వైసీపీ రాజంపేట ఎంపీ.. పార్లమెంటరీ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మిథున్రెడ్డిని మాస్టర్ మైండ్గా పేర్కొంటూ.. ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీంతో హైకోర్టు వ్యవహారంపై మిథున్రెడ్డి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే.. ఇక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది.
అసలు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన విధానంపైనా సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఏ-4 నింది తుడుగా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడానికి కారణమేంటని నిలదీసింది. దీంతో ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తరఫు న్యాయవాది.. ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఆలస్యమైందన్నారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది.
ఈ క్రమంలో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే.. తమ పిటిషనర్ పోలీసుల ముందు లొంగిపోయేందుకు కనీసం 10 రోజుల సమయం కావాలన్న న్యాయవాది వాదనలను కూడా కోర్టు తోసిపుచ్చింది. అంటే.. ఆయనను ఎప్పుడైనా అరెస్టు చేసేందుకు సిట్ అధికారులకు అవకాశం చిక్కింది. సో.. సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఎక్కడ?
ఇదిలావుంటే.. రెండు రోజుల కిందట హైకోర్టులో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ దక్కకపోయే సరికి.. ఆయన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం విదేశాలకు పారిపోకుండా.. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు ఉన్నాయి. దీంతో ఆయన ఎక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినా.. అడ్డంగా దొరికి పోవడం ఖాయమని తెలుస్తోంది. సో.. ఈ రోజు లేదా రేపు.. మిథున్ రెడ్డి అరెస్టు ఖాయంగా తెలుస్తోంది.
This post was last modified on July 18, 2025 2:49 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…