Political News

సీబీఐకి వామనరావు దంపతుల హత్య కేసు: సుప్రీం

సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, గట్టు నాగమణి దారుణ హత్య కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు మంగళవారం సీబీఐని ఆదేశించింది. దీనికి సంబంధించిన నివేదికను తమకే అందించాలని ఆదేశించడం గమనార్హం. అంతేకాదు, ఈ దారుణ హత్య కేసులో ఎవరు ఉన్నా వదిలిపెట్టకూడదని, రాజకీయ ఒత్తిళ్లు, అధికారిక పలుకుబడులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

ఏం జరిగింది?

గట్టు వామనరావు, నాగమణి ఇద్దరూ హైకోర్టు స్థాయి న్యాయవాదులు. పెద్దపల్లి జిల్లాకు చెందిన వీరు హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. అయితే, భూములకు సంబంధించిన వివాదంపై ఓ కేసులో ప్రత్యర్థులకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో వారు ఈ దంపతులపై పగబట్టారన్నది వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రతివాదులైన పుట్ట మధు సోదరులు తమపై కత్తి కట్టారని, వారే తమను చంపించారన్నది ఆయన వాంగ్మూలం.

2021 ఫిబ్రవరిలో పెద్దపల్లి జిల్లాకు వెళ్లి వస్తున్న సమయంలో కల్వచర్ల వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును కొందరు అడ్డుకుని, నడిరోడ్డుపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అప్పట్లో హైకోర్టు న్యాయవాదులు వారం రోజుల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వం విచారణను పూర్తి చేసింది.

అయితే, అసలు నిందితులను తప్పించారని ఆరోపిస్తూ వామనరావు తండ్రి కిషన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

దీనిపై ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిపిన కోర్టు, తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ అభిప్రాయం కోరింది. సీబీఐకి ఇవ్వడంపై ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. మరణ వాంగ్మూలం నిజమని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక స్పష్టం చేయడంతో కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. అయితే, విచారణకు నిర్దిష్ట సమయం ప్రకటించలేదు.

This post was last modified on August 12, 2025 1:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago