Political News

ప‌వ‌న్ సార్‌.. ప‌ట్టించుకోండి: గిరిజ‌నులు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వ‌ర్గాల‌కు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఏదైనా ప‌నిని చేప‌డితే.. ఖ‌చ్చితంగా అది పూర్తి చేస్తార‌ని.. ఆయ‌న హామీ ఇస్తే ఆ ప‌ని నెర‌వేరుతుంద‌ని కూడా న‌మ్మేవారు కోకొల్లలుగా ఉన్నారు. అనుకున్న విధంగా ప‌నులు చేస్తార‌ని.. ఇచ్చిన హామీని నెర వేర్చేందుకు ప్ర‌య‌త్నిస్తార‌న్న పేరు కూడా ఉంది. ముఖ్యంగా గిరిజ‌నులు మ‌రింత ఎక్కువగా ప‌వ‌న్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. ఆయ‌న కూడా వారిని అలానే చూస్తున్నారు.

గిరిజ‌నుల స‌మ‌స్య‌లు తెలుసుకుని.. వాటిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. గ‌త ఆరు మాసాల కింద‌ట ఇచ్చిన ఒక హామీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర‌క‌పోవ‌డంపై గిరిజ‌నులు ప్ర‌శ్నిస్తుంది. ప‌వ‌న్ సార్ ప‌ట్టించుకోండి! అంటూ.. గిరిజ‌నులు నినాదాలు చేస్తున్నారు. ఇలా.. గిరిజ‌నులు రోడ్డెక్క‌డానికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మడ్రేబు, దాయర్తి గ్రామాలలో ఈ ఏడాది ప్రారంభంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఆయా గ్రామాల్లోనిగిరిజ‌నులు ప‌డుతున్న క‌ష్టాల‌ను ఆయ‌న తెలుసుకున్నారు. ఈ క్రమంలో గిరిజ‌నుల‌కు డోలీ మోత‌ల క‌ష్టాలు రాకుండా లేకుండా చేసేందుకు అంద‌మైన ర‌హ‌దారులు నిర్మిస్తా మ‌ని హామీ ఇచ్చారు. ఈ హామీ మేర‌కు.. గుమ్మంతి- రాచకీలం, రాచకీలం- రెడ్డిపాడు, బల్లగరువు- వాజంగి, పీచుమామిడి- గుమ్మంతి రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. అనంత‌రం.. ఈ ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు.

కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయా ర‌హ‌దారుల‌కు శంకుస్థాప‌న చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఆ ప‌నుల‌ను ప‌ట్టిం చుకోలేదు. క‌నీసం.. ఒక్క ప‌నిని కూడా ముందుకు తీసుకువెళ్ల‌లేదు. దీంతో తాజాగా గిరిజ‌నులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. పినకోట, పెదకోట, జీనబాడు పంచాయతీల పరిధిలోని 11 పీవీటీజీ గ్రామాల్లో గిరిజనులు ప‌వ‌న్ ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. తాము ఏ ప‌నుల కోసం బ‌య‌ట‌కు రావాల‌న్నా.. త‌మ‌కు ర‌హ‌దారి సౌక‌ర్యం లేద‌ని.. ఈక్ర‌మంలో ప‌వ‌న్ సార్ ప‌ట్టించుకోవాలని .. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల‌ని ఇక్క‌డి వారు కోరుతున్నారు.

This post was last modified on July 26, 2025 4:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

1 hour ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

3 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

5 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

8 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

9 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

11 hours ago