గుజరాత్కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా, దేశానికి మూడు సార్లు ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీకి.. ఈ ఏడాది సెప్టెంబరులో ఆ పదవిని వదులుకోక తప్పదా? వయసు రీత్యా ఏర్పడిన నిబంధనలను ఆయనకు మినహాయింపు ఇచ్చే అవ కాశం లేదా? అంటే.. ఔననే అంటున్నాయి బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్) వర్గాలు. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్భగవత్.. ఈ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. రెండు రోజుల కిందట కూడా.. ఆయన వయ సు ఆధారంగా చేసిన వ్యాఖ్యలు.. బీజేపీని ఇరకాటంలోకి నెట్టాయి.
“ఏ స్థాయి నాయకుడైనా కూడా.. నిబంధనలు పాటించాలి. లేకపోతే.. నిబంధనలు ఎందుకు?” అని మోహన్ భగవత్ ఒకింత గట్టిగానే చెప్పారు. ఆ నిబంధన కూడా వయసును గురించే ఆయన ప్రస్తావించడం గమనార్హం. “75 ఏళ్ల వయసు వచ్చాక.. ఎవరైనా పదవులు త్యాగం చేయాల్సిందే. కొత్తవారికి.. అవకాశం కల్పించాల్సిందే.” అని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ పదవీ వ్యవహారంపై ఆసక్తికర చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరులో ఆయన 75వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ క్రమంలో నిబంధనల మేరకు ప్రధాని పదవిని వదులు కోవాల్సి ఉంటుందని అంటున్నారు.
ఇదేసమయంలో ఆర్ ఎస్ ఎస్ చీఫ్గా ఉన్న మోహన్భగవత్ కూడా అదేనెలలో పదవీ త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఆయన మోడీ కంటే కూడా.. ముందే 75వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. దీంతో ముందు ఆయన రిజై న్ చేసి..కొత్తవారికి పగ్గాలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే.. ప్రధాని మోడీ వ్యవహారం మరింత బిగుసుకునే అవకాశం ఉంటుందన్న అంచనాలు వస్తున్నాయి. కానీ.. ఇలా జరుగుతుందా? బలమైన వ్యక్తిగా.. బీజేపీని మూడుసార్లు వరుసగా అధికారంలోకి తెచ్చిన నాయకుడిగా మోడీకి పేరుంది.
అంతేకాదు.. కాంగ్రెస్ స్థాయిని చాలా వరకు తగ్గించి.. ప్రపంచ దేశాలకు కూడా ‘విశ్వగురు’గా పేరు తెచ్చుకున్న మోడీ.. ఇప్పటి కిప్పుడు అధికారం నుంచి దిగితే.. అది ఎంత వరకు మేలు చేస్తుందన్నది ప్రశ్న. ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలతోపాటు.. లక్ష్యాలను కూడా ఒకదాని వెంట ఒకటి సాధిస్తున్న ప్రధానిగా కూడా మోడీ పేరు తెచ్చుకున్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, వన్ నేషన్-ఒన ఎలక్షన్, ఎన్ ఆర్సీ, పౌరసత్వం.. ఇలా.. అనేక ఆర్ ఎస్ ఎస్ లక్ష్యాలను సాధించిన ఘనత మోడీ ఖాతాలోనే పడింది.ఇంకా సాధించాల్సినవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగాపీవోకే(పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్)ను భారత్లో కలపడం కీలకం. మరి ఇవన్నీ ఉండగా.. మోడీ రిటైరైతే.. ఆర్ ఎస్ ఎస్ లక్ష్యాలు తీరేనా? అనేది.. బీజేపీ నాయకుల ప్రశ్న. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 11, 2025 9:22 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…