Political News

ఇక‌ అవినాష్ వంతు.. అరెస్టు కోరుతూ ‘సిట్‌’ పిటిష‌న్‌

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంపై విచార‌ణ చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తుబృందం ఇప్ప‌టికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 12 మందిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. వీరిలో 11 మంది విజ‌య‌వాడ జైల్లో ఉండ‌గా.. మిథున్‌రెడ్డి మాత్రం రాజ‌మండ్రి జైల్లో ఉన్నారు. అయితే..ఈ అరెస్టులు ఇప్ప‌టితో ఆగేలా క‌నిపించ‌డం లేదు. మ‌రో 12 మంది నిందితుల‌ను అరెస్టు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. పేర్కొంటూ.. తాజాగా విజ‌య‌వాడ ఏసీబీ కోర్టులో ప్ర‌త్య‌క ద‌ర్యాప్తు బృందం అధికారులు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ఉండ‌డం సంచ‌ల‌నంగా మారింది.

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు అవినాష్ రెడ్డి పేరు ఉన్న‌ట్టు తెలియ‌దు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను విచారించిన దాఖ‌లా కూడా లేదు. కానీ, తాజాగా కోర్టుకు స‌మ‌ర్పించిన పిటిష‌న్‌లో ఏ7గా ఉన్న అవినాష్ రెడ్డి స‌హా.. ఏ40గా ఉన్న‌ పురుషోత్తం, ఏ41 అయిన‌ అనిరుద్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్, బొల్లారం శివ, సైమన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల బెహ్రెన్ పేర్ల‌ను పేర్కొన్నారు. వీరిని కూడా అరెస్టు చేయాల్సి ఉంద‌ని.. మ‌ద్యం కుంభ‌కోణంలో వీరి పాత్ర కూడా ఉంద‌ని సిట్ అదికారులు తెలిపారు. అయితే.. వీరిలో కొంద‌రు విదేశాల్లో ఉన్నార‌ని సిట్ పేర్కొంది.

కోర్టు అనుమ‌తిస్తే.. వారికి రెడ్ కార్న‌ర్‌నోటీసులు జారీ చేయ‌నున్న‌ట్టు అధికారులు పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దీంతో సిట్ పూర్తిస్థాయిలో ఈ వ్య‌వ‌హారంపై ప‌ట్టు సాధించిన‌ట్టు అయింద‌నిన్యాయ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తం 43 మంది పేర్లను ఈ కేసులో పేర్కొన్న అధికారులు 12 మందిని ఇప్ప‌టికే అరెస్టుచేయ‌డం, మ‌రో 12 మంది అరెస్టు కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంతో కేసు వేగంగా ముందుకు సాగుతోంద‌ని చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆర్థిక మూలాలు..ఇవి అంతిమంగా ఎవ‌రికి చేరాయ‌న్న విష‌యంపై మాత్రం ఇంకా కూపీలాగాల్సి ఉంద‌ని అధికారులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పటికే అరెస్టు చేసిన వారితోపాటు.. కొత్త‌గా పేర్కొన్న‌వారిని కూడా అరెస్టు చేస్తే.. ఆయా వివ‌రాలు వెలుగు చూసే అవ‌కాశంఉంద‌ని అంటున్నారు.

This post was last modified on July 26, 2025 9:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సాయిపల్లవిపై ఎందుకింత నెగెటివిటీ?

గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…

51 minutes ago

బాబు కొత్త నిర్ణయం… వారి పరిస్థితి ఏమిటి?

రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని.. దీనికి మ‌హిళ‌లు కూడా సిద్ధంగా ఉండాల‌ని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…

1 hour ago

అనిల్ యానిమేషన్ మూవీ భవిష్యత్ కోసమా

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం  సబబు కాకపోయినా ఇండస్ట్రీలో…

2 hours ago

ఒక్క టికెట్ 2400 రూపాయలు… అయినా సోల్డవుట్

తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ టికెట్ రేట్లు వెయ్యి రూపాయలు టచ్ అయితేనే తీవ్రంగా అభ్యంతర పెట్టే విషయమవుతుంది. అలాంటిది దానికి…

2 hours ago

థ్రిల్లింగ్… యూత్ సినిమాలో ఆర్ నారాయణమూర్తి ?

కమర్షియల్ రాజ్యంలో తాను అనుకున్న సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి సినిమాలు తీసిన హీరో, దర్శకుడిగా ఆర్ నారాయణమూర్తి అంటే  ప్రేక్షకులకే…

4 hours ago

శ్రీవిష్ణు గేరు మార్చే టైమొచ్చింది

కింగ్ అఫ్ కంటెంట్ లేదా ఎంటర్ టైన్మెంట్ అని వినడానికి బాగానే ఉంది కానీ హీరో విష్ణు తన ఎంపికను…

4 hours ago