Political News

ప‌వ‌న్ సార్‌.. ప‌ట్టించుకోండి: గిరిజ‌నులు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వ‌ర్గాల‌కు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఏదైనా ప‌నిని చేప‌డితే.. ఖ‌చ్చితంగా అది పూర్తి చేస్తార‌ని.. ఆయ‌న హామీ ఇస్తే ఆ ప‌ని నెర‌వేరుతుంద‌ని కూడా న‌మ్మేవారు కోకొల్లలుగా ఉన్నారు. అనుకున్న విధంగా ప‌నులు చేస్తార‌ని.. ఇచ్చిన హామీని నెర వేర్చేందుకు ప్ర‌య‌త్నిస్తార‌న్న పేరు కూడా ఉంది. ముఖ్యంగా గిరిజ‌నులు మ‌రింత ఎక్కువగా ప‌వ‌న్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. ఆయ‌న కూడా వారిని అలానే చూస్తున్నారు.

గిరిజ‌నుల స‌మ‌స్య‌లు తెలుసుకుని.. వాటిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. గ‌త ఆరు మాసాల కింద‌ట ఇచ్చిన ఒక హామీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర‌క‌పోవ‌డంపై గిరిజ‌నులు ప్ర‌శ్నిస్తుంది. ప‌వ‌న్ సార్ ప‌ట్టించుకోండి! అంటూ.. గిరిజ‌నులు నినాదాలు చేస్తున్నారు. ఇలా.. గిరిజ‌నులు రోడ్డెక్క‌డానికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మడ్రేబు, దాయర్తి గ్రామాలలో ఈ ఏడాది ప్రారంభంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఆయా గ్రామాల్లోనిగిరిజ‌నులు ప‌డుతున్న క‌ష్టాల‌ను ఆయ‌న తెలుసుకున్నారు. ఈ క్రమంలో గిరిజ‌నుల‌కు డోలీ మోత‌ల క‌ష్టాలు రాకుండా లేకుండా చేసేందుకు అంద‌మైన ర‌హ‌దారులు నిర్మిస్తా మ‌ని హామీ ఇచ్చారు. ఈ హామీ మేర‌కు.. గుమ్మంతి- రాచకీలం, రాచకీలం- రెడ్డిపాడు, బల్లగరువు- వాజంగి, పీచుమామిడి- గుమ్మంతి రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. అనంత‌రం.. ఈ ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు.

కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయా ర‌హ‌దారుల‌కు శంకుస్థాప‌న చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఆ ప‌నుల‌ను ప‌ట్టిం చుకోలేదు. క‌నీసం.. ఒక్క ప‌నిని కూడా ముందుకు తీసుకువెళ్ల‌లేదు. దీంతో తాజాగా గిరిజ‌నులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. పినకోట, పెదకోట, జీనబాడు పంచాయతీల పరిధిలోని 11 పీవీటీజీ గ్రామాల్లో గిరిజనులు ప‌వ‌న్ ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. తాము ఏ ప‌నుల కోసం బ‌య‌ట‌కు రావాల‌న్నా.. త‌మ‌కు ర‌హ‌దారి సౌక‌ర్యం లేద‌ని.. ఈక్ర‌మంలో ప‌వ‌న్ సార్ ప‌ట్టించుకోవాలని .. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల‌ని ఇక్క‌డి వారు కోరుతున్నారు.

This post was last modified on July 26, 2025 4:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మామిడి’ మోసం… ఇదిగో హెచ్చరిక

వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…

25 minutes ago

బీహార్‌పై బీజేపీ ముద్ర‌… ప్రాంతీయ పార్టీల‌కు అలెర్ట్

బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…

3 hours ago

జగన్ అన్నా క్యాంటీన్లను తీసేసింది అందుకేనా?

వైసీపీ హ‌యాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జ‌గ‌న్‌.. పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం కూడా పెట్ట‌లేక పోయార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు.…

8 hours ago

అమరావతిపై ఇంత విషమేంటి నాని గారు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావతిపై వైసీపీ నాయ‌కులు అదే అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌ధానిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన…

9 hours ago

లాయర్ అవతారమెత్తిన రాజు గారు

కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…

9 hours ago

ఎట్టకేలకు వర్మ త్యాగానికి ఫలితం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…

9 hours ago