Political News

ఎన్డీఏ అదిరే వ్యూహం.. ‘వైస్ ప్రసిడెంట్’ అభ్యర్థి గా తమిళియన్

త్వరలోనే పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో దక్షిణాదిలోని కీలక రాష్ట్రం తమిళనాడు కూడా ఉంది. తమిళనాడు ఇప్పటిదాకా అడుగు కూడా పెట్టలేకపోతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ..ఈ దఫా ఓ అదిరేటి వ్యూహంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా ఇటీవలే ఖాళీ అయిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ అభ్యర్తిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గతంలో తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రాధాకృష్ణన్… ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు. గతంలో మన తెలుగు రాష్ట్రం తెలంగాణకు కూడా ఆయన కొంతకాలం పాటు గవర్నర్ గా వ్యవహరించారు. జార్ఖండ్ గవర్నర్ గానూ ఆయన పనిచేశారు. వెరసి రాజ్యాంగబద్ధ విషయాలపై మంచి పట్టున్న నేతగా సీపీ రాధాకృష్ణన్ కు మంచి పేరుంది. అధికార పక్షం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాధాకృష్ణన్.. ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం ఖాయమేనని చెప్పక తప్పదు. విపక్షం ఇండియా కూటమి ఎన్ని ఎత్తులు వేసినా… ఆ కూటమి విజయం సాధించే ఛాన్సే లేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

తమిళనాడు రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలు చాలాకాలంగా ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాగైనా తమిళనాడు రాజకీయాలపై పట్టు సాధించే దిశగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమేర ఫలితాలు వస్తున్నా… ఎదురు దెబ్బలే అదికంగా తగులుతున్నాయి. అయినా కూడా మోదీ, షాలు తమిళనాడు పాలిటిక్స్ పై ఎంతమాత్రం దృష్టి మరల్చడం లేదు. వచ్చే ఏడాది ఆరంభంలో తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం ద్వారా ఓ మోస్తరు ప్రయోజనం పొందవచ్చన్నది మోదీ, షాల భావనగా తెలుస్తోంది.

This post was last modified on August 17, 2025 8:56 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago