Political News

ప‌వ‌న్ సార్‌.. ప‌ట్టించుకోండి: గిరిజ‌నులు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వ‌ర్గాల‌కు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఏదైనా ప‌నిని చేప‌డితే.. ఖ‌చ్చితంగా అది పూర్తి చేస్తార‌ని.. ఆయ‌న హామీ ఇస్తే ఆ ప‌ని నెర‌వేరుతుంద‌ని కూడా న‌మ్మేవారు కోకొల్లలుగా ఉన్నారు. అనుకున్న విధంగా ప‌నులు చేస్తార‌ని.. ఇచ్చిన హామీని నెర వేర్చేందుకు ప్ర‌య‌త్నిస్తార‌న్న పేరు కూడా ఉంది. ముఖ్యంగా గిరిజ‌నులు మ‌రింత ఎక్కువగా ప‌వ‌న్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. ఆయ‌న కూడా వారిని అలానే చూస్తున్నారు.

గిరిజ‌నుల స‌మ‌స్య‌లు తెలుసుకుని.. వాటిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. గ‌త ఆరు మాసాల కింద‌ట ఇచ్చిన ఒక హామీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర‌క‌పోవ‌డంపై గిరిజ‌నులు ప్ర‌శ్నిస్తుంది. ప‌వ‌న్ సార్ ప‌ట్టించుకోండి! అంటూ.. గిరిజ‌నులు నినాదాలు చేస్తున్నారు. ఇలా.. గిరిజ‌నులు రోడ్డెక్క‌డానికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మడ్రేబు, దాయర్తి గ్రామాలలో ఈ ఏడాది ప్రారంభంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఆయా గ్రామాల్లోనిగిరిజ‌నులు ప‌డుతున్న క‌ష్టాల‌ను ఆయ‌న తెలుసుకున్నారు. ఈ క్రమంలో గిరిజ‌నుల‌కు డోలీ మోత‌ల క‌ష్టాలు రాకుండా లేకుండా చేసేందుకు అంద‌మైన ర‌హ‌దారులు నిర్మిస్తా మ‌ని హామీ ఇచ్చారు. ఈ హామీ మేర‌కు.. గుమ్మంతి- రాచకీలం, రాచకీలం- రెడ్డిపాడు, బల్లగరువు- వాజంగి, పీచుమామిడి- గుమ్మంతి రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. అనంత‌రం.. ఈ ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు.

కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయా ర‌హ‌దారుల‌కు శంకుస్థాప‌న చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఆ ప‌నుల‌ను ప‌ట్టిం చుకోలేదు. క‌నీసం.. ఒక్క ప‌నిని కూడా ముందుకు తీసుకువెళ్ల‌లేదు. దీంతో తాజాగా గిరిజ‌నులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. పినకోట, పెదకోట, జీనబాడు పంచాయతీల పరిధిలోని 11 పీవీటీజీ గ్రామాల్లో గిరిజనులు ప‌వ‌న్ ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. తాము ఏ ప‌నుల కోసం బ‌య‌ట‌కు రావాల‌న్నా.. త‌మ‌కు ర‌హ‌దారి సౌక‌ర్యం లేద‌ని.. ఈక్ర‌మంలో ప‌వ‌న్ సార్ ప‌ట్టించుకోవాలని .. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల‌ని ఇక్క‌డి వారు కోరుతున్నారు.

This post was last modified on July 26, 2025 4:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైద‌రాబాదీలు… 100 కోట్ల విల్లా కొంటారా?

ఇప్పుడు మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లు సైతం కోటి.. అంత‌కంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వ‌చ్చేశాయి. ధ‌ర‌లు అంత‌గా…

15 minutes ago

కీరవాణి అది తప్పని ఋజువు చేయాలి

సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…

1 hour ago

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

4 hours ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

5 hours ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

8 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

9 hours ago