ్చో.. వైసీపీ పాల‌న‌ను చూస్తే అర్థం అవుతుంద‌ని విమ‌ర్శించారు.

“గతంలో మమ్మల్ని రానివ్వలేదు… ఎన్నో అడ్డంకులు సృష్టించారు. గతంలో రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి 7 కోట్లు ఆదాయం ఉండేది. ప్రస్తుతం కేవలం కరెంట్ బిల్లు క‌ట్ట‌డానికి సంవత్సరానికి 15 లక్షలు అవుతోంది. దీనిని చెల్లిస్తున్నాం. మిగతా వాటికోసం ఇంకా మాట్లాడనవసరం లేదు, ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. లోపల పెచ్చులు ఉడిపోతున్నాయి కొన్ని చోట్ల లీకేజ్ అవుతోంది. “ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

అప్ప‌టి సీఎం జ‌గ‌న్ ఇక్క‌డ నివాసం ఉండేందుకు.. ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోపించారు. ఒక ముఖ్య‌మంత్రి నివాసానికి 500 కోట్లు వెచ్చించడం ఎక్క‌డా లేద‌న్నారు. ఇక‌, ఇప్పుడు ఈ ప్యాలెస్‌ను ప‌ర్యాట‌క ప్రాంతంగా మార్చాల‌ని ఆలోచ‌న చేస్తున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఇలా చేస్తే ఆదాయం వ‌స్తుందా? రాదా? అనేది డోలాయ‌మానంగా ఉంద‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మేజర్ గా ఈ నిర్మాణాన్ని ఎలా ఉపయోగించాలో ఆలోచన చేస్తున్నామ‌న్నారు.

This post was last modified on August 29, 2025 6:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

2 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

2 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

3 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

5 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

6 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

6 hours ago