లూజుగా వ్యవహరించే, ఇష్టానుసారంగా వ్యవహరించే నాయకులకు ఎక్కడికక్కడ నట్లు బిగించే కార్యక్ర మం రాష్ట్రంలో కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఆయన నిఘాను పెడుతూనే ఉన్నారు. తప్పులు చేస్తున్నవారిని హెచ్చరిస్తూ నే ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటూ.. వాటికి అనుగుణంగా నాయకుల ను మలుస్తున్నారు. తాజాగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
అయితే.. దీనిని కొందరు నాయకులు లైట్ తీసుకున్నారు. వాస్తవానికి చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టి నా.. దానికి కొన్ని విధి విధానాలు ఏర్పాటు చేస్తారు. అలానే.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి కూడా 4 విధివిధానాలు ఏర్పాటు చేశారు. 1) ఇంటింటికీ నాయకులు వెళ్లాలి. 2) ఏడాది పాలనపై ఓరల్గా వారికి వివరించాలి. 3) ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని లిఖిత పూర్వకంగా కరపత్రాలు రూపొందించి ప్రజలకు అందించాలి. 4) ప్రజల సంతృప్తిని నమోదు చేయాలి.
ఈ నాలుగు చేసేందుకు నాయకులకు చంద్రబాబు పలు దఫాలుగా శిక్షణ కూడా ఇచ్చారు. అయితే.. కొందరు నాయకులు వీటిని పాటిస్తుండగా.. మరికొందరు విస్మరిస్తున్నారు. ఈ విషయాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఐవీఆర్ ఎస్ సర్వేతో ఎమ్మెల్యేల తీరుపైనిఘా పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో నిరంతరాయంగా ఈ సర్వే చేస్తున్నారు. నేరుగా ప్రజలకు ఫోన్లు చేసి.. వారి అభిప్రాయా లు తెలుసుకుంటున్నారు. ఈ సర్వేలో ప్రధానంగా మూడు ప్రశ్నలు సంధిస్తున్నారు. వాటి ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నారు.
1) మీ ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చారా? అనేది ఫస్ట్ ప్రశ్న, సుపరిపాలనలో భాగంగా ఇంటింటికీ తిరిగి.. ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని చంద్రబాబు చెప్పారు. కానీ, ఎక్కువ మంది నాలుగు రోడ్ల కూడళ్లలో నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వెనుదిరుగుతున్నారు. 2) మీకు కరపత్రాలు ఇచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా చేసిన పనులకు సంబంధించి, ప్రజలకు జరిగిన లబ్ధిని వివరించేం దుకు కరపత్రాలు ఇవ్వడం ద్వారా.. ప్రజలకు చేరువ కావాలన్నది బాబు లక్ష్యం.
ఇది చాలా తక్కువ మంది చేస్తున్నారు. 3) ఎమ్మెల్యేల సంభాషణ ఎలా ఉంది. అంటే.. ప్రజలతో వారు పొడిపొడిగా మాట్లాడుతున్నారా? లేక.. మనసు పెట్టి పనిచేస్తున్నారా? అనేది తెలుసుకుంటున్నారు. ఇలా.. తొలి అడుగు కార్యక్రమంపై చంద్రబాబు తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. మరి నాయకులు దీనిని లైట్ తీసుకుంటే.. కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on August 10, 2025 9:58 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…