Political News

ప్రతిపక్షం తెలంగాణ లో ఒకే, ఏపీ లో వీకే

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారే ముఖ్యం. లేకపోతే ప్రభుత్వం అయినా, నాయకులు అయినా కళ్లెంలేని గుర్రాలే అవుతారు. అందుకే ప్రజాస్వామ్య దేశాల్లో భావప్రకటన స్వేచ్ఛకు పెద్దపీట వేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ప్రశ్నించే విషయంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాలు మారాయి, పాలన కూడా మారింది. అయితే, విపక్ష పాత్ర పోషించే విషయంలో రెండు రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయాలు సాగుతున్నాయి.

తెలంగాణను తీసుకుంటే — అధికారం కోసం పోటీలో మూడు పార్టీలు పరిగులు పెడుతున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ప్రతిపక్షాలుగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం మూడు పార్టీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ఏ పార్టీకి తేడా లేదు. అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల కోసం రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీలు కూడా ప్రభుత్వాన్ని సాధ్యమైనంతవరకు ఇరుకున పెడుతున్నాయి.

దీంతో తెలంగాణ రాజకీయాల్లో పార్టీల మధ్య పోరు జోరుగా సాగుతోంది.

ఏపీ విషయానికి వస్తే — ఇక్కడ ప్రధానంగా టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పోరు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఇందులో మూడు పార్టీలు ఉన్నా, ప్రధానంగా టీడీపీ మాత్రమే హైలైట్ అవుతోంది. వచ్చే ఎన్నికల కోసం టీడీపీ ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటోంది, సంక్షేమాన్ని–అభివృద్ధిని బలంగా తీసుకువెళ్తోంది. అయితే, ప్రజల తరఫున రాజకీయంగా పోరాటం చేయాల్సిన వైసీపీ మాత్రం వీక్‌గా మారిపోయిందనే వాదన వినిపిస్తోంది.

బలమైన గళం వినిపించడంలో వైసీపీ అధినేత జగన్, గతంతో పోలిస్తే చాలా వీక్ అయిపోయారని తాజాగా వెలువరించిన ఓ సర్వే స్పష్టం చేసింది. 2014–19 మధ్య ఉన్న దూకుడు, బలమైన వాయిస్ ఇప్పుడు లేకుండా పోయిందని ఈ సర్వే చెబుతోంది.

రాజకీయాల్లో పోటీ ఉంటే, ప్రతిపక్షంలో కూడా పోటీ ఉంటుంది — ఇది తెలంగాణలో మాత్రమే కనిపిస్తోంది. ఏపీ విషయానికి వస్తే, పార్టీల మధ్య కూడా పోటీ లేదు. కాంగ్రెస్ ఉన్నా, లేనట్టే అని రాజకీయ వర్గాలే కాదు, ప్రజలు కూడా భావిస్తున్నారు.

కమ్యూనిస్టుల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. దీనికితోడు, జనసేన, బీజేపీలు రెండూ కూడా అధికార పక్షంలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రజల తరఫున పోరాడాలన్నా, పార్టీ పరంగా దూకుడుగా ఉండాలన్నా ఒక్క వైసీపీకి మాత్రమే ఛాన్స్ ఉంది. కానీ, దీనిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇదే వైసీపీని వీక్‌గా మారుస్తోందని తాజాగా స్వతంత్ర సంస్థ చేసిన సర్వేలో తేలింది.

కేవలం ఇంటికే పరిమితం కావడం, పార్టీ నాయకుల సమస్యలను మాత్రమే హైలైట్ చేయడం వల్ల వైసీపీ వీక్ అవుతోందని ఈ సర్వే చెబుతోంది.

This post was last modified on August 10, 2025 5:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

1 minute ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

21 minutes ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

28 minutes ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

51 minutes ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

1 hour ago

రివ్యూల మీద ఫిర్యాదు చేసి లాభం లేదు

నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…

2 hours ago