తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును రాష్ట్రపతి ఇప్పటి వరకు ఆమోదించలేదు. మరోవైపు.. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసినా.. దాని ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి.. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోం ది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు.. ఢిల్లీలో ధర్నాకు దిగారు. పార్లమెంటులో అయినా .. రిజర్వేషన్ను ఆమోదించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే.. ఈ ధర్నాపై కేంద్ర మంత్రి, తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముస్లింల కోసం.. ముఖ్యంగా ఎంఐఎం కోసం.. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే ఢిల్లీలో యాగీ చేస్తున్నారని బండి విమర్శించారు. వాస్తవానికి.. కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ వేరని.. కానీ.. దానికి భిన్నంగా ఇప్పుడు.. ముస్లింల కోసం కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారని విమర్శించారు. బీసీలకు 5 శాతం పెంచి.. ముస్లింలకు అదనంగా పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్ర చేస్తున్నారని బండి నిప్పులు చెరిగారు.
బీసీల పేరుతో మైనారిటీ ముస్లింలకు రిజర్వేషన్ కట్టబెట్టేందుకు.. ముఖ్యంగా ఎంఐఎంకు మేలు చేసేం దుకు.. కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. బీసీలకు పూర్తిగా 42 శాతం రిజర్వేషన్ అమ లు చేస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదన్న బండి.. కానీ, క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదన్నారు. మైనారిటీ ముస్లింలకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వాస్తవానికి బీజేపీ బీసీ పక్షపాతి అని పేర్కొన్నారు. అందుకే.. మూడు సార్లుగా బీసీకే ప్రధాని పీఠం అప్పగించామన్నారు.
కానీ.. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా బీసీలకు మేలు చేసిందా? అని ప్రశ్నించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎ న్నడైనా బీసీని ప్రధాని చేశారా? అని బండి నిలదీశారు. ఉమ్మడి ఏపీలో కూడా బీసీకి ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్నారు. తెలంగాణ కేబినెట్, నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారో.. రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. బీసీలకు న్యాయం చేయాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు.
This post was last modified on August 6, 2025 6:57 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…