కాపు సామాజిక వర్గం ఖుషీ అయ్యే వార్త ఇది!. జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలని వీరి కోరిక. అందుకే తరచుగా ఆయన పర్యటనల్లోనూ.. ఆయన ఎక్కడైనా పాల్గున్నప్పుడు కూడా.. సీఎం-సీఎం అంటూ.. పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు ఆ పదవి తనకు భారమని పవన్ చెబుతున్నారు. మరో 15 ఏళ్ల వరకు కూటమిగానే ఉంటానని అంటున్నారు. దీంతో కాపులు ఒకింత హర్ట్ అవుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు ఈ నెలలో నాలుగు రోజుల పాటు.. విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 21 నుంచి ఆయన సింగపూర్కు వెళ్తారు. అక్కడ అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించి చర్చించనున్నారు. పనిలో పనిగా సింగపూర్కు చెందిన సంస్థ లతోనూ పెట్టుబడులపై చర్చిస్తారు. ఈ పర్యటనను సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజధానికి నిధులు వచ్చిన నేపథ్యంలో పనులు వేగంగా చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో అవసరమైతే.. మరో రెండు రోజులైనా సింగపూర్లోనే ఉండి పనులు చక్కబెట్టుకుని రావాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పాలనను ఎవరు చూస్తారు? అనేది కీలకం. గతంలో అయితే.. చంద్రబాబే ఎక్కడ ఉన్నా.. పాలనను మేనేజ్ చేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో ‘ఇంచార్జ్ ముఖ్యమంత్రి’గా పవన్ కల్యాణ్ బాధ్యతలు చూస్తారంటూ.. అన్ని శాఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు. ఈ రోజో రేపో.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయని.. అధికారికంగానే సీఎం చంద్రబాబు పవన్కు ఇంచార్జ్గా బాధ్యతలు అప్పగిస్తున్నారని.. చెబుతున్నారు. దీంతో కాపులు హ్యాపీగా ఫీలయ్యే అవకాశం ఏర్పడిందన్నమాట.
This post was last modified on July 15, 2025 11:52 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…