Political News

‘ఎంఐఎం కోసం రేవంత్ ఆరాటం’

తెలంగాణ‌లో బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను 42 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును రాష్ట్ర‌ప‌తి ఇప్ప‌టి వ‌ర‌కు ఆమోదించ‌లేదు. మ‌రోవైపు.. గ‌వ‌ర్న‌ర్ ఆర్డినెన్స్ జారీ చేసినా.. దాని ప్ర‌కారం బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించి.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోం ది. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వంలోని మంత్రులు.. ఢిల్లీలో ధ‌ర్నాకు దిగారు. పార్ల‌మెంటులో అయినా .. రిజ‌ర్వేష‌న్‌ను ఆమోదించేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

అయితే.. ఈ ధ‌ర్నాపై కేంద్ర మంత్రి, తెలంగాణ‌కు చెందిన బీజేపీ నాయ‌కుడు బండి సంజ‌య్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ముస్లింల కోసం.. ముఖ్యంగా ఎంఐఎం కోసం.. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అందుకే ఢిల్లీలో యాగీ చేస్తున్నార‌ని బండి విమ‌ర్శించారు. వాస్త‌వానికి.. కామారెడ్డిలో చేసిన డిక్ల‌రేష‌న్ వేర‌ని.. కానీ.. దానికి భిన్నంగా ఇప్పుడు.. ముస్లింల కోసం కాంగ్రెస్ నేత‌లు రోడ్డెక్కార‌ని విమ‌ర్శించారు. బీసీలకు 5 శాతం పెంచి.. ముస్లింలకు అదనంగా పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్ర చేస్తున్నారని బండి నిప్పులు చెరిగారు.

బీసీల పేరుతో మైనారిటీ ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ట్ట‌బెట్టేందుకు.. ముఖ్యంగా ఎంఐఎంకు మేలు చేసేం దుకు.. కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. బీసీల‌కు పూర్తిగా 42 శాతం రిజ‌ర్వేష‌న్ అమ లు చేస్తే ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్న బండి.. కానీ, క్షేత్ర‌స్థాయిలో అలా జ‌ర‌గ‌డం లేద‌న్నారు. మైనారిటీ ముస్లింల‌కు మేలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. వాస్త‌వానికి బీజేపీ బీసీ ప‌క్ష‌పాతి అని పేర్కొన్నారు. అందుకే.. మూడు సార్లుగా బీసీకే ప్ర‌ధాని పీఠం అప్ప‌గించామ‌న్నారు.

కానీ.. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా బీసీల‌కు మేలు చేసిందా? అని ప్ర‌శ్నించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎ న్నడైనా బీసీని ప్రధాని చేశారా? అని బండి నిల‌దీశారు. ఉమ్మ‌డి ఏపీలో కూడా బీసీకి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌న్నారు. తెలంగాణ కేబినెట్‌, నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారో.. రేవంత్ రెడ్డి చెప్పాల‌న్నారు. బీసీల‌కు న్యాయం చేయాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు.

This post was last modified on August 6, 2025 6:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

12 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

1 hour ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

1 hour ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

1 hour ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

2 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

2 hours ago