Political News

మోడీ పొదుపు.. విదేశీ ప‌ర్య‌ట‌న‌కు ఎన్ని కోట్లో తెల్పిన కేంద్రం!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు చేసిన ఖ‌ర్చు.. 370 కోట్ల పైచిలుకుగా ఉంద‌ని.. కేంద్రం వెల్ల‌డించింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి చౌధ‌రి.. లోక్‌స‌భ‌కు లిఖిత పూర్వ‌కంగా వివ‌రించారు. ఇది.. గ‌త ఐదేళ్ల‌కు సంబంధించిన ఖ‌ర్చు అని ఆయ‌న తెలిపారు. 2021-25(మార్చి 31) వ‌ర‌కు చేసిన ఖ‌ర్చుగాఆయ‌న పేర్కొన్నారు. ఈ ఐదేళ్ల‌లో మొత్తం 33 దేశాల‌కు ప్ర‌ధాని వెళ్లార‌ని తెలిపారు.

ఆయా దేశాల్లో బ‌స చేసినందుకు.. కానుక‌లు ఇచ్చినందుకు.. ర‌వాణా చార్జీలు.. ఇత‌ర భ‌త్యాలు క‌లుపుకొని 370 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు అయింద‌ని పేర్కొన్నారు. భార‌త‌ ప్ర‌ధాన మంత్రి విదేశాల‌కు వెళ్తే.. దేశ ప్ర‌జ‌లు వెళ్లిన‌ట్టేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. “142 కోట్ల మంది ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌ధాని ప్ర‌తినిధిగా ఆయా దేశాలకు వెళ్లారు. ఆయ‌న ఈ దేశ గౌర‌వాన్ని.. ప్ర‌తిష్ట‌ను విదేశీ గ‌డ్డ‌పై నిల‌బెట్టాల్సి ఉంది. ఈ ఖ‌ర్చును పెద్ద‌దిగా చేసి చూపేందుకు ప్ర‌య‌త్నించ‌డం స‌రికాదు.“ అని వ్యాఖ్యానించారు.

ప్రతిప‌క్షాలు ప్ర‌తి విష‌యాన్నీ యాగీ చేస్తున్నాయ‌ని పంక‌జ్ చౌధ‌రి అన్నారు. ర‌ష్యా, అమెరికా, బ్రిట‌న్ దేశాల‌కు చెందిన నాయ‌కులు విదేశాల్లో ప‌ర్య‌టిస్తున్న‌ప్పుడు.. ఇంకా ఎక్కువ‌గానే ఖ‌ర్చు చేస్తున్నార‌ని చెప్పారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పొదుపు పాటిస్తార‌ని.. అందుకే ఖ‌ర్చు చాలా త‌క్కువ పెట్టార‌ని ఆయ‌న చెప్ప‌డం లోక్‌స‌భ‌లో న‌వ్వులు పూయించింది. విప‌క్ష స‌భ్యులు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేలా చేసింది.

ఇక‌, అమెరికాలో ఒక్క‌రోజు ప‌ర్య‌ట‌న కోసం.. 18 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు మంత్రి వివ‌రించారు. అలాగే.. ఈ ఏడాది తాజాగా చేసిన బ్రిట‌న్‌, థాయ్‌లాండ్ ప‌ర్య‌ట‌న‌ల ఖ‌ర్చును దీనిలో చేర్చ‌లేద‌ని తెలిపారు. విదేశాలకు వెళ్లిన‌ప్పుడు.. అధికారుల‌కు భ‌త్యాలు ఇచ్చే సంప్ర‌దాయం ఉంద‌ని.. ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌ను క‌వ‌ర్ చేసే మీడియాకు కూడా ఖ‌ర్చులు ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని.. ఇవ‌న్నీ.. క‌లిపి 370 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌యింద‌న్నారు.

Kumar

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

1 hour ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

7 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

7 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

7 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

8 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

9 hours ago