Political News

ఓడితేనే ఓట్ చోరీ గుర్తుకొస్తుందా?: పవన్ కల్యాణ్

భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ఓ కీలక అంశంపై జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే.. వాటి వెనుక ఉన్న పెను ముప్పును కూడా పవన్ కల్యాణ్ వివరించి.. అందరినీ ఆలోచనలో పడేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం కాకినాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీల గురించి ప్రస్తావిస్తూ… ఓడిపోతేనే ఓట్ చోరీ గుర్తుకు వస్తుందా? అంటూ చురకలు అంటించారు.

2019లో వైసీపీ గెలిచి, తాము ఓటమిపాలు అయినప్పుడు తామేమీ ఓట్ చోరీ అనీ, ఈవీఎం ట్యాంపరింగ్ అనీ అనలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించామని, ప్రజా తీర్పును గౌరవించామని గుర్తు చేశారు. అయితే 2024లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ.. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, దానితోనే కూటమి విజయం సాధించిందని, ఈ ఎన్నికలు సక్రమంగా జరగలేదని అసత్య ఆరోపణలు చేసిందని అన్నారు. వైసీపీ గెలిస్తే… ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదని, అదే వైసీపీ ఓడితే మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

ఇక ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారంపైనా పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును ఓట్ చోరీతో పోలుస్తారా? అని ఆయన మండిపడ్డారు. దీని వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని ఆయన సంచలన ఆరోపణ చేశారు. భారత దేశాన్ని అస్థిర పరచేందుకు విదేశీ శక్తులు నిత్యం యత్నిస్తూనే ఉన్నాయని, వాటికి వత్తాసు పలికి రాజకీయ లబ్ధి పొందేలా దేశంలోని కొందరు నేతలు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. దేశంలోని వ్యక్తి సాయం లభిస్తే… దేశాన్ని అస్థిరపరచే పని విదేశీ శక్తులకు ఈజీ కదా అని కూడా పవన్ వివరించారు. ఈ తరహా కుట్రలకు పాల్పడే రాజకీయ నేతలను జనాలు గమనించాలని, వారి కుయుక్తులను భగ్నం చేసే దిశగా కదలాలని ఆయన పిలుపునిచ్చారు.

This post was last modified on August 15, 2025 2:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago