Political News

చేసిన మంచిని మ‌రిచి.. న‌న్ను తిడుతున్నారు: ప‌వ‌న్

“చేసిన మంచిని మ‌రిచి.. న‌న్ను తిడుతున్నారు“- అని జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. అయినా.. తాను బాధ‌ప‌డ‌డం లేద‌ని, ఇంకా మంచి చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని అన్నారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హిస్తున్న `సేన‌తో సేనాని` కార్య‌క్ర‌మంలో ప‌లు విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థిని సుగాలి ప్రీతి దారుణ హ‌త్య‌, అనంత‌ర ప‌రిణాల‌ను ప్ర‌స్తావిస్తూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

2017-18 మ‌ధ్య సుగాలి ప్రీతి హ‌త్య‌కు గురైంది. అయితే.. ఈ కేసులో నిందితులు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టుబ‌డలేదు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం కూడా ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకోలేదు. దీంతో జ‌న‌సేన అధిప‌తిగా.. ఆనాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. క‌ర్నూలులో ఈ విష‌యంపై క‌దం తొక్కారు. ఫ‌లితంగా సుగాలి ప్రీతి త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌భుత్వం ప‌రిహారం ప్ర‌క‌టించింది. అయితే.. నాడు ప‌వ‌న్ త‌మ‌కు ఇచ్చిన మాట‌ను నెర‌వేర్చ‌డం లేద‌ని.. ఆయ‌నపై త‌మ‌కు న‌మ్మ‌కం పోయింద‌ని ఇటీవ‌ల సుగాలి ప్రీతి మాతృమూర్తి పార్వ‌తి మీడియా ముందు వ్యాఖ్యానించారు. సోష‌ల్‌ మీడియాలోనూ కామెంట్లు చేశారు.

ఈ వ్య‌వ‌హారంపై తాజాగా స్పందించిన ప‌వ‌న్ కల్యాణ్‌.. పార్వ‌తి తీరుపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. “మంచిని మ‌రిచి.. న‌న్ను తిడుతున్నారు“ అని అన్నారు. అంద‌రూ మ‌రిచిపోయిన ప‌రిస్థితిలో సుగాలి ప్రీతి కేసును తానే భుజాన వేసుకుని క‌ర్నూలులో ఉద్య‌మం సృష్టించాన‌ని చెప్పారు. దీంతో దిగి వ‌చ్చిన అప్ప‌టి వైసీపీ ప్ర‌భుత్వం ఈ కుటుంబానికి 5 ఎక‌రాల పోలం, 500 సెంట్ల భూమిని, సుగాలి తండ్రికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇచ్చింద‌న్నారు. అదేస‌మ‌యంలో 25 ల‌క్ష‌ల రూపాయ‌లు కూడా ఇచ్చార‌ని తెలిపారు.

వీటితోపాటు.. ఈ కేసును సీబీఐకి అప్ప‌గించేలా కూడా తాను అప్ప‌ట్లో ఒత్తిడి తెచ్చాన‌ని గుర్తు చేశారు. తాను ఇంత చేస్తే.. ఇప్పుడు త‌న‌పైనే పార్వ‌తి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బ‌లు త‌గులుతాయ‌ని వ్యాఖ్యానించారు. అయినా.. తాను బాధ‌ప‌డ‌డం లేద‌ని.. ఓ ఆడ‌కూతురుకి న్యాయం చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాన‌ని చెప్పారు.

This post was last modified on August 29, 2025 6:27 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

1 hour ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

6 hours ago