ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్గాలకు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఏదైనా పనిని చేపడితే.. ఖచ్చితంగా అది పూర్తి చేస్తారని.. ఆయన హామీ ఇస్తే ఆ పని నెరవేరుతుందని కూడా నమ్మేవారు కోకొల్లలుగా ఉన్నారు. అనుకున్న విధంగా పనులు చేస్తారని.. ఇచ్చిన హామీని నెర వేర్చేందుకు ప్రయత్నిస్తారన్న పేరు కూడా ఉంది. ముఖ్యంగా గిరిజనులు మరింత ఎక్కువగా పవన్పై ఆశలు పెట్టుకున్నారు. ఆయన కూడా వారిని అలానే చూస్తున్నారు.
గిరిజనుల సమస్యలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. గత ఆరు మాసాల కిందట ఇచ్చిన ఒక హామీ ఇప్పటి వరకు నెరవేరకపోవడంపై గిరిజనులు ప్రశ్నిస్తుంది. పవన్ సార్ పట్టించుకోండి! అంటూ.. గిరిజనులు నినాదాలు చేస్తున్నారు. ఇలా.. గిరిజనులు రోడ్డెక్కడానికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మడ్రేబు, దాయర్తి గ్రామాలలో ఈ ఏడాది ప్రారంభంలో పవన్ కల్యాణ్ పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోనిగిరిజనులు పడుతున్న కష్టాలను ఆయన తెలుసుకున్నారు. ఈ క్రమంలో గిరిజనులకు డోలీ మోతల కష్టాలు రాకుండా లేకుండా చేసేందుకు అందమైన రహదారులు నిర్మిస్తా మని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు.. గుమ్మంతి- రాచకీలం, రాచకీలం- రెడ్డిపాడు, బల్లగరువు- వాజంగి, పీచుమామిడి- గుమ్మంతి రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం.. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
కానీ, పవన్ కల్యాణ్ ఆయా రహదారులకు శంకుస్థాపన చేసినా.. ఇప్పటి వరకు ఎవరూ ఆ పనులను పట్టిం చుకోలేదు. కనీసం.. ఒక్క పనిని కూడా ముందుకు తీసుకువెళ్లలేదు. దీంతో తాజాగా గిరిజనులు ఆందోళన బాట పట్టారు. పినకోట, పెదకోట, జీనబాడు పంచాయతీల పరిధిలోని 11 పీవీటీజీ గ్రామాల్లో గిరిజనులు పవన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తాము ఏ పనుల కోసం బయటకు రావాలన్నా.. తమకు రహదారి సౌకర్యం లేదని.. ఈక్రమంలో పవన్ సార్ పట్టించుకోవాలని .. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇక్కడి వారు కోరుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…