Political News

నాడు కుప్పం నేడు పులివెందుల!

అధికారంలో ఉంటే ఒకరకంగా, అధికారం పోయాక మరొరకంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తాయన్న పేరుంది. దీనికి వైసీపీ చేస్తున్న రాజకీయాలే ఉదాహరణగా మారాయని అంటున్నారు పరిశీలకులు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను మరిచిపోయినట్టు వ్యవహరిస్తోందని టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.

దీనికి కారణం ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతోంది. దీనిలో ఎవరు గెలిచినా మహా అయితే ఏడాదిన్నర మాత్రమే పదవిలో ఉంటారు. అయినప్పటికీ, జగన్ సొంత జిల్లా కడప కావడం, అందునా ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల కావడంతో ఇక్కడ పాగా వేయాలన్నది సాధారణంగా ప్రత్యర్థి పార్టీ చేసే ఆలోచన. పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి టీడీపీ ఒక అడుగు ముందుకు వేసి సీనియర్ నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించిన మాట కూడా వాస్తవమే.

అయితే ఏదో జరిగిపోతోందని, హత్యా రాజకీయాలకు తెరదీశారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఆరోపణలు గుప్పిస్తున్నారు. పులివెందులలో స్వేచ్ఛలేకుండా పోయిందని అంటున్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం గతాన్ని మరిచిపోతే ఎలా అంటూ వైసీపీపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

కుప్పంలో జరిగిన పోరు సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, అప్పట్లో మాత్రం దూకుడు ప్రదర్శించలేదా? ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు టీడీపీ నేతలను నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకోలేదా? అని ప్రశ్నిస్తున్నారు. గతాన్ని మరిచిపోయి ఇప్పుడు ఏదో జరిగిపోతోందంటూ యాగీ చేయడం ఎందుకని నిలదీస్తున్నారు.

ఇదిలా ఉండగా, వైసీపీ హయాంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో టీడీపీ నాయకులను కనీసం నామినేషన్ కూడా వేయనీయకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని సంచలన ప్రకటన చేసే పరిస్థితి వచ్చింది. దీంతో వైసీపీ చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకుంది. ఇప్పుడు మాత్రం టీడీపీ ప్రభుత్వం ఏదో చేస్తోందని యాగీ చేయడం ఎందుకని ఆ పార్టీ నాయకులు నిలదీస్తున్నారు.

This post was last modified on August 11, 2025 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago