Political News

ఓట‌ర్లే మైనా.. మీకే ఓటేస్తామ‌ని చెప్పారా?: వైసీపీకి హైకోర్టు షాక్

ఏపీ ప్రతిపక్షం వైసీపీకి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. “సమయం లేదు. ఇప్పుడు ఏం చేయలేం” అని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ వెనక్కి తగ్గింది.

ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇది మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఉప పోరును టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జగన్ సొంత నియోజకవర్గంలో పాగా వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. తమ సత్తా చాటుకునేందుకు వైసీపీ కూడా సై అంది.

ఇదిలా ఉండగా ఓటర్లను స్థానిక పోలింగ్ బూత్‌ల నుంచి రెండునుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ బూత్‌లకు మార్చారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీనికి సంబంధించిన పెద్ద జాబితాను రెడీ చేశారు. ఈ విషయంలో సోమవారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.

మధ్యాహ్నం 4 గంటల తర్వాత విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎన్నికల అధికారులు, వైసీపీ తరఫున ఇరు పక్షాల వాదనలు నమోదు చేసింది.

ఎన్నికల అధికారుల వాదన ప్రకారం నియోజకవర్గం అత్యంత సున్నితమైన జాబితాలో ఉందని, ఇప్పటికే ఘర్షణలు చోటు చేసుకున్నాయని, ఈ నేపధ్యంలో ఓటర్లను తక్కువ సంఖ్యలో బూతుల‌కు పరిమితం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ క్రమంలో బూతుల సంఖ్యను పెంచి ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాల‌ని వివరించారు.

వైసీపీ తరఫున న్యాయవాదులు ఇది రాజకీయ కుట్ర అని, తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లకు మాత్రమే బూతులను దూరంగా ఏర్పాటు చేశారని వాదించారు.

ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని “మీకనుకూలమని ఎలా నిర్ధారిస్తారు? ఓటర్లే మైనా మీకే ఓటేస్తామని చెప్పారా?” అని ప్రశ్నించింది. దీనికి వైసీపీ తరఫున న్యాయవాదులు ఆయా కుటుంబాలు ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.

అయితే ఇప్పటికే సమయం మించిపోయిందని, తెల్లవారితే పోలింగ్ ప్రారంభం అవుతున్నందున ఈ సమయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు వైసీపీ పిటిషన్లను తోసిపుచ్చింది.

This post was last modified on August 12, 2025 11:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

3 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

6 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

6 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

8 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

10 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

10 hours ago