Political News

క్లారిటీ లేని ఏకైక నేత పవనేనా?

రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఏమాత్రం బాధ్యత లేకుండా హ్యాపీగా తిరిగేస్తున్ననేత ఎవరైనా ఉన్నారా ? అంటే అది జనసేన అధినేత పవన్ కల్యాన్ మాత్రమే అని ఎవరైనా సమాధానం చెప్పేస్తారు. ప్రశ్నించేందుకు రాజకీయ పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ తాను ఎవరిని ప్రశ్నించాడు? ఎవరిని ప్రశ్నిస్తున్నాడనే విషయాల్లో మాత్రం క్లారిటి లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇంత గందరగోళంగా రాజకీయ పార్టీని నడుపుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే దేశం మొత్తం మీద బహుశా పవన్ ఒక్కరే కనిపిస్తారేమో. ఇటువంటి పవన్ ఈనెల 17, 18 తేదీల్లో రాజధాని జేఏసీ ప్రతినిధులు, రైతులతో సమావేశం పెట్టుకున్నారు మంగళగిరి కార్యాలయంలో.

చంద్రబాబునాయుడుకు కొంతకాలం మిత్రపక్షంగా వ్యవహరించారు. తర్వాత పూర్తిగా విభేదిస్తు నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. మళ్లీ బీజేపీతో కలిసిపోయారు. ఒక్క విషయంలో మాత్రం పవన్ కు మంచి క్లారిటి ఉందని అర్ధమైపోతోంది. అదేమిటంటే తాను ఎవరితో కలిసున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తుంటారని. చంద్రబాబుతో కలిసున్నా, విడిపోయినా జగన్ కు మాత్రం వ్యతిరేకంగానే ఉన్నారు.

పార్టీ భవిష్యత్తు ఏమిటో మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. రెండుచోట్ల పోటీ చేసిన పవనే ఓడిపోవటంతో మొత్తం పార్టీ నేతలే అడ్రస్ లేకుండా పోయారు. అసలు పవన్ లో సమస్య ఏమిటంటే ఏ విషయంలో కూడా స్పష్టమైన విధానమంటు లేకపోవటమే. రాజధాని రైతులకు ఒసారి మద్దతుగా మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో పర్యటించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా రైతులను రెచ్చగొట్టారు. తెరవెనుక ఏమి జరిగిందో ఏమో తర్వాత రైతులను గాలికొదిలేసి చంద్రబాబుతో చేతులు కలిపేశారు.

మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపాదించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు రాష్ట్రం మొత్తానికి అమరావతే రాజధాని అయినా తనకు మాత్రం కర్నూలే రాజధాని అన్నారు. మరి జగన్ కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదిస్తే వ్యతిరేకిస్తున్నారు. మరోసారి రాజధానిగా అమరావతి పనికిరాదు విశాకపట్నమే బెస్టంటు నానా యాగీ చేశారు. అలాంటిది ఇపుడు జగన్ అధికారంలోకి రాగానే వైజాగ్ ను రాజధానిగా చేస్తానంటూ వద్దంటు వ్యతిరేకిస్తున్నారు. పవన్ లోనే ఇంత గందరగోళం కనిపిస్తుంటే ఇక నేతలు మాత్రం ఏమి చేస్తారు ?

ఇటువంటి నేపధ్యంలో తాజాగా పవన్ రాజధాని రైతులతోను, అమరావతి జేఏసీ నేతలతోను ఎందుకు సమావేశం అవుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. పవన్ వ్యవహారం చూస్తుంటే ఏదో టైంపాస్ రాజకీయాలు చేస్తున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజకీయాల్లో గ్యాప్ వస్తే సినిమాలు చేసుకోవటం. సినిమాల్లో గ్యాప్ వస్తే రాజకీయాలు మాట్లాడటం అనే రెండు పడవలపై కాళ్ళు పెట్టారు. మరి ఏకకాలంలో ఇటు పార్టీ నేతలను, అటు జనాలను ఎంతకాలం మోసం చేద్దామని అనుకుంటున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఏం చేస్తాం ఎవరికైనా జరిగినంత కాలమే అని సరిపెట్టుకోవాల్సిందే.

This post was last modified on November 18, 2020 10:52 am

Share
Show comments

Recent Posts

సంతోష్ శోభ‌న్… ప‌ర‌లోక యాత్ర‌

ఫ్లాపుల ప‌రంప‌ర‌కు తెర‌దించుతూ.. ఈ ఏడాది క‌పుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు యువ క‌థానాయ‌కుడు సంతోష్ శోభ‌న్.…

2 hours ago

ర‌ఘురామ ఉంటున్న ఇల్లు ఎవ‌రిదో తెలిస్తే షాకే!

ఒక‌ప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలోనే ఉండి, ఆ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా కూడా గెలిచిన ర‌ఘురామ కృష్ణం రాజు త‌ర్వాత…

4 hours ago

`అదే మీడియా` నిల‌బెట్టిన విష‌యం మ‌రిచారా జ‌గ‌న్‌?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలోని ఓ వ‌ర్గం మీడియాపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయ‌న…

8 hours ago

గొడ‌వ ప‌డ్డ హీరోకు తండ్రి స్థానమిచ్చిన ద‌ర్శ‌కుడు

ఒక‌ప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, అగ్ర క‌థానాయిక న‌య‌న‌తార‌.. కొన్ని కార‌ణాల వ‌ల్ల శ‌త్రువులుగా…

8 hours ago

తెలుగులో డ‌బ్బింగ్ చెప్పి, వెన‌క్కి త‌గ్గిన హీరో

ఎప్పుడు ఎవ‌రి కెరీర్ ఎలా మ‌లుపు తిరుగుతుందో చెప్ప‌లేం. త‌మిళ కుర్రాడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌కు... నాలుగేళ్ల ముందు వ‌ర‌కు త‌మిళ‌నాడులోనే…

10 hours ago

క‌విత‌కు `సీనియార్టీ` సంక‌టం.. సీరియ‌స్‌!

బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ క‌విత ఈ నెలలో…

11 hours ago