Political News

జగన్‌ ఇంటికెళ్తే.. వైసీపీ కండువా వేసేశారట

లెజెండరీ నటి జయసుధ నట వారసత్వాన్ని అందుకుంటూ సినిమాల్లోకి అడుగు పెట్టారు ఆమె తనయులు నిహార్ కపూర్, శ్రేయాన్ కపూర్. ఐతే వీరిలో శ్రేయాన్ హీరోగా ‘బస్తీ’ అనే ఒక సినిమా చేసి తెరమరుగు అయ్యాడు. నిహార్ మాత్రం నెగెటివ్, క్యారెక్టర్ రోల్స్‌తో టాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’లో అతను ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. 

‘బాహుబలి’లో భల్లాలదేవ పాత్ర తాను చేయాల్సిందని.. అందుకోసం కొన్ని రోజులు ట్రైనింగ్ కూడా తీసుకున్నానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఓ సంచలన విషయం కూడా చెప్పాడు నిహార్. ఆ అవకాశం మిస్ అయినప్పటికీ.. ‘వీరమల్లు’తో వచ్చిన గుర్తింపుతో మరిన్ని అవకాశాలు అందుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా మరో ఇంటర్వ్యూలో రాజకీయాలకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటపెట్టాడు నిహార్ కపూర్.

గతంలో జయసుధ, నిహార్ కలిసి ఒకసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇంట్లో కలిశారు. అప్పుడు వాళ్లిద్దరూ మెడలో వైసీపీ కండువాలతో కనిపించడంతో ఆ పార్టీలో చేరారని అంతా అనుకున్నారు. కానీ జయసుధ కానీ, నిహార్ కానీ.. ఆ పార్టీ కోసం ఎన్నికల ప్రచారంలో ఏమీ పాల్గొనలేదు. జయసుధకు వైఎస్ అంటే అభిమానం అన్న సంగతి తెలిసిందే. ఆయన ఉండగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ వైసీపీలో మాత్రం అధికారికంగా చేరినట్లు సమాచారం ఏదీ బయటికి రాలేదు. 

మరి ఆ కండువాల సంగతేంటి అని ఈ ఇంటర్వ్యూలో నిహార్‌ను అడిగితే ఆశ్చర్యపరిచే విషయం చెప్పారు. జగన్‌ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్తే వైసీపీ కండువాలు తెచ్చి మెడలో వేసేశారని.. అలాగే ఫొటోలు కూడా తీశారని అతను చెప్పాడు. అంతే తప్ప తాము వైసీపీలో చేరలేదని అతనన్నాడు. జగన్ ఇంటికి వెళ్లిన అందరికీ ఇలా కండువాలు వేస్తారన్నట్లుగా అతను మాట్లాడ్డం గమనార్హం. దీంతో ఇదేం సంప్రదాయం అంటూ వైసీపీ వాళ్ల తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.

This post was last modified on July 29, 2025 3:23 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

41 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago