అసలే ఇప్పుడు బీజేపీ పేరు వినిపిస్తేనే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భగ్గుమంటున్నారు. అలాంటి సమయంలో బీజేపీకి చెందిన ఓ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి మాత్రం రాహుల్ ను మస్తు ఖుషీ చేసిండంటే నమ్మొచ్చా? అంత అనుమానం అక్కర్లేదు. ఆ బీజేపీ ఎంపీ నిజంగానే రాహుల్ ను సంతోషంలో ముంచెత్తారు. మోదీ సర్కారుపై పోరుకు సంబంధించి ఆ బీజేపీ ఎంపీ.. రాహుల్ కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్టేనని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సరే… అసలు విషయంలోకి వెళితే… బీహార్ కు చెందిన రాజీవ్ ప్రతాప్ రూడీ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం అంతగా యాక్టివ్ గా లేకున్నా…మోదీ కేబినెట్ లో ఆయన మంత్రిగానూ పనిచేశారు. బీజేపీ అగ్ర నేతల్లో ఒకరిగా ఆయన ఎదుగుతారన్న వాదనలు వినిపించినా… ఎందుకనో గానీ సడెన్ గా రూడీ ఇనాక్టివ్ అయిపోయారు. ఇక పార్లమెంటులోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ చైర్మన్ ఎన్నికలు జరగగా… వాటిలో చాలా కాలంగా యాక్టివ్ గా పాలుపంచుకుంటున్న రూడీ… మొన్నటిదాకా అదే పదవిలో కొనసాగారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. అయితే రూడీ పోటీ చేసింది ఎవరి మీదో తెలుసా? ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మద్దతులో బరిలోకి దిగిన బీజేపీ ఎంపీ సంజీవ్ బల్యాన్ పై రూడీ విజయం సాధించారు.
అంటే… ఈ ఎన్నికల్లో మోదీ, షాల అభ్యర్థిని రూడీ ఓడించినట్టే కదా. ఇదే విషయం తెలిసిన రాహుల్ గాంధీ గురువారం పార్లమెంటు ఆవరణలో లోపలికి వెళుతున్న క్రమంలో రూడీ తన సహచరులతో ముచ్చటిస్తూ కనిపించారు. రూడీని చూడగానే భలే ముచ్చట పడ్డ రాహుల్ తన చేయి చాచి మరీ రూడీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. రాహుల్ స్వయంగా చేయి అందించడంతో రూడీ కూడా ఆయనతో కరచాలనం చేశారు. మోదీ, షా ద్వయాన్ని ఓడించాడన్న భావనతో రూడీని ఓ యోధుడిలా చూసిన రాహుల్… ఆ తర్వాత రూడా కాస్త దూరం వెళ్లి తిరిగి ఆగి… రూడీతో మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
This post was last modified on August 13, 2025 9:48 pm
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…
ముందు సౌత్ సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్లో స్థిరపడ్డ హీరోయిన్లు చాలామంది.. ఇక్కడి సినిమాలు, పరిస్థితుల గురించి విమర్శలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’…
పదేళ్లకు పైగా 33 మంది పసి బాలురపై పునరావృత లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ బందా ప్రత్యేక పోక్సో…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటిస్తే.. అది అమలు కావాల్సిందే!. అది గిరిజన ప్రాంతమైనా.. మైదాన ప్రాంతమైనా.. చెప్పినట్టు…
గత ఏడాది మలయాళంలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి…