Political News

‘ఎంఐఎం కోసం రేవంత్ ఆరాటం’

తెలంగాణ‌లో బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను 42 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును రాష్ట్ర‌ప‌తి ఇప్ప‌టి వ‌ర‌కు ఆమోదించ‌లేదు. మ‌రోవైపు.. గ‌వ‌ర్న‌ర్ ఆర్డినెన్స్ జారీ చేసినా.. దాని ప్ర‌కారం బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించి.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోం ది. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వంలోని మంత్రులు.. ఢిల్లీలో ధ‌ర్నాకు దిగారు. పార్ల‌మెంటులో అయినా .. రిజ‌ర్వేష‌న్‌ను ఆమోదించేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

అయితే.. ఈ ధ‌ర్నాపై కేంద్ర మంత్రి, తెలంగాణ‌కు చెందిన బీజేపీ నాయ‌కుడు బండి సంజ‌య్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ముస్లింల కోసం.. ముఖ్యంగా ఎంఐఎం కోసం.. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అందుకే ఢిల్లీలో యాగీ చేస్తున్నార‌ని బండి విమ‌ర్శించారు. వాస్త‌వానికి.. కామారెడ్డిలో చేసిన డిక్ల‌రేష‌న్ వేర‌ని.. కానీ.. దానికి భిన్నంగా ఇప్పుడు.. ముస్లింల కోసం కాంగ్రెస్ నేత‌లు రోడ్డెక్కార‌ని విమ‌ర్శించారు. బీసీలకు 5 శాతం పెంచి.. ముస్లింలకు అదనంగా పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్ర చేస్తున్నారని బండి నిప్పులు చెరిగారు.

బీసీల పేరుతో మైనారిటీ ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ట్ట‌బెట్టేందుకు.. ముఖ్యంగా ఎంఐఎంకు మేలు చేసేం దుకు.. కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. బీసీల‌కు పూర్తిగా 42 శాతం రిజ‌ర్వేష‌న్ అమ లు చేస్తే ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్న బండి.. కానీ, క్షేత్ర‌స్థాయిలో అలా జ‌ర‌గ‌డం లేద‌న్నారు. మైనారిటీ ముస్లింల‌కు మేలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. వాస్త‌వానికి బీజేపీ బీసీ ప‌క్ష‌పాతి అని పేర్కొన్నారు. అందుకే.. మూడు సార్లుగా బీసీకే ప్ర‌ధాని పీఠం అప్ప‌గించామ‌న్నారు.

కానీ.. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా బీసీల‌కు మేలు చేసిందా? అని ప్ర‌శ్నించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎ న్నడైనా బీసీని ప్రధాని చేశారా? అని బండి నిల‌దీశారు. ఉమ్మ‌డి ఏపీలో కూడా బీసీకి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌న్నారు. తెలంగాణ కేబినెట్‌, నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారో.. రేవంత్ రెడ్డి చెప్పాల‌న్నారు. బీసీల‌కు న్యాయం చేయాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు.

This post was last modified on August 6, 2025 6:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

4 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

5 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

5 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

8 hours ago