Political News

‘జగన్, అవినాష్ ఆధ్వర్యంలోనే వివేకా హత్య’

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గత ఆరు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. హత్య జరిగి ఇంత కాలం అయినా సీబీఐ విచారణ పూర్తికాకపోవడం వివిధ అనుమానాలకు దారితీస్తోంది. ఈ కేసుపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి.

ఆదినారాయణ రెడ్డి మాటల్లో, మాజీ ముఖ్యమంత్రి జగన్ మరియు కడప ఎంపీ అవినాష్ రెడ్డిల ఆధ్వర్యంలోనే వివేకా హత్య జరిగిందని ఆరోపించారు. వివేకాతో తనకు రాజకీయ విభేదాలు ఉన్నా, ఆయనను హత్య చేయాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని చెప్పారు. ఇలాంటి దారుణ ఆలోచన జగన్ మరియు అవినాష్ రెడ్డిలకు రావడం చాలా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

హత్య జరిగిన రోజున మీడియాను లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారని, స్థానిక విలేకరులను కూడా ఇంట్లోకి రానివ్వలేదని ఆరోపించారు. ఇది మొత్తం కుట్రపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతోందని అన్నారు. వివేకా హత్య మాదిరిగానే కోడి కత్తి ఘటన ఒక నాటకం అని, విజయవాడలో జగన్ కంటి దగ్గర గులక రాయి తగలడం కూడా మరో నాటకం అని విమర్శించారు.

వివేకా జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లిన ఆదినారాయణ రెడ్డి, కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని గతంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నివేదిక ఇచ్చానని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం వివేకా కుటుంబాన్ని కలవలేదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, వాటిని వివేకా కూతురు సునీతా రెడ్డి ఇప్పుడు తెలుసుకున్నారని తెలిపారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి సునీత వస్తే తనకు అభ్యంతరం లేదని అన్నారు.

This post was last modified on August 8, 2025 8:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

13 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago