Political News

మోడీ పొదుపు.. విదేశీ ప‌ర్య‌ట‌న‌కు ఎన్ని కోట్లో తెల్పిన కేంద్రం!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు చేసిన ఖ‌ర్చు.. 370 కోట్ల పైచిలుకుగా ఉంద‌ని.. కేంద్రం వెల్ల‌డించింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి చౌధ‌రి.. లోక్‌స‌భ‌కు లిఖిత పూర్వ‌కంగా వివ‌రించారు. ఇది.. గ‌త ఐదేళ్ల‌కు సంబంధించిన ఖ‌ర్చు అని ఆయ‌న తెలిపారు. 2021-25(మార్చి 31) వ‌ర‌కు చేసిన ఖ‌ర్చుగాఆయ‌న పేర్కొన్నారు. ఈ ఐదేళ్ల‌లో మొత్తం 33 దేశాల‌కు ప్ర‌ధాని వెళ్లార‌ని తెలిపారు.

ఆయా దేశాల్లో బ‌స చేసినందుకు.. కానుక‌లు ఇచ్చినందుకు.. ర‌వాణా చార్జీలు.. ఇత‌ర భ‌త్యాలు క‌లుపుకొని 370 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు అయింద‌ని పేర్కొన్నారు. భార‌త‌ ప్ర‌ధాన మంత్రి విదేశాల‌కు వెళ్తే.. దేశ ప్ర‌జ‌లు వెళ్లిన‌ట్టేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. “142 కోట్ల మంది ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌ధాని ప్ర‌తినిధిగా ఆయా దేశాలకు వెళ్లారు. ఆయ‌న ఈ దేశ గౌర‌వాన్ని.. ప్ర‌తిష్ట‌ను విదేశీ గ‌డ్డ‌పై నిల‌బెట్టాల్సి ఉంది. ఈ ఖ‌ర్చును పెద్ద‌దిగా చేసి చూపేందుకు ప్ర‌య‌త్నించ‌డం స‌రికాదు.“ అని వ్యాఖ్యానించారు.

ప్రతిప‌క్షాలు ప్ర‌తి విష‌యాన్నీ యాగీ చేస్తున్నాయ‌ని పంక‌జ్ చౌధ‌రి అన్నారు. ర‌ష్యా, అమెరికా, బ్రిట‌న్ దేశాల‌కు చెందిన నాయ‌కులు విదేశాల్లో ప‌ర్య‌టిస్తున్న‌ప్పుడు.. ఇంకా ఎక్కువ‌గానే ఖ‌ర్చు చేస్తున్నార‌ని చెప్పారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పొదుపు పాటిస్తార‌ని.. అందుకే ఖ‌ర్చు చాలా త‌క్కువ పెట్టార‌ని ఆయ‌న చెప్ప‌డం లోక్‌స‌భ‌లో న‌వ్వులు పూయించింది. విప‌క్ష స‌భ్యులు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేలా చేసింది.

ఇక‌, అమెరికాలో ఒక్క‌రోజు ప‌ర్య‌ట‌న కోసం.. 18 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు మంత్రి వివ‌రించారు. అలాగే.. ఈ ఏడాది తాజాగా చేసిన బ్రిట‌న్‌, థాయ్‌లాండ్ ప‌ర్య‌ట‌న‌ల ఖ‌ర్చును దీనిలో చేర్చ‌లేద‌ని తెలిపారు. విదేశాలకు వెళ్లిన‌ప్పుడు.. అధికారుల‌కు భ‌త్యాలు ఇచ్చే సంప్ర‌దాయం ఉంద‌ని.. ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌ను క‌వ‌ర్ చేసే మీడియాకు కూడా ఖ‌ర్చులు ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని.. ఇవ‌న్నీ.. క‌లిపి 370 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌యింద‌న్నారు.

This post was last modified on July 29, 2025 2:44 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Modi

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

27 minutes ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

50 minutes ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

2 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

4 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

5 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

6 hours ago