Political News

‘సేనతో సేనాని’తో తెలంగాణలో ‘గ్లాసు’ గలగల

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన ప్రస్తుతం ఏపీలోనే యాక్టివ్ గా ఉంది. ప్రారంభం నాడు రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ కార్యకలాపాలను సాగించేలా వ్యూహం రచించినా… ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఎప్పటికప్పుడు తెలంగాణలో కూడా పార్టీని విస్తరిద్దామని అనుకుంటున్నా…ఏవో అవాంతరాలు అడ్డుపడుతూనే ఉన్నాయి. అయితే పార్టీని నమ్ముకుని పవన్ వెంట నడిచిన తెలంగాణ జనసేన నేతలు ఇప్పటికీ పార్టీతోనే ఉన్నారు. తాజాగా సేనతో సేనాని పేరిట విశాఖలో జరగనున్న భారీ కార్యక్రమం తర్వాత తెలంగాణలోనూ పార్టీ కార్యకలాపాలు ఊపందుకుంటాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

సాధారణంగా జనసేనకు సంబంధించి భారీ కార్యక్రమాలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా… ఏపీ కేడర్ తో పాటు తెలంగాణ కేడర్ కూడా పాలుపంచుకుంటోంది. వీరితో పాటుగా తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రల నుంచి కూడా పవన్ ఫ్యాన్స్ పార్టీ వేడుకలకు హాజరవుతున్నారు. అయితే ఈ దఫా విశాఖలో ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు నాన్ స్టాప్ గా జరగనున్న సేనతో సేనాని సమావేశాలకు పార్టీ తెలంగాణ కార్యవర్గానికి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. దీంతో ఈ సమావేశాలకు తెలంగాణలో పార్టీ విస్తరణ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు రాజకీయ వాతావరణం తదితరాలపై వివరాలను సేకరించుకుంటూ తెలంగాణ నేతలు ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. సేనతో సేనాని సమావేశం ఆద్యంతం పవన్ కల్యాణ్ కేడర్ కు అందుబాటులోనే ఉండనున్నారు. సమావేశాలు జరిగే మూడు రోజులూ ఆయన ఈ సమావేశాల్లోనే పాలుపంచుకుంటారు. చివరి రోజున జరిగే బహిరంగ సభలో తెలంగాణలో పార్టీ విస్తరణ, భవిష్యత్తు లక్ష్యాలకు సంబంధించి తెలంగాణ నేతలకు పవన్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అంతకుముందు రెండు రోజుల్లో తెలంగాణ కేడర్ కు కొంత ప్రత్యేక సమయాన్ని కేటాయించి తాజా పరిస్థితుల గురించి వివరాలు తెలుసుకుని మరీ పవన్ పార్టీ విస్తరణకు సంబంధించిన వ్యూహాలను రచించి వారికి ఇవ్వనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా… ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ నానాటికీ బలహీన పడుతోంది. అందులో భాగంగా పార్టీకి చెందిన చాలా మంది కీలక నేతలు ఇప్పటికే పార్టీని వీడగా…మరింత మంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ మరింతగా బలహీనపడే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో ఓ మోస్తరు పుంజుకుంటే… బీజేపీనే ఆ పార్టీతో తెలంగాణలోనూ పొత్తు పెట్టుకుని ముందుకు సాగే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో సేనతో సేనాని తర్వాత తెలంగాణలో జనసేన విస్తరణ పక్కానే అని చెప్పొచ్చు.

This post was last modified on August 25, 2025 2:08 pm

Share

Recent Posts

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

41 minutes ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

1 hour ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

1 hour ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

2 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

4 hours ago

చంద్రబాబు విజనరీ గ్రేట్… దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…

5 hours ago