రెండేళ్ల కిందట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో చేరిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తాను చిన్నప్పటి నుంచే కాంగ్రెస్ అభిమానిని అంటూ ఆ పార్టీ తరఫున గట్టిగానే ప్రచార కార్యక్రమాలు చేపట్టాడు బండ్ల. పేరున్న నాయకుల కంటే బండ్లనే ఎక్కువగా మీడియాలో హైలైట్ అయ్యాడు. జోరుగా ప్రచారం చేశాడు. కానీ అతడి వ్యాఖ్యల్ని, విమర్శల్ని సీరియస్గా తీసుకున్న వాళ్లు తక్కువమందే.
ఎందుకంటే పంచ్ డైలాగులు, ఫన్నీ కామెంట్లు సినిమాల్లో వర్కవుట్ అవుతాయి కానీ.. రాజకీయాల్లో పని చేయవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే 7 ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటానంటూ బండ్ల చేసిన కామెంట్ ఎంత కామెడీ అయిపోయిందో తెలిసిందే. ఇంకా పలు రకాల కామెంట్లు ఇలాగే తయారయ్యాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఫలితాలు రావడం, బండ్ల కాంగ్రెస్ పార్టీకే కాదు రాజకీయాలకు టాటా చెప్పేయడం తెలిసిందే.
ఇక అప్పట్నుంచి సినీ రంగంలో హీరోలను కాకా పట్టినట్లే అధికార పార్టీ ముఖ్య నేతల్ని దువ్వే ప్రయత్నం చేస్తున్నాడు బండ్ల. గత ఏడాదిలో కేసీఆర్, కేటీఆర్లను ఎన్నిసార్లు పొగిడాడో.. వారికి ఏ రేంజిలో ఎలివేషన్లు ఇచ్చాడో అందరికీ తెలుసు. ఐతే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బండ్ల గణేష్ పాత కామెంట్లను బయటికి తీసి అతణ్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. టీఆర్ఎస్ పెద్దల మీద అతడి పంచ్ డైలాగులను వాడుకుంటున్నారు.
ఇది బండ్లకు చాలా ఇబ్బందిగా మారింది. అప్పట్లో చేసిన కామెంట్లను ఇప్పుడు వాడుకోవడం తగదని.. ప్రస్తుతం తనకు ఏ రాజకీయ పార్టీతో కానీ.. రాజకీయాలతో కానీ సంబంధం లేదని.. తాను రాజకీయాలకు దూరం అని.. దయచేసిన తన పాత కామెంట్లు పోస్టులను ఇప్పుడు తీసుకురావద్దని బండ్ల గణేష్ ట్విట్టర్లో విజ్ఞప్తి చేశాడు. రాజకీయ నాయకులు మాట మార్చడం మామూలే. ఐతే తాత్కాలికంగా రాజకీయాల్లో ఉన్న బండ్ల ఇక రాజకీయాల్లోకే రానంటున్నాడు కాబట్టి పాత వ్యవహారాలతో ముడిపెట్టి అతణ్ని ఇరుకున పెట్టడం సరికాదేమో.
బూజు పట్టిన, ప్రజలకు పనికిరాని రూల్స్ను బుట్టదాఖలు చేయాలని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…