ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్గాలకు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఏదైనా పనిని చేపడితే.. ఖచ్చితంగా అది పూర్తి చేస్తారని.. ఆయన హామీ ఇస్తే ఆ పని నెరవేరుతుందని కూడా నమ్మేవారు కోకొల్లలుగా ఉన్నారు. అనుకున్న విధంగా పనులు చేస్తారని.. ఇచ్చిన హామీని నెర వేర్చేందుకు ప్రయత్నిస్తారన్న పేరు కూడా ఉంది. ముఖ్యంగా గిరిజనులు మరింత ఎక్కువగా పవన్పై ఆశలు పెట్టుకున్నారు. ఆయన కూడా వారిని అలానే చూస్తున్నారు.
గిరిజనుల సమస్యలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. గత ఆరు మాసాల కిందట ఇచ్చిన ఒక హామీ ఇప్పటి వరకు నెరవేరకపోవడంపై గిరిజనులు ప్రశ్నిస్తుంది. పవన్ సార్ పట్టించుకోండి! అంటూ.. గిరిజనులు నినాదాలు చేస్తున్నారు. ఇలా.. గిరిజనులు రోడ్డెక్కడానికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మడ్రేబు, దాయర్తి గ్రామాలలో ఈ ఏడాది ప్రారంభంలో పవన్ కల్యాణ్ పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోనిగిరిజనులు పడుతున్న కష్టాలను ఆయన తెలుసుకున్నారు. ఈ క్రమంలో గిరిజనులకు డోలీ మోతల కష్టాలు రాకుండా లేకుండా చేసేందుకు అందమైన రహదారులు నిర్మిస్తా మని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు.. గుమ్మంతి- రాచకీలం, రాచకీలం- రెడ్డిపాడు, బల్లగరువు- వాజంగి, పీచుమామిడి- గుమ్మంతి రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం.. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
కానీ, పవన్ కల్యాణ్ ఆయా రహదారులకు శంకుస్థాపన చేసినా.. ఇప్పటి వరకు ఎవరూ ఆ పనులను పట్టిం చుకోలేదు. కనీసం.. ఒక్క పనిని కూడా ముందుకు తీసుకువెళ్లలేదు. దీంతో తాజాగా గిరిజనులు ఆందోళన బాట పట్టారు. పినకోట, పెదకోట, జీనబాడు పంచాయతీల పరిధిలోని 11 పీవీటీజీ గ్రామాల్లో గిరిజనులు పవన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తాము ఏ పనుల కోసం బయటకు రావాలన్నా.. తమకు రహదారి సౌకర్యం లేదని.. ఈక్రమంలో పవన్ సార్ పట్టించుకోవాలని .. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇక్కడి వారు కోరుతున్నారు.
This post was last modified on July 26, 2025 4:11 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…