అధికారంలో ఉంటే ఒకరకంగా, అధికారం పోయాక మరొరకంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తాయన్న పేరుంది. దీనికి వైసీపీ చేస్తున్న రాజకీయాలే ఉదాహరణగా మారాయని అంటున్నారు పరిశీలకులు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను మరిచిపోయినట్టు వ్యవహరిస్తోందని టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.
దీనికి కారణం ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతోంది. దీనిలో ఎవరు గెలిచినా మహా అయితే ఏడాదిన్నర మాత్రమే పదవిలో ఉంటారు. అయినప్పటికీ, జగన్ సొంత జిల్లా కడప కావడం, అందునా ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల కావడంతో ఇక్కడ పాగా వేయాలన్నది సాధారణంగా ప్రత్యర్థి పార్టీ చేసే ఆలోచన. పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి టీడీపీ ఒక అడుగు ముందుకు వేసి సీనియర్ నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించిన మాట కూడా వాస్తవమే.
అయితే ఏదో జరిగిపోతోందని, హత్యా రాజకీయాలకు తెరదీశారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఆరోపణలు గుప్పిస్తున్నారు. పులివెందులలో స్వేచ్ఛలేకుండా పోయిందని అంటున్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం గతాన్ని మరిచిపోతే ఎలా అంటూ వైసీపీపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
కుప్పంలో జరిగిన పోరు సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, అప్పట్లో మాత్రం దూకుడు ప్రదర్శించలేదా? ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు టీడీపీ నేతలను నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకోలేదా? అని ప్రశ్నిస్తున్నారు. గతాన్ని మరిచిపోయి ఇప్పుడు ఏదో జరిగిపోతోందంటూ యాగీ చేయడం ఎందుకని నిలదీస్తున్నారు.
ఇదిలా ఉండగా, వైసీపీ హయాంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో టీడీపీ నాయకులను కనీసం నామినేషన్ కూడా వేయనీయకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని సంచలన ప్రకటన చేసే పరిస్థితి వచ్చింది. దీంతో వైసీపీ చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకుంది. ఇప్పుడు మాత్రం టీడీపీ ప్రభుత్వం ఏదో చేస్తోందని యాగీ చేయడం ఎందుకని ఆ పార్టీ నాయకులు నిలదీస్తున్నారు.
This post was last modified on August 11, 2025 11:02 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…