Political News

టార్గెట్ రోజా.. ఇక యాక్షనే!

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజాకు టెన్షన్ పట్టుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రంలో యువతను ప్రోత్సహించేందుకు క్రీడలు నిర్వహించారు. దీనికి సంబంధించి 150 కోట్లకు పైగా అప్పటి వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. కేవలం రెండేళ్ల కాలంలో ఏడాది పాటు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తం కేటాయించడం, ఈ నిధులు కూడా చాలవని అప్పులు చేయడం వంటి విషయాలు అప్పట్లో విమర్శలకు దారితీశాయి.

పైగా ఆడుదాం ఆంధ్ర పేరుతో కొన్ని క్రీడా పరికరాలు కొనుగోలు చేశారు. వీటికి సంబంధించిన కాంట్రాక్టులను అనుకూల సంస్థలకు ఇచ్చారన్న ఫిర్యాదులు, ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తం 150 కోట్లలో 60-70 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని అప్పట్లో టీడీపీ నాయకులు ఆరోపించారు. విద్యార్థులకు, యువ క్రీడాకారులకు ఇచ్చిన క్రీడా పరికరాల్లో నాణ్యత లేకపోవడం, క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం, నాసిరకమైన పరికరాలు పంపిణీ చేశారని కూడా విమర్శలు వచ్చాయి.

అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడల ప్రారంభోత్సవం, ముగింపుల సందర్భంగా నిర్వహించిన సభలు, సమావేశాలకు భారీ ఎత్తున ఖర్చు చేశారని, నైపుణ్యం లేని క్రీడాకారులకు కూడా వేల రూపాయల నగదును పంపిణీ చేశారని ఆరోపణలు వచ్చాయి. వీటిపై తరచుగా టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నాలుగు నెలల క్రితం ఆడుదాం ఆంధ్ర పరికరాల కొనుగోలు, కార్యక్రమాల నిర్వహణపై విచారణకు ఆదేశించింది.

విజిలెన్స్ అధికారులు దీనిపై దృష్టి పెట్టి పలు రూపాల్లో విచారణ చేశారు. తాజాగా తమ నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించారు. దీనిపై మరో అధ్యయనం అనంతరం ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధానంగా మంత్రి రోజాకు 50 కోట్ల వరకు ముడుపులు ముట్టాయని వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అప్పట్లో షాప్ చైర్మన్‌గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కూడా 10-20 కోట్ల సొమ్ము చేరిందని టీడీపీ నాయకులు అంటున్నారు.

This post was last modified on August 12, 2025 11:35 am

Share
Show comments
Published by
Satya
Tags: Roja

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

57 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago