Political News

ఇక‌ అవినాష్ వంతు.. అరెస్టు కోరుతూ ‘సిట్‌’ పిటిష‌న్‌

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంపై విచార‌ణ చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తుబృందం ఇప్ప‌టికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 12 మందిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. వీరిలో 11 మంది విజ‌య‌వాడ జైల్లో ఉండ‌గా.. మిథున్‌రెడ్డి మాత్రం రాజ‌మండ్రి జైల్లో ఉన్నారు. అయితే..ఈ అరెస్టులు ఇప్ప‌టితో ఆగేలా క‌నిపించ‌డం లేదు. మ‌రో 12 మంది నిందితుల‌ను అరెస్టు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. పేర్కొంటూ.. తాజాగా విజ‌య‌వాడ ఏసీబీ కోర్టులో ప్ర‌త్య‌క ద‌ర్యాప్తు బృందం అధికారులు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ఉండ‌డం సంచ‌ల‌నంగా మారింది.

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు అవినాష్ రెడ్డి పేరు ఉన్న‌ట్టు తెలియ‌దు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను విచారించిన దాఖ‌లా కూడా లేదు. కానీ, తాజాగా కోర్టుకు స‌మ‌ర్పించిన పిటిష‌న్‌లో ఏ7గా ఉన్న అవినాష్ రెడ్డి స‌హా.. ఏ40గా ఉన్న‌ పురుషోత్తం, ఏ41 అయిన‌ అనిరుద్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్, బొల్లారం శివ, సైమన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల బెహ్రెన్ పేర్ల‌ను పేర్కొన్నారు. వీరిని కూడా అరెస్టు చేయాల్సి ఉంద‌ని.. మ‌ద్యం కుంభ‌కోణంలో వీరి పాత్ర కూడా ఉంద‌ని సిట్ అదికారులు తెలిపారు. అయితే.. వీరిలో కొంద‌రు విదేశాల్లో ఉన్నార‌ని సిట్ పేర్కొంది.

కోర్టు అనుమ‌తిస్తే.. వారికి రెడ్ కార్న‌ర్‌నోటీసులు జారీ చేయ‌నున్న‌ట్టు అధికారులు పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దీంతో సిట్ పూర్తిస్థాయిలో ఈ వ్య‌వ‌హారంపై ప‌ట్టు సాధించిన‌ట్టు అయింద‌నిన్యాయ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తం 43 మంది పేర్లను ఈ కేసులో పేర్కొన్న అధికారులు 12 మందిని ఇప్ప‌టికే అరెస్టుచేయ‌డం, మ‌రో 12 మంది అరెస్టు కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంతో కేసు వేగంగా ముందుకు సాగుతోంద‌ని చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆర్థిక మూలాలు..ఇవి అంతిమంగా ఎవ‌రికి చేరాయ‌న్న విష‌యంపై మాత్రం ఇంకా కూపీలాగాల్సి ఉంద‌ని అధికారులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పటికే అరెస్టు చేసిన వారితోపాటు.. కొత్త‌గా పేర్కొన్న‌వారిని కూడా అరెస్టు చేస్తే.. ఆయా వివ‌రాలు వెలుగు చూసే అవ‌కాశంఉంద‌ని అంటున్నారు.

Satya

Recent Posts

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

2 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

3 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

5 hours ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

6 hours ago

సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…

7 hours ago

పింక్ శారీలో రాశి.. చూపు తిప్పుకోవడం కష్టమే!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…

8 hours ago