కాపు సామాజిక వర్గం ఖుషీ అయ్యే వార్త ఇది!. జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలని వీరి కోరిక. అందుకే తరచుగా ఆయన పర్యటనల్లోనూ.. ఆయన ఎక్కడైనా పాల్గున్నప్పుడు కూడా.. సీఎం-సీఎం అంటూ.. పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు ఆ పదవి తనకు భారమని పవన్ చెబుతున్నారు. మరో 15 ఏళ్ల వరకు కూటమిగానే ఉంటానని అంటున్నారు. దీంతో కాపులు ఒకింత హర్ట్ అవుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు ఈ నెలలో నాలుగు రోజుల పాటు.. విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 21 నుంచి ఆయన సింగపూర్కు వెళ్తారు. అక్కడ అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించి చర్చించనున్నారు. పనిలో పనిగా సింగపూర్కు చెందిన సంస్థ లతోనూ పెట్టుబడులపై చర్చిస్తారు. ఈ పర్యటనను సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజధానికి నిధులు వచ్చిన నేపథ్యంలో పనులు వేగంగా చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో అవసరమైతే.. మరో రెండు రోజులైనా సింగపూర్లోనే ఉండి పనులు చక్కబెట్టుకుని రావాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పాలనను ఎవరు చూస్తారు? అనేది కీలకం. గతంలో అయితే.. చంద్రబాబే ఎక్కడ ఉన్నా.. పాలనను మేనేజ్ చేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో ‘ఇంచార్జ్ ముఖ్యమంత్రి’గా పవన్ కల్యాణ్ బాధ్యతలు చూస్తారంటూ.. అన్ని శాఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు. ఈ రోజో రేపో.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయని.. అధికారికంగానే సీఎం చంద్రబాబు పవన్కు ఇంచార్జ్గా బాధ్యతలు అప్పగిస్తున్నారని.. చెబుతున్నారు. దీంతో కాపులు హ్యాపీగా ఫీలయ్యే అవకాశం ఏర్పడిందన్నమాట.
This post was last modified on July 15, 2025 11:52 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…