Political News

`రుషికొండ ప్యాలెస్‌`ను ఏం చేయాలో తెలీట్లా!: పవన్

వైసీపీ పాల‌నా కాలంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ముఖ పర్యాట‌క ప్రాంతం రుషికొండ‌పై నిర్మించిన ప్యాలెస్ ను ఏం చేయాలో తెలియడం లేద‌ని జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. దీని నిర్మాణానికి 500 కోట్ల‌కు పైగానే ప్ర‌జా ధ‌నం వెచ్చించార‌ని తెలిపారు. విశాఖ‌లో సేన‌తో సేనాని కార్యక్రమం నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ రుషికొండ‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. ప్యాలెస్‌లోని ప్ర‌తి గదినీ ప‌రిశీలించారు.

అనంత‌రం.. మాట్లాడుతూ.. ప్యాలెస్‌లోని రెండు బ్లాక్ ల నిర్మాణానికి 90 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశార‌ని తెలిపారు. ఇక‌, ప్ర‌ధాన బ్లాక్‌ను 70 కోట్ల వ్య‌యంతో నిర్మించార‌న్నారు. మొత్తం ఏడు బ్లాకులుగా దీనిని నిర్మించాల‌ని ప్లాన్ చేశార‌ని, కానీ, 4 మాత్ర‌మే నిర్మించార‌ని చెప్పారు. ఈ 4 బ్లాకుల‌తోకే 454 కోట్లను ఖర్చు చేశారని, మిగిలిన వాటికి అంచ‌నాలు లేవ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జాధ‌నాన్ని వృథా ఎలా చేయొచ్చో.. వైసీపీ పాల‌న‌ను చూస్తే అర్థం అవుతుంద‌ని విమ‌ర్శించారు.

“గతంలో మమ్మల్ని రానివ్వలేదు… ఎన్నో అడ్డంకులు సృష్టించారు. గతంలో రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి 7 కోట్లు ఆదాయం ఉండేది. ప్రస్తుతం కేవలం కరెంట్ బిల్లు క‌ట్ట‌డానికి సంవత్సరానికి 15 లక్షలు అవుతోంది. దీనిని చెల్లిస్తున్నాం. మిగతా వాటికోసం ఇంకా మాట్లాడనవసరం లేదు, ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. లోపల పెచ్చులు ఉడిపోతున్నాయి కొన్ని చోట్ల లీకేజ్ అవుతోంది. “ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

అప్ప‌టి సీఎం జ‌గ‌న్ ఇక్క‌డ నివాసం ఉండేందుకు.. ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోపించారు. ఒక ముఖ్య‌మంత్రి నివాసానికి 500 కోట్లు వెచ్చించడం ఎక్క‌డా లేద‌న్నారు. ఇక‌, ఇప్పుడు ఈ ప్యాలెస్‌ను ప‌ర్యాట‌క ప్రాంతంగా మార్చాల‌ని ఆలోచ‌న చేస్తున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఇలా చేస్తే ఆదాయం వ‌స్తుందా? రాదా? అనేది డోలాయ‌మానంగా ఉంద‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మేజర్ గా ఈ నిర్మాణాన్ని ఎలా ఉపయోగించాలో ఆలోచన చేస్తున్నామ‌న్నారు.

This post was last modified on August 29, 2025 6:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago