Political News

ఓడితేనే ఓట్ చోరీ గుర్తుకొస్తుందా?: పవన్ కల్యాణ్

భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ఓ కీలక అంశంపై జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే.. వాటి వెనుక ఉన్న పెను ముప్పును కూడా పవన్ కల్యాణ్ వివరించి.. అందరినీ ఆలోచనలో పడేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం కాకినాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీల గురించి ప్రస్తావిస్తూ… ఓడిపోతేనే ఓట్ చోరీ గుర్తుకు వస్తుందా? అంటూ చురకలు అంటించారు.

2019లో వైసీపీ గెలిచి, తాము ఓటమిపాలు అయినప్పుడు తామేమీ ఓట్ చోరీ అనీ, ఈవీఎం ట్యాంపరింగ్ అనీ అనలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించామని, ప్రజా తీర్పును గౌరవించామని గుర్తు చేశారు. అయితే 2024లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ.. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, దానితోనే కూటమి విజయం సాధించిందని, ఈ ఎన్నికలు సక్రమంగా జరగలేదని అసత్య ఆరోపణలు చేసిందని అన్నారు. వైసీపీ గెలిస్తే… ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదని, అదే వైసీపీ ఓడితే మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

ఇక ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారంపైనా పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును ఓట్ చోరీతో పోలుస్తారా? అని ఆయన మండిపడ్డారు. దీని వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని ఆయన సంచలన ఆరోపణ చేశారు. భారత దేశాన్ని అస్థిర పరచేందుకు విదేశీ శక్తులు నిత్యం యత్నిస్తూనే ఉన్నాయని, వాటికి వత్తాసు పలికి రాజకీయ లబ్ధి పొందేలా దేశంలోని కొందరు నేతలు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. దేశంలోని వ్యక్తి సాయం లభిస్తే… దేశాన్ని అస్థిరపరచే పని విదేశీ శక్తులకు ఈజీ కదా అని కూడా పవన్ వివరించారు. ఈ తరహా కుట్రలకు పాల్పడే రాజకీయ నేతలను జనాలు గమనించాలని, వారి కుయుక్తులను భగ్నం చేసే దిశగా కదలాలని ఆయన పిలుపునిచ్చారు.

This post was last modified on August 15, 2025 2:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

2 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

4 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

6 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

9 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

9 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

11 hours ago