Political News

నాడు కుప్పం నేడు పులివెందుల!

అధికారంలో ఉంటే ఒకరకంగా, అధికారం పోయాక మరొరకంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తాయన్న పేరుంది. దీనికి వైసీపీ చేస్తున్న రాజకీయాలే ఉదాహరణగా మారాయని అంటున్నారు పరిశీలకులు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను మరిచిపోయినట్టు వ్యవహరిస్తోందని టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.

దీనికి కారణం ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతోంది. దీనిలో ఎవరు గెలిచినా మహా అయితే ఏడాదిన్నర మాత్రమే పదవిలో ఉంటారు. అయినప్పటికీ, జగన్ సొంత జిల్లా కడప కావడం, అందునా ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల కావడంతో ఇక్కడ పాగా వేయాలన్నది సాధారణంగా ప్రత్యర్థి పార్టీ చేసే ఆలోచన. పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి టీడీపీ ఒక అడుగు ముందుకు వేసి సీనియర్ నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించిన మాట కూడా వాస్తవమే.

అయితే ఏదో జరిగిపోతోందని, హత్యా రాజకీయాలకు తెరదీశారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఆరోపణలు గుప్పిస్తున్నారు. పులివెందులలో స్వేచ్ఛలేకుండా పోయిందని అంటున్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం గతాన్ని మరిచిపోతే ఎలా అంటూ వైసీపీపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

కుప్పంలో జరిగిన పోరు సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, అప్పట్లో మాత్రం దూకుడు ప్రదర్శించలేదా? ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు టీడీపీ నేతలను నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకోలేదా? అని ప్రశ్నిస్తున్నారు. గతాన్ని మరిచిపోయి ఇప్పుడు ఏదో జరిగిపోతోందంటూ యాగీ చేయడం ఎందుకని నిలదీస్తున్నారు.

ఇదిలా ఉండగా, వైసీపీ హయాంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో టీడీపీ నాయకులను కనీసం నామినేషన్ కూడా వేయనీయకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని సంచలన ప్రకటన చేసే పరిస్థితి వచ్చింది. దీంతో వైసీపీ చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకుంది. ఇప్పుడు మాత్రం టీడీపీ ప్రభుత్వం ఏదో చేస్తోందని యాగీ చేయడం ఎందుకని ఆ పార్టీ నాయకులు నిలదీస్తున్నారు.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

1 hour ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

3 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

4 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

5 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

8 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

9 hours ago