Political News

సేన‌తో సేనాని: జ‌న‌సేన వినూత్న కార్య‌క్ర‌మం

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న జ‌న‌సేన పార్టీ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. ‘సేన‌తో సేనాని’ పేరుతో నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన వాల్ పోస్ట‌ర్‌ను జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ తాజాగా ఆదివారం విశాఖ‌ప‌ట్నంలోని జ‌న‌సేన కార్యాలయంలో ఆవిష్క‌రించారు. ఇది పూర్తిగా పార్టీ కార్య‌క్ర‌మ‌మ‌ని ఆయ‌న చెప్పారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అంద‌రూ పాల్గొంటార‌ని తెలిపారు.

30వ తేదీన విశాఖ‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి నాదెండ్ల వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల ప‌నితీరు, ప్ర‌జా ప్ర‌తినిధుల పాత్ర‌, ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు చేరువ అయిన వారి అనుభ‌వాల‌ను తెలుసుకుంటామ‌ని వివ‌రించారు. ఈ మూడు రోజుల పాటు పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొంటార‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే పార్టీలో విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఇత‌ర నాయ‌కుల గురించి కూడా స‌మీక్షించ‌నున్న‌ట్టు వివ‌రించారు.

ఈ నెల 28న ఎమ్మ‌ల్యేలతో ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ కానున్నార‌ని నాదెండ్ల తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పార్టీ ప‌నితీరు, ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్న తీరును స‌మీక్షించ‌నున్న‌ట్టు వివ‌రించారు. అదేవిధంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, ప్ర‌జావాణిలో వ‌స్తున్న ఫిర్యాదుల ప‌రిష్కారం.. ప్ర‌జ‌ల స్పంద‌న‌ను తెలుసు కుంటార‌ని చెప్పారు. ముఖ్యంగా జ‌న‌సేన పార్టీ మంత్రుల శాఖ‌ల ద్వారా జ‌రుగుతున్న అభివృద్ధి, ప్ర‌జ‌ల స‌మ‌స్యల ప‌రిష్కారం పై దృష్టి పెట్ట‌నున్న‌ట్టు వివ‌రించారు.

29న ఎంపీల‌తో భేటీ అంటుంద‌న్నారు. పార్ల‌మెంటులో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, పార్ల‌మెంటు నియోజ‌క‌వర్గా ల్లో జ‌రుగుతున్న అభివృద్ధి, ఇత‌రత్రా ప‌నులు స‌హా.. ఎంపీల ప‌నితీరును కూడా అంచ‌నా వేస్తార‌ని నాదెం డ్ల పేర్కొన్నారు. దీని ప్ర‌కారం భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను ఏర్పాటు చేసుకుంటామ‌ని వివ‌రించారు. ఇక‌, 30న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను ఉద్దేశించి బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగించ‌నున్న‌ట్టు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయ‌డ‌మేన‌ని పేర్కొన్నారు.

This post was last modified on August 24, 2025 4:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏఎంబీ… ఇక్కడ హిట్… అక్కడ ఫ్లాప్?

ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…

1 minute ago

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

2 hours ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

జనసైనికుల మనసు దోచుకున్న నారా లోకేష్

“మనకు అన్నీ బాగున్నప్పుడు అందరూ తోడుంటారు. కానీ కష్టకాలంలో అండగా నిలిచినవారే మనవారు. అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు”…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

3 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago