ఏపీ ప్రతిపక్షం వైసీపీకి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. “సమయం లేదు. ఇప్పుడు ఏం చేయలేం” అని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ వెనక్కి తగ్గింది.
ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇది మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఉప పోరును టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జగన్ సొంత నియోజకవర్గంలో పాగా వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. తమ సత్తా చాటుకునేందుకు వైసీపీ కూడా సై అంది.
ఇదిలా ఉండగా ఓటర్లను స్థానిక పోలింగ్ బూత్ల నుంచి రెండునుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ బూత్లకు మార్చారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీనికి సంబంధించిన పెద్ద జాబితాను రెడీ చేశారు. ఈ విషయంలో సోమవారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
మధ్యాహ్నం 4 గంటల తర్వాత విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎన్నికల అధికారులు, వైసీపీ తరఫున ఇరు పక్షాల వాదనలు నమోదు చేసింది.
ఎన్నికల అధికారుల వాదన ప్రకారం నియోజకవర్గం అత్యంత సున్నితమైన జాబితాలో ఉందని, ఇప్పటికే ఘర్షణలు చోటు చేసుకున్నాయని, ఈ నేపధ్యంలో ఓటర్లను తక్కువ సంఖ్యలో బూతులకు పరిమితం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ క్రమంలో బూతుల సంఖ్యను పెంచి ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని వివరించారు.
వైసీపీ తరఫున న్యాయవాదులు ఇది రాజకీయ కుట్ర అని, తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లకు మాత్రమే బూతులను దూరంగా ఏర్పాటు చేశారని వాదించారు.
ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని “మీకనుకూలమని ఎలా నిర్ధారిస్తారు? ఓటర్లే మైనా మీకే ఓటేస్తామని చెప్పారా?” అని ప్రశ్నించింది. దీనికి వైసీపీ తరఫున న్యాయవాదులు ఆయా కుటుంబాలు ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
అయితే ఇప్పటికే సమయం మించిపోయిందని, తెల్లవారితే పోలింగ్ ప్రారంభం అవుతున్నందున ఈ సమయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు వైసీపీ పిటిషన్లను తోసిపుచ్చింది.
This post was last modified on August 12, 2025 11:34 am
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…