Political News

‘సేనతో సేనాని’తో తెలంగాణలో ‘గ్లాసు’ గలగల

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన ప్రస్తుతం ఏపీలోనే యాక్టివ్ గా ఉంది. ప్రారంభం నాడు రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ కార్యకలాపాలను సాగించేలా వ్యూహం రచించినా… ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఎప్పటికప్పుడు తెలంగాణలో కూడా పార్టీని విస్తరిద్దామని అనుకుంటున్నా…ఏవో అవాంతరాలు అడ్డుపడుతూనే ఉన్నాయి. అయితే పార్టీని నమ్ముకుని పవన్ వెంట నడిచిన తెలంగాణ జనసేన నేతలు ఇప్పటికీ పార్టీతోనే ఉన్నారు. తాజాగా సేనతో సేనాని పేరిట విశాఖలో జరగనున్న భారీ కార్యక్రమం తర్వాత తెలంగాణలోనూ పార్టీ కార్యకలాపాలు ఊపందుకుంటాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

సాధారణంగా జనసేనకు సంబంధించి భారీ కార్యక్రమాలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా… ఏపీ కేడర్ తో పాటు తెలంగాణ కేడర్ కూడా పాలుపంచుకుంటోంది. వీరితో పాటుగా తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రల నుంచి కూడా పవన్ ఫ్యాన్స్ పార్టీ వేడుకలకు హాజరవుతున్నారు. అయితే ఈ దఫా విశాఖలో ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు నాన్ స్టాప్ గా జరగనున్న సేనతో సేనాని సమావేశాలకు పార్టీ తెలంగాణ కార్యవర్గానికి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. దీంతో ఈ సమావేశాలకు తెలంగాణలో పార్టీ విస్తరణ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు రాజకీయ వాతావరణం తదితరాలపై వివరాలను సేకరించుకుంటూ తెలంగాణ నేతలు ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. సేనతో సేనాని సమావేశం ఆద్యంతం పవన్ కల్యాణ్ కేడర్ కు అందుబాటులోనే ఉండనున్నారు. సమావేశాలు జరిగే మూడు రోజులూ ఆయన ఈ సమావేశాల్లోనే పాలుపంచుకుంటారు. చివరి రోజున జరిగే బహిరంగ సభలో తెలంగాణలో పార్టీ విస్తరణ, భవిష్యత్తు లక్ష్యాలకు సంబంధించి తెలంగాణ నేతలకు పవన్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అంతకుముందు రెండు రోజుల్లో తెలంగాణ కేడర్ కు కొంత ప్రత్యేక సమయాన్ని కేటాయించి తాజా పరిస్థితుల గురించి వివరాలు తెలుసుకుని మరీ పవన్ పార్టీ విస్తరణకు సంబంధించిన వ్యూహాలను రచించి వారికి ఇవ్వనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా… ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ నానాటికీ బలహీన పడుతోంది. అందులో భాగంగా పార్టీకి చెందిన చాలా మంది కీలక నేతలు ఇప్పటికే పార్టీని వీడగా…మరింత మంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ మరింతగా బలహీనపడే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో ఓ మోస్తరు పుంజుకుంటే… బీజేపీనే ఆ పార్టీతో తెలంగాణలోనూ పొత్తు పెట్టుకుని ముందుకు సాగే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో సేనతో సేనాని తర్వాత తెలంగాణలో జనసేన విస్తరణ పక్కానే అని చెప్పొచ్చు.

This post was last modified on August 25, 2025 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌మ‌న్నా కాళ్లు ప‌ట్టుకుంటాన‌న్న న‌టుడు

బాలీవుడ్లో వచ్చిన కల్ట్ బ్లాక్ బస్టర్ విక్కీ డోనర్ చూసిన ప్రేక్షకులు ఎవ్వరూ అందులో డాక్టర్ గా కీలక పాత్ర…

2 hours ago

ఓటీటీల కొత్త కండిషన్… పెద్ద తలనొప్పే

ఆరేళ్ల ముందు కొవిడ్ టైంలో థియేటర్లు మూతపడడంతో.. ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం ఒక్కసారిగా ఓటీటీలు విజృంభించేశాయి. ఫిలిం…

2 hours ago

మండలి చైర్మన్ పై అవివేశ్వాస తీర్మానం?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం శాస‌న మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టే అంశంపై…

4 hours ago

బీఆర్ ఎస్‌కు అవ‌కాశం ఇస్తే ఎలా?

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియ‌ర్లు గుర్రుగా ఉన్న నేప‌థ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…

4 hours ago

కనకరాజు కాస్త త్వరగా రావొచ్చుగా

2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…

5 hours ago

శ్రీవిష్ణు అస్సలు తగ్గడం లేదు

ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…

6 hours ago