వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గత ఆరు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. హత్య జరిగి ఇంత కాలం అయినా సీబీఐ విచారణ పూర్తికాకపోవడం వివిధ అనుమానాలకు దారితీస్తోంది. ఈ కేసుపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి.
ఆదినారాయణ రెడ్డి మాటల్లో, మాజీ ముఖ్యమంత్రి జగన్ మరియు కడప ఎంపీ అవినాష్ రెడ్డిల ఆధ్వర్యంలోనే వివేకా హత్య జరిగిందని ఆరోపించారు. వివేకాతో తనకు రాజకీయ విభేదాలు ఉన్నా, ఆయనను హత్య చేయాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని చెప్పారు. ఇలాంటి దారుణ ఆలోచన జగన్ మరియు అవినాష్ రెడ్డిలకు రావడం చాలా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
హత్య జరిగిన రోజున మీడియాను లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారని, స్థానిక విలేకరులను కూడా ఇంట్లోకి రానివ్వలేదని ఆరోపించారు. ఇది మొత్తం కుట్రపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతోందని అన్నారు. వివేకా హత్య మాదిరిగానే కోడి కత్తి ఘటన ఒక నాటకం అని, విజయవాడలో జగన్ కంటి దగ్గర గులక రాయి తగలడం కూడా మరో నాటకం అని విమర్శించారు.
వివేకా జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లిన ఆదినారాయణ రెడ్డి, కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని గతంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నివేదిక ఇచ్చానని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం వివేకా కుటుంబాన్ని కలవలేదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, వాటిని వివేకా కూతురు సునీతా రెడ్డి ఇప్పుడు తెలుసుకున్నారని తెలిపారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి సునీత వస్తే తనకు అభ్యంతరం లేదని అన్నారు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…