Political News

‘జగన్, అవినాష్ ఆధ్వర్యంలోనే వివేకా హత్య’

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గత ఆరు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. హత్య జరిగి ఇంత కాలం అయినా సీబీఐ విచారణ పూర్తికాకపోవడం వివిధ అనుమానాలకు దారితీస్తోంది. ఈ కేసుపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి.

ఆదినారాయణ రెడ్డి మాటల్లో, మాజీ ముఖ్యమంత్రి జగన్ మరియు కడప ఎంపీ అవినాష్ రెడ్డిల ఆధ్వర్యంలోనే వివేకా హత్య జరిగిందని ఆరోపించారు. వివేకాతో తనకు రాజకీయ విభేదాలు ఉన్నా, ఆయనను హత్య చేయాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని చెప్పారు. ఇలాంటి దారుణ ఆలోచన జగన్ మరియు అవినాష్ రెడ్డిలకు రావడం చాలా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

హత్య జరిగిన రోజున మీడియాను లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారని, స్థానిక విలేకరులను కూడా ఇంట్లోకి రానివ్వలేదని ఆరోపించారు. ఇది మొత్తం కుట్రపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతోందని అన్నారు. వివేకా హత్య మాదిరిగానే కోడి కత్తి ఘటన ఒక నాటకం అని, విజయవాడలో జగన్ కంటి దగ్గర గులక రాయి తగలడం కూడా మరో నాటకం అని విమర్శించారు.

వివేకా జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లిన ఆదినారాయణ రెడ్డి, కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని గతంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నివేదిక ఇచ్చానని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం వివేకా కుటుంబాన్ని కలవలేదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, వాటిని వివేకా కూతురు సునీతా రెడ్డి ఇప్పుడు తెలుసుకున్నారని తెలిపారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి సునీత వస్తే తనకు అభ్యంతరం లేదని అన్నారు.

This post was last modified on August 8, 2025 8:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

17 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago