తెలంగాణలో సోమవారం అటు అధికార పక్షం కాంగ్రెస్ తో పాటు ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు అత్యంత ప్రత్యేకమైన రోజు అని చెప్పుకున్నాం కదా. అలాంటి ప్రత్యేకమైన రోజే బీఆర్ఎస్ కు, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు గట్టి షాక్ తగిలింది. ఆది నుంచి పార్టీ క్రియాశీలకంగా పనిచేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన నేరుగా కేసీఆర్ కే పంపారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉండగా… 2003 అసెంబ్లీ ఎన్నికలకు కాస్తంత ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికగా రాజకీయ ఫిరాయింపులకు సంబంధించిన బేరసారాలు జరుగుతున్నాయన్న వార్తలు పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇలా పార్టీ మారే వారిలో రోహిత్ రెడ్డితో పాటు గువ్వల బాలరాజు కూడా ఉన్నారన్న వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత ఆ వాదనలన్నీ తప్పని తామే స్టింగ్ ఆపరేషన్ చేశామంటూ బాలరాజు బృందం చెప్పింది.
ఇదిలా ఉంటే… దళిత సామాజిక వర్గానికి చెందిన బాలరాజు బీఆర్ఎస్ లో ఆది నుంచి క్రియాశీలకంగానే ఉన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డార జరిగిన ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై 2018లోనూ ఆయన అదే స్థానం నుంచి విజయం సాధించారు. పార్టీ అధిష్టానం వద్ద మంచి పేరును సంపాదించుకున్న బాలరాజు ఇప్పుడు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.
This post was last modified on August 4, 2025 11:42 pm
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…