Political News

జీఎస్టీ త‌గ్గిస్తాం: ప్ర‌ధాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

దేశ ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఆర్థిక భారంగా మారిన జీఎస్టీ వ్య‌వ‌హారంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్పందించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ‌.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న‌.. జీఎస్టీ వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావించారు. దేశ ప్ర‌జ‌లు జీఎస్టీ గురించి ఏమ‌నుకుంటున్నారో.. త‌న‌కు వినిపిస్తోంద‌న్నారు. దీనిపై ఉద్దీప‌న‌లు (రాయితీ) ప్ర‌క‌టించ‌నున్నామ‌ని ఆయ‌న చెప్పారు. వ‌చ్చే దీపావ‌ళి నాటికి.. జీఎస్టీలో కొత్త సంస్క‌ర‌ణ‌లు తీసుకురానున్న‌ట్టు చెప్పారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌పై భారాలు త‌గ్గిస్తామ‌న్నారు.

సామాన్యులకు కొత్త జీఎస్టీ సంస్కరణలను దీపావళి కానుకగా ఇస్తామ‌ని ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. అంతేకాదు.. వారిపై ప‌న్నుల భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. దీంతో మార్కెట్లు పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌రోవైపు.. యువ‌త‌కోసం.. ప్ర‌ధాని మ‌రో కీల‌క ప‌థ‌కాన్ని కూడా ప్ర‌క‌టించారు. ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌తో ప్ర‌ణాళిక రూపొందించిన‌ట్టు మోడీ తెలిపారు. కొత్త‌గా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు పొందే వారికి.. నెల‌కు 15 వేల చొప్పున మూడేళ్ల‌పాటు కేంద్ర ప్ర‌భుత్వం ఇవ్వ‌నున్నట్టు చెప్పారు.

త‌ద్వారా కొత్త ఉద్యోగాలు క‌ల్పించేందుకు కంపెనీలు ముందుకు వ‌స్తాయ‌న్నారు. దీనివ‌ల్ల ఉపాధి రంగం వృద్ధి చెందుతుంద‌ని వివ‌రించారు. అదేస‌మ‌యంలో స్వ‌దేశీ వ‌స్తువుల త‌యారీ, వినియోగానికి కూడా ప్రాధాన్యం పెంచుతున్న‌ట్టు ప్ర‌ధాని తెలిపారు. తద్వారా దేశ అవ‌స‌రాల కోసం.. పొరుగు దేశాల‌పై ఆధారప డాల్సిన అవ‌స‌రం ఉండ‌బోద‌న్నారు. ప్రతి రంగంలోనూ స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తున్నామ‌ని చెప్పారు. త్వరలో మేడ్‌ ఇన్‌ ఇండియా చిప్‌లు మార్కెట్‌ను ముంచెత్తుతాయ‌ని ప్ర‌ధాని చెప్పారు.

సెమీ కండ‌క్ట‌ర్ల విష‌యంలో దేశం స్వ‌యం స‌మృద్ధి సాధించింద‌న్న ప్ర‌ధాని మోడీ.. ప్ర‌పంచ‌దేశాల‌కు ఎగుమ‌తులు చేసే స్థాయికి చేరుకుంటుంద‌న్నారు. రాష్ట్రాలు కూడా స్వ‌యం స‌మృద్ధి దిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించారు. విక‌సిత భార‌త్ 2047 ల‌క్ష్యంగా భార‌త్ అడుగులు ప‌డుతున్నాయ‌న్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త్ కీల‌క స్థానానికి చేరుకుంటుంద‌న్నారు.

This post was last modified on August 15, 2025 11:40 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

57 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago