Political News

జీఎస్టీ త‌గ్గిస్తాం: ప్ర‌ధాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

దేశ ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఆర్థిక భారంగా మారిన జీఎస్టీ వ్య‌వ‌హారంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్పందించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ‌.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న‌.. జీఎస్టీ వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావించారు. దేశ ప్ర‌జ‌లు జీఎస్టీ గురించి ఏమ‌నుకుంటున్నారో.. త‌న‌కు వినిపిస్తోంద‌న్నారు. దీనిపై ఉద్దీప‌న‌లు (రాయితీ) ప్ర‌క‌టించ‌నున్నామ‌ని ఆయ‌న చెప్పారు. వ‌చ్చే దీపావ‌ళి నాటికి.. జీఎస్టీలో కొత్త సంస్క‌ర‌ణ‌లు తీసుకురానున్న‌ట్టు చెప్పారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌పై భారాలు త‌గ్గిస్తామ‌న్నారు.

సామాన్యులకు కొత్త జీఎస్టీ సంస్కరణలను దీపావళి కానుకగా ఇస్తామ‌ని ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. అంతేకాదు.. వారిపై ప‌న్నుల భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. దీంతో మార్కెట్లు పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌రోవైపు.. యువ‌త‌కోసం.. ప్ర‌ధాని మ‌రో కీల‌క ప‌థ‌కాన్ని కూడా ప్ర‌క‌టించారు. ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌తో ప్ర‌ణాళిక రూపొందించిన‌ట్టు మోడీ తెలిపారు. కొత్త‌గా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు పొందే వారికి.. నెల‌కు 15 వేల చొప్పున మూడేళ్ల‌పాటు కేంద్ర ప్ర‌భుత్వం ఇవ్వ‌నున్నట్టు చెప్పారు.

త‌ద్వారా కొత్త ఉద్యోగాలు క‌ల్పించేందుకు కంపెనీలు ముందుకు వ‌స్తాయ‌న్నారు. దీనివ‌ల్ల ఉపాధి రంగం వృద్ధి చెందుతుంద‌ని వివ‌రించారు. అదేస‌మ‌యంలో స్వ‌దేశీ వ‌స్తువుల త‌యారీ, వినియోగానికి కూడా ప్రాధాన్యం పెంచుతున్న‌ట్టు ప్ర‌ధాని తెలిపారు. తద్వారా దేశ అవ‌స‌రాల కోసం.. పొరుగు దేశాల‌పై ఆధారప డాల్సిన అవ‌స‌రం ఉండ‌బోద‌న్నారు. ప్రతి రంగంలోనూ స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తున్నామ‌ని చెప్పారు. త్వరలో మేడ్‌ ఇన్‌ ఇండియా చిప్‌లు మార్కెట్‌ను ముంచెత్తుతాయ‌ని ప్ర‌ధాని చెప్పారు.

సెమీ కండ‌క్ట‌ర్ల విష‌యంలో దేశం స్వ‌యం స‌మృద్ధి సాధించింద‌న్న ప్ర‌ధాని మోడీ.. ప్ర‌పంచ‌దేశాల‌కు ఎగుమ‌తులు చేసే స్థాయికి చేరుకుంటుంద‌న్నారు. రాష్ట్రాలు కూడా స్వ‌యం స‌మృద్ధి దిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించారు. విక‌సిత భార‌త్ 2047 ల‌క్ష్యంగా భార‌త్ అడుగులు ప‌డుతున్నాయ‌న్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త్ కీల‌క స్థానానికి చేరుకుంటుంద‌న్నారు.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

3 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

4 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

6 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

7 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

8 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

9 hours ago