అసలే ఇప్పుడు బీజేపీ పేరు వినిపిస్తేనే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భగ్గుమంటున్నారు. అలాంటి సమయంలో బీజేపీకి చెందిన ఓ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి మాత్రం రాహుల్ ను మస్తు ఖుషీ చేసిండంటే నమ్మొచ్చా? అంత అనుమానం అక్కర్లేదు. ఆ బీజేపీ ఎంపీ నిజంగానే రాహుల్ ను సంతోషంలో ముంచెత్తారు. మోదీ సర్కారుపై పోరుకు సంబంధించి ఆ బీజేపీ ఎంపీ.. రాహుల్ కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్టేనని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సరే… అసలు విషయంలోకి వెళితే… బీహార్ కు చెందిన రాజీవ్ ప్రతాప్ రూడీ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం అంతగా యాక్టివ్ గా లేకున్నా…మోదీ కేబినెట్ లో ఆయన మంత్రిగానూ పనిచేశారు. బీజేపీ అగ్ర నేతల్లో ఒకరిగా ఆయన ఎదుగుతారన్న వాదనలు వినిపించినా… ఎందుకనో గానీ సడెన్ గా రూడీ ఇనాక్టివ్ అయిపోయారు. ఇక పార్లమెంటులోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ చైర్మన్ ఎన్నికలు జరగగా… వాటిలో చాలా కాలంగా యాక్టివ్ గా పాలుపంచుకుంటున్న రూడీ… మొన్నటిదాకా అదే పదవిలో కొనసాగారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. అయితే రూడీ పోటీ చేసింది ఎవరి మీదో తెలుసా? ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మద్దతులో బరిలోకి దిగిన బీజేపీ ఎంపీ సంజీవ్ బల్యాన్ పై రూడీ విజయం సాధించారు.
అంటే… ఈ ఎన్నికల్లో మోదీ, షాల అభ్యర్థిని రూడీ ఓడించినట్టే కదా. ఇదే విషయం తెలిసిన రాహుల్ గాంధీ గురువారం పార్లమెంటు ఆవరణలో లోపలికి వెళుతున్న క్రమంలో రూడీ తన సహచరులతో ముచ్చటిస్తూ కనిపించారు. రూడీని చూడగానే భలే ముచ్చట పడ్డ రాహుల్ తన చేయి చాచి మరీ రూడీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. రాహుల్ స్వయంగా చేయి అందించడంతో రూడీ కూడా ఆయనతో కరచాలనం చేశారు. మోదీ, షా ద్వయాన్ని ఓడించాడన్న భావనతో రూడీని ఓ యోధుడిలా చూసిన రాహుల్… ఆ తర్వాత రూడా కాస్త దూరం వెళ్లి తిరిగి ఆగి… రూడీతో మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
This post was last modified on August 13, 2025 9:48 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…