Political News

‘ఎంఐఎం కోసం రేవంత్ ఆరాటం’

తెలంగాణ‌లో బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను 42 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును రాష్ట్ర‌ప‌తి ఇప్ప‌టి వ‌ర‌కు ఆమోదించ‌లేదు. మ‌రోవైపు.. గ‌వ‌ర్న‌ర్ ఆర్డినెన్స్ జారీ చేసినా.. దాని ప్ర‌కారం బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించి.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోం ది. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వంలోని మంత్రులు.. ఢిల్లీలో ధ‌ర్నాకు దిగారు. పార్ల‌మెంటులో అయినా .. రిజ‌ర్వేష‌న్‌ను ఆమోదించేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

అయితే.. ఈ ధ‌ర్నాపై కేంద్ర మంత్రి, తెలంగాణ‌కు చెందిన బీజేపీ నాయ‌కుడు బండి సంజ‌య్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ముస్లింల కోసం.. ముఖ్యంగా ఎంఐఎం కోసం.. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అందుకే ఢిల్లీలో యాగీ చేస్తున్నార‌ని బండి విమ‌ర్శించారు. వాస్త‌వానికి.. కామారెడ్డిలో చేసిన డిక్ల‌రేష‌న్ వేర‌ని.. కానీ.. దానికి భిన్నంగా ఇప్పుడు.. ముస్లింల కోసం కాంగ్రెస్ నేత‌లు రోడ్డెక్కార‌ని విమ‌ర్శించారు. బీసీలకు 5 శాతం పెంచి.. ముస్లింలకు అదనంగా పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్ర చేస్తున్నారని బండి నిప్పులు చెరిగారు.

బీసీల పేరుతో మైనారిటీ ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ట్ట‌బెట్టేందుకు.. ముఖ్యంగా ఎంఐఎంకు మేలు చేసేం దుకు.. కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. బీసీల‌కు పూర్తిగా 42 శాతం రిజ‌ర్వేష‌న్ అమ లు చేస్తే ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్న బండి.. కానీ, క్షేత్ర‌స్థాయిలో అలా జ‌ర‌గ‌డం లేద‌న్నారు. మైనారిటీ ముస్లింల‌కు మేలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. వాస్త‌వానికి బీజేపీ బీసీ ప‌క్ష‌పాతి అని పేర్కొన్నారు. అందుకే.. మూడు సార్లుగా బీసీకే ప్ర‌ధాని పీఠం అప్ప‌గించామ‌న్నారు.

కానీ.. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా బీసీల‌కు మేలు చేసిందా? అని ప్ర‌శ్నించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎ న్నడైనా బీసీని ప్రధాని చేశారా? అని బండి నిల‌దీశారు. ఉమ్మ‌డి ఏపీలో కూడా బీసీకి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌న్నారు. తెలంగాణ కేబినెట్‌, నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారో.. రేవంత్ రెడ్డి చెప్పాల‌న్నారు. బీసీల‌కు న్యాయం చేయాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు.

Satya

Recent Posts

హీరోయిన్ల కలెక్షన్లతో ఫ్యాన్ వార్స్ ఏంటయ్యా…

టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…

9 minutes ago

‘శ‌వాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’

వ‌చ్చే మూడేళ్ల‌లో తానేంటో చూపిస్తాన‌ని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

26 minutes ago

థియేటర్ ప్రకటనలు ఆరోగ్యాన్ని భోదిస్తున్నాయి

ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…

37 minutes ago

రెచ్చగొడితే రచ్చే.. లంక బౌలర్లను ఉతికారేసిన వైభవ్!

పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…

1 hour ago

రాందేవ్ బాబాకు ధీటుగా చంద్రబాబు

జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…

2 hours ago

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

2 hours ago