తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి వేర్వేరుగా ఆయన రాజీనామా లేఖలు పంపించారు. ఈ సందర్భంగా తన రాజకీయం ఎలా ఎక్కడ నుంచి ప్రారంభమైందన్న విషయాన్ని గజపతిరాజు వివరించారు. ఎన్టీఆర్ పిలుపుతో తాను ప్రజాసేవ చేసేందుకు .. రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈ క్రమంలో అనేక పదవులు ఇచ్చారని తెలిపా రు.
ఇక, చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. తన రాజకీయ దశ-దిశ కూడా మారిపోయాయని అశోక్ గజపతిరాజు వివరించారు. కేంద్రంలో మంత్రిపదవి రావడానికి పూర్తిగా చంద్రబాబే కారణమని అశోక్ గజపతి రాజు తెలిపారు. అనేక సందర్భాల్లో అనేక పదవులు ఇప్పించడంతోపాటు.. రాజకీయంగా కూడా చంద్రబాబు తనను ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. గత ఎన్నికల్లో తన కుమార్తె అదితి విజయానికి కూడా చంద్రబాబు మార్గనిర్దేశం చేశారని చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబు.. టిడిపి ద్వారా ప్రజాసేవ చేసేందుకు అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
కాగా.. గోవా రాష్ట్రానికి అశోక్ గజపతి రాజు గవర్నర్గా నియమితులైన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పొలిట్ బ్యూరో పదవికి కూడా అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. గోవా గవర్నర్గా తనను నియమించేలా చేసిన చంద్రబాబుకు, నియమించిన ప్రధానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తాను ఏపదవిలో ఉన్నా.. రాజ్యాంగానికి, న్యాయానికి కట్టుబడి వ్యవహరిస్తానని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. కాగా.. ఆయన ఈ నెల 25 తర్వాత.. గోవా గవర్నర్గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. లేదా అవసరాన్ని బట్టి ఈలోగానే బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
This post was last modified on July 18, 2025 2:53 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…