Political News

జీఎస్టీ త‌గ్గిస్తాం: ప్ర‌ధాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

దేశ ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఆర్థిక భారంగా మారిన జీఎస్టీ వ్య‌వ‌హారంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్పందించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ‌.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న‌.. జీఎస్టీ వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావించారు. దేశ ప్ర‌జ‌లు జీఎస్టీ గురించి ఏమ‌నుకుంటున్నారో.. త‌న‌కు వినిపిస్తోంద‌న్నారు. దీనిపై ఉద్దీప‌న‌లు (రాయితీ) ప్ర‌క‌టించ‌నున్నామ‌ని ఆయ‌న చెప్పారు. వ‌చ్చే దీపావ‌ళి నాటికి.. జీఎస్టీలో కొత్త సంస్క‌ర‌ణ‌లు తీసుకురానున్న‌ట్టు చెప్పారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌పై భారాలు త‌గ్గిస్తామ‌న్నారు.

సామాన్యులకు కొత్త జీఎస్టీ సంస్కరణలను దీపావళి కానుకగా ఇస్తామ‌ని ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. అంతేకాదు.. వారిపై ప‌న్నుల భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. దీంతో మార్కెట్లు పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌రోవైపు.. యువ‌త‌కోసం.. ప్ర‌ధాని మ‌రో కీల‌క ప‌థ‌కాన్ని కూడా ప్ర‌క‌టించారు. ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌తో ప్ర‌ణాళిక రూపొందించిన‌ట్టు మోడీ తెలిపారు. కొత్త‌గా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు పొందే వారికి.. నెల‌కు 15 వేల చొప్పున మూడేళ్ల‌పాటు కేంద్ర ప్ర‌భుత్వం ఇవ్వ‌నున్నట్టు చెప్పారు.

త‌ద్వారా కొత్త ఉద్యోగాలు క‌ల్పించేందుకు కంపెనీలు ముందుకు వ‌స్తాయ‌న్నారు. దీనివ‌ల్ల ఉపాధి రంగం వృద్ధి చెందుతుంద‌ని వివ‌రించారు. అదేస‌మ‌యంలో స్వ‌దేశీ వ‌స్తువుల త‌యారీ, వినియోగానికి కూడా ప్రాధాన్యం పెంచుతున్న‌ట్టు ప్ర‌ధాని తెలిపారు. తద్వారా దేశ అవ‌స‌రాల కోసం.. పొరుగు దేశాల‌పై ఆధారప డాల్సిన అవ‌స‌రం ఉండ‌బోద‌న్నారు. ప్రతి రంగంలోనూ స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తున్నామ‌ని చెప్పారు. త్వరలో మేడ్‌ ఇన్‌ ఇండియా చిప్‌లు మార్కెట్‌ను ముంచెత్తుతాయ‌ని ప్ర‌ధాని చెప్పారు.

సెమీ కండ‌క్ట‌ర్ల విష‌యంలో దేశం స్వ‌యం స‌మృద్ధి సాధించింద‌న్న ప్ర‌ధాని మోడీ.. ప్ర‌పంచ‌దేశాల‌కు ఎగుమ‌తులు చేసే స్థాయికి చేరుకుంటుంద‌న్నారు. రాష్ట్రాలు కూడా స్వ‌యం స‌మృద్ధి దిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించారు. విక‌సిత భార‌త్ 2047 ల‌క్ష్యంగా భార‌త్ అడుగులు ప‌డుతున్నాయ‌న్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త్ కీల‌క స్థానానికి చేరుకుంటుంద‌న్నారు.

This post was last modified on August 15, 2025 11:40 am

Share

Recent Posts

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

41 minutes ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

60 minutes ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

1 hour ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

5 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

5 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

5 hours ago