తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును రాష్ట్రపతి ఇప్పటి వరకు ఆమోదించలేదు. మరోవైపు.. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసినా.. దాని ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి.. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోం ది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు.. ఢిల్లీలో ధర్నాకు దిగారు. పార్లమెంటులో అయినా .. రిజర్వేషన్ను ఆమోదించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే.. ఈ ధర్నాపై కేంద్ర మంత్రి, తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముస్లింల కోసం.. ముఖ్యంగా ఎంఐఎం కోసం.. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే ఢిల్లీలో యాగీ చేస్తున్నారని బండి విమర్శించారు. వాస్తవానికి.. కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ వేరని.. కానీ.. దానికి భిన్నంగా ఇప్పుడు.. ముస్లింల కోసం కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారని విమర్శించారు. బీసీలకు 5 శాతం పెంచి.. ముస్లింలకు అదనంగా పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్ర చేస్తున్నారని బండి నిప్పులు చెరిగారు.
బీసీల పేరుతో మైనారిటీ ముస్లింలకు రిజర్వేషన్ కట్టబెట్టేందుకు.. ముఖ్యంగా ఎంఐఎంకు మేలు చేసేం దుకు.. కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. బీసీలకు పూర్తిగా 42 శాతం రిజర్వేషన్ అమ లు చేస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదన్న బండి.. కానీ, క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదన్నారు. మైనారిటీ ముస్లింలకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వాస్తవానికి బీజేపీ బీసీ పక్షపాతి అని పేర్కొన్నారు. అందుకే.. మూడు సార్లుగా బీసీకే ప్రధాని పీఠం అప్పగించామన్నారు.
కానీ.. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా బీసీలకు మేలు చేసిందా? అని ప్రశ్నించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎ న్నడైనా బీసీని ప్రధాని చేశారా? అని బండి నిలదీశారు. ఉమ్మడి ఏపీలో కూడా బీసీకి ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్నారు. తెలంగాణ కేబినెట్, నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారో.. రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. బీసీలకు న్యాయం చేయాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు.
This post was last modified on August 6, 2025 6:57 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…