కాపు సామాజిక వర్గం ఖుషీ అయ్యే వార్త ఇది!. జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలని వీరి కోరిక. అందుకే తరచుగా ఆయన పర్యటనల్లోనూ.. ఆయన ఎక్కడైనా పాల్గున్నప్పుడు కూడా.. సీఎం-సీఎం అంటూ.. పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు ఆ పదవి తనకు భారమని పవన్ చెబుతున్నారు. మరో 15 ఏళ్ల వరకు కూటమిగానే ఉంటానని అంటున్నారు. దీంతో కాపులు ఒకింత హర్ట్ అవుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు ఈ నెలలో నాలుగు రోజుల పాటు.. విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 21 నుంచి ఆయన సింగపూర్కు వెళ్తారు. అక్కడ అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించి చర్చించనున్నారు. పనిలో పనిగా సింగపూర్కు చెందిన సంస్థ లతోనూ పెట్టుబడులపై చర్చిస్తారు. ఈ పర్యటనను సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజధానికి నిధులు వచ్చిన నేపథ్యంలో పనులు వేగంగా చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో అవసరమైతే.. మరో రెండు రోజులైనా సింగపూర్లోనే ఉండి పనులు చక్కబెట్టుకుని రావాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పాలనను ఎవరు చూస్తారు? అనేది కీలకం. గతంలో అయితే.. చంద్రబాబే ఎక్కడ ఉన్నా.. పాలనను మేనేజ్ చేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో ‘ఇంచార్జ్ ముఖ్యమంత్రి’గా పవన్ కల్యాణ్ బాధ్యతలు చూస్తారంటూ.. అన్ని శాఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు. ఈ రోజో రేపో.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయని.. అధికారికంగానే సీఎం చంద్రబాబు పవన్కు ఇంచార్జ్గా బాధ్యతలు అప్పగిస్తున్నారని.. చెబుతున్నారు. దీంతో కాపులు హ్యాపీగా ఫీలయ్యే అవకాశం ఏర్పడిందన్నమాట.
This post was last modified on July 15, 2025 11:52 am
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…