తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును రాష్ట్రపతి ఇప్పటి వరకు ఆమోదించలేదు. మరోవైపు.. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసినా.. దాని ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి.. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోం ది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు.. ఢిల్లీలో ధర్నాకు దిగారు. పార్లమెంటులో అయినా .. రిజర్వేషన్ను ఆమోదించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే.. ఈ ధర్నాపై కేంద్ర మంత్రి, తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముస్లింల కోసం.. ముఖ్యంగా ఎంఐఎం కోసం.. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే ఢిల్లీలో యాగీ చేస్తున్నారని బండి విమర్శించారు. వాస్తవానికి.. కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ వేరని.. కానీ.. దానికి భిన్నంగా ఇప్పుడు.. ముస్లింల కోసం కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారని విమర్శించారు. బీసీలకు 5 శాతం పెంచి.. ముస్లింలకు అదనంగా పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్ర చేస్తున్నారని బండి నిప్పులు చెరిగారు.
బీసీల పేరుతో మైనారిటీ ముస్లింలకు రిజర్వేషన్ కట్టబెట్టేందుకు.. ముఖ్యంగా ఎంఐఎంకు మేలు చేసేం దుకు.. కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. బీసీలకు పూర్తిగా 42 శాతం రిజర్వేషన్ అమ లు చేస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదన్న బండి.. కానీ, క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదన్నారు. మైనారిటీ ముస్లింలకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వాస్తవానికి బీజేపీ బీసీ పక్షపాతి అని పేర్కొన్నారు. అందుకే.. మూడు సార్లుగా బీసీకే ప్రధాని పీఠం అప్పగించామన్నారు.
కానీ.. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా బీసీలకు మేలు చేసిందా? అని ప్రశ్నించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎ న్నడైనా బీసీని ప్రధాని చేశారా? అని బండి నిలదీశారు. ఉమ్మడి ఏపీలో కూడా బీసీకి ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్నారు. తెలంగాణ కేబినెట్, నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారో.. రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. బీసీలకు న్యాయం చేయాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు.
This post was last modified on August 6, 2025 6:57 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…