Political News

ఓట‌ర్లే మైనా.. మీకే ఓటేస్తామ‌ని చెప్పారా?: వైసీపీకి హైకోర్టు షాక్

ఏపీ ప్రతిపక్షం వైసీపీకి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. “సమయం లేదు. ఇప్పుడు ఏం చేయలేం” అని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ వెనక్కి తగ్గింది.

ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇది మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఉప పోరును టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జగన్ సొంత నియోజకవర్గంలో పాగా వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. తమ సత్తా చాటుకునేందుకు వైసీపీ కూడా సై అంది.

ఇదిలా ఉండగా ఓటర్లను స్థానిక పోలింగ్ బూత్‌ల నుంచి రెండునుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ బూత్‌లకు మార్చారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీనికి సంబంధించిన పెద్ద జాబితాను రెడీ చేశారు. ఈ విషయంలో సోమవారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.

మధ్యాహ్నం 4 గంటల తర్వాత విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎన్నికల అధికారులు, వైసీపీ తరఫున ఇరు పక్షాల వాదనలు నమోదు చేసింది.

ఎన్నికల అధికారుల వాదన ప్రకారం నియోజకవర్గం అత్యంత సున్నితమైన జాబితాలో ఉందని, ఇప్పటికే ఘర్షణలు చోటు చేసుకున్నాయని, ఈ నేపధ్యంలో ఓటర్లను తక్కువ సంఖ్యలో బూతుల‌కు పరిమితం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ క్రమంలో బూతుల సంఖ్యను పెంచి ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాల‌ని వివరించారు.

వైసీపీ తరఫున న్యాయవాదులు ఇది రాజకీయ కుట్ర అని, తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లకు మాత్రమే బూతులను దూరంగా ఏర్పాటు చేశారని వాదించారు.

ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని “మీకనుకూలమని ఎలా నిర్ధారిస్తారు? ఓటర్లే మైనా మీకే ఓటేస్తామని చెప్పారా?” అని ప్రశ్నించింది. దీనికి వైసీపీ తరఫున న్యాయవాదులు ఆయా కుటుంబాలు ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.

అయితే ఇప్పటికే సమయం మించిపోయిందని, తెల్లవారితే పోలింగ్ ప్రారంభం అవుతున్నందున ఈ సమయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు వైసీపీ పిటిషన్లను తోసిపుచ్చింది.

This post was last modified on August 12, 2025 11:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

14 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

50 minutes ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

1 hour ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

3 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

5 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

6 hours ago