Political News

జగన్‌ ఇంటికెళ్తే.. వైసీపీ కండువా వేసేశారట

లెజెండరీ నటి జయసుధ నట వారసత్వాన్ని అందుకుంటూ సినిమాల్లోకి అడుగు పెట్టారు ఆమె తనయులు నిహార్ కపూర్, శ్రేయాన్ కపూర్. ఐతే వీరిలో శ్రేయాన్ హీరోగా ‘బస్తీ’ అనే ఒక సినిమా చేసి తెరమరుగు అయ్యాడు. నిహార్ మాత్రం నెగెటివ్, క్యారెక్టర్ రోల్స్‌తో టాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’లో అతను ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. 

‘బాహుబలి’లో భల్లాలదేవ పాత్ర తాను చేయాల్సిందని.. అందుకోసం కొన్ని రోజులు ట్రైనింగ్ కూడా తీసుకున్నానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఓ సంచలన విషయం కూడా చెప్పాడు నిహార్. ఆ అవకాశం మిస్ అయినప్పటికీ.. ‘వీరమల్లు’తో వచ్చిన గుర్తింపుతో మరిన్ని అవకాశాలు అందుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా మరో ఇంటర్వ్యూలో రాజకీయాలకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటపెట్టాడు నిహార్ కపూర్.

గతంలో జయసుధ, నిహార్ కలిసి ఒకసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇంట్లో కలిశారు. అప్పుడు వాళ్లిద్దరూ మెడలో వైసీపీ కండువాలతో కనిపించడంతో ఆ పార్టీలో చేరారని అంతా అనుకున్నారు. కానీ జయసుధ కానీ, నిహార్ కానీ.. ఆ పార్టీ కోసం ఎన్నికల ప్రచారంలో ఏమీ పాల్గొనలేదు. జయసుధకు వైఎస్ అంటే అభిమానం అన్న సంగతి తెలిసిందే. ఆయన ఉండగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ వైసీపీలో మాత్రం అధికారికంగా చేరినట్లు సమాచారం ఏదీ బయటికి రాలేదు. 

మరి ఆ కండువాల సంగతేంటి అని ఈ ఇంటర్వ్యూలో నిహార్‌ను అడిగితే ఆశ్చర్యపరిచే విషయం చెప్పారు. జగన్‌ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్తే వైసీపీ కండువాలు తెచ్చి మెడలో వేసేశారని.. అలాగే ఫొటోలు కూడా తీశారని అతను చెప్పాడు. అంతే తప్ప తాము వైసీపీలో చేరలేదని అతనన్నాడు. జగన్ ఇంటికి వెళ్లిన అందరికీ ఇలా కండువాలు వేస్తారన్నట్లుగా అతను మాట్లాడ్డం గమనార్హం. దీంతో ఇదేం సంప్రదాయం అంటూ వైసీపీ వాళ్ల తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.

This post was last modified on July 29, 2025 3:23 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

54 minutes ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

8 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

9 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

10 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

11 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

12 hours ago