Political News

వైసీపీ గొంతెమ్మ కోరిక‌లు!

కోరిక‌లు త‌ప్పుకాదు.. కానీ, అలివికాని కోరిక‌లే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తాయి. రాజ‌కీయాల్లో అయినా అంతే!. ఏపీ విప‌క్ష పార్టీ వైసీపీ విష‌యంలోనూ ఇలానే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. అలివికాని కోరిక‌ల‌తో రాజ‌కీయాలు చేస్తోంది. ఈ నెల 12న జ‌రిగిన పులివెందుల‌, ఒంటిమిట్ట జ‌డ్పీటీసీ స్థానాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. రెండు చోట్లా క‌నీసం డిపా జిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయింది. నిజానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లాలోనే ఉన్న ఈ రెండు జ‌డ్పీలు ఒక‌ప్పుడు వైసీపీకి కంచుకోట‌లు. అయితే.. ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమం, పెట్టుబడుల రాక‌, ఉద్యోగాలు, ఉపాధి అవ‌కాశా ల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు కూట‌మి వైపే మొగ్గు చూపారు.

చెదురు మదురు ఘ‌ట‌న‌లు మిన‌హా.. మొత్తంగా ఈ రెండుఉప ఎన్నిక‌ల‌ను రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు స‌జావుగానే ముగించా రు. అయితే.. స‌హ‌జంగా ఉండే ఫ్రెస్ట్రేష‌న్‌తో పాటు.. రాజ‌కీయ కార‌ణాలు కూడా.. వైసీపిని ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేశాయి. దీంతో త‌న‌ను తాను సంస్క‌రించుకునే ప‌నిని ప్రారంభించాల్సిన పార్టీ.. ఎదురు దాడి చేయ‌డం..ప్రారంభించింది. అంతేకాదు, ఇప్పుడు గొంతెమ్మ కోరిక‌ల‌ను కూడా బ‌య‌ట పెట్టుకుంది. రాష్ట్ర ఎన్నిక‌ల అధికారుల‌కు భారీ ఎత్తున లేఖ‌లు సంధించింది. ‘మాకు ఈ వివ‌రాలు ఇవ్వండి’ అంటూ.. ఆదేశించిన‌ట్టుగా వ్యాఖ్య‌లు రాసింది. అయితే.. ఈ లేఖ‌పై రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు ఎలా స్పందిస్తార‌న్న‌ది చూడాలి.

ఇంత‌కీ వైసీపీ కోరిక‌లు ఏంటంటే..

+ పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి స‌మ‌గ్ర వివ‌రాలు ఇవ్వాలి.

+ పోలింగ్‌ స్టేషన్లు, సీసీ కెమెరా ఫుటేజ్ అందించాలి.

+ పలు ఘటనలకు సంబంధించిన వీడియో కవరేజ్ ఇవ్వాలి.

+ పోలింగ్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్ కూడా ఇవ్వాలి.

+ పోలింగ్ జ‌రిగిన‌ రోజు పోలింగ్‌ బూత్‌ల్లో కూర్చున్న ఏజెంట్ల పేర్లు జాబితా కావాలి.

+ పోలింగ్‌ ఆఫీసర్‌(పీఓ) డైరీ ఇవ్వాలి.

+ ఫామ్‌–12. ఫామ్‌–32 అంశాల పూర్తి వివరాలు, సమాచారం ఇవ్వాలి.

సొంతమ‌నుకున్న‌వారే..

సొంతమ‌నుకున్న అధికారే త‌మ‌కు ఇప్పుడు కొర‌గాకుండా ఉన్నార‌న్న ఆవేదన కూడా వైసీపీలో క‌నిపిస్తోంది. గ‌త వైసీపీ హ‌యాంలో రిటైరైన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్నిని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా అప్ప‌టి సీఎం జ‌గ‌న్ నియ‌మించారు. ప్ర‌స్తుతం కూడా ఆమే ఉన్నారు. అయితే.. ఆమె త‌ట‌స్థంగా విదులు నిర్వ‌హిస్తున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీకి కంట్లో న‌లుసుగా మారింది. “ఏరికోరి ఆరోజు ప‌ద‌వి ఇచ్చాం. అయినా.. మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోవ‌డం లేదు” అంటూ.. నీలం పేరు ఎత్త‌కుండానే గుంటూరుకు చెందిన ఓ నాయ‌కుడు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

అర్జున్ మార్కెట్ బ్రతికే ఉంది

ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…

42 minutes ago

15 ఏళ్ల సూర్యవంశీ… రికార్డులేంటి స్వామి…!

రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్‌ను పూర్తిగా తన సొంతం…

46 minutes ago

ఆర్సీబీ గెలిస్తే ఆస్తులు ధ్వంసం చేస్తారా… ఇదెక్కడి ఫ్యానిజం?

​ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…

1 hour ago

భ్రమలో ఉన్న ఫ్లాప్ దర్శకుడు

తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…

2 hours ago

ఐపీఎల్ 2026 అట్టర్ ఫ్లాప్

ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…

2 hours ago

ఒక్క థియేట‌ర్ మీద ఇంత గొడ‌వా?

నిజామాబాద్‌లో న‌ట‌రాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడ‌వ టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…

3 hours ago