Political News

ఆ ఏపీ మంత్రులిద్ద‌రు మ‌న‌స్సు దోచేశారుగా… !

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గంలో 25 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో కొంతమంది మంచి మంత్రులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఇద్దరు మంత్రుల గురించి సీఎం చంద్రబాబు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారే అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి వరుస విజయం దక్కించుకున్న పయ్యావుల కేశవ్. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతున్న వివాదాస్పద రహితంగా వ్యవహరించే నాయకుడిగా పేరు తెచ్చుకున్న నిమ్మల రామానాయుడు.

సామాజిక వర్గాలు వేరైనా ఈ ఇద్దరు కూడా మంచి పేరు తెచ్చుకోవడం.. నియోజకవర్గాల్లోనే కాదు రాష్ట్రస్థాయిలో కూడా వారి పేరు మార్మోగుతుండటం విశేషం. ‘మా మంచి మంత్రి’ అని పేరు తెచ్చుకునే లాగా వారు వ్యవహరిస్తున్నారు. నిమ్మల రామానాయుడు విషయాన్ని చూస్తే ఆయన గురించి అందరికీ దాదాపు తెలిసిందే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం మంత్రి పదవిలోకి వచ్చినా కూడా మెహర్బానీ, ఈగోతో వ్యవహరించకుండా పేదల పక్షపాతిగా రైతు బాంధవుడిగా ఆయన వ్యవహరిస్తున్న తీరు వంటివి ఎప్పుడూ వార్త‌ల్లోకి వస్తూనే ఉంటాయి.

ముఖ్యంగా ఆయన సాధారణంగానే వ్యవహరిస్తారు. ఎక్కడ ఈగోలకు ఆధిపత్య రాజకీయాలకు ప్రయత్నం చేయరు. దీనికి తోడు మంత్రి అయిన తర్వాత మరింతగా తన‌నుతాను తగ్గించుకుని ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. విజయవాడలో వరదలు సంభవించినప్పుడు బుడమేరు వద్ద కట్ట వేయించే పనిని చేపట్టిన నిమ్మల రామానాయుడు పరిస్థితి అప్పట్లో ఆసక్తిగా మారింది. 104 డిగ్రీల‌ జ్వరంలో ఉండి కూడా ఆయన బుడమేరు కట్టను నిర్మించేలాగా తెల్లవారులు అక్కడే ఉండి పనులు చేయించారు.

ఇటీవల కూడా అసెంబ్లీ సమావేశాల సమయంలో ఒంట్లో బాగోకపోయిన చేతికి ఉన్న సిలైన్‌ స్టిక్కర్ తోనే సభకు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఆయన రాజకీయాల్లో తన అంకిత‌ భావాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక నియోజకవర్గ విషయానికి వస్తే చంద్రబాబు పిలుపునిచ్చిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లడం వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఆడంబరాలకు పోకుండా ప్రజలు చెప్పేవన్నీ వింటూ విసుక్కోకుండా వారి నుంచి విన‌తులు స్వీకరిస్తూ పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఇక పయ్యావుల కేశవ్‌ విషయానికి చూస్తే ఈయన కూడా మా మంచి మంత్రిగా చంద్రబాబు దగ్గర మంచి మార్కులు సంపాదించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రభుత్వ పథకాలకు నిధులు కేటాయిస్తూ చంద్రబాబు మనసును చూరగొన్నారు. ముఖ్యంగా ఆదాయ మార్గాలను అన్వేషించే క్రమంలో పన్నుల ఎగవేత పై కీలక దృష్టి సారించారు. ఇక నియోజకవర్గ స్థాయిలో కీలకమైన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలను కలుస్తూ సుపరి పాల‌న‌లో తొలి అడుగు కార్యక్రమంలో నేలపై కూర్చుని సమస్యలు వింటూ ఒక రచ్చబండ టైపులో ప్రజలకు చెరువు కావడం పయ్యావుల కేశవ్ రాజకీయ పరిణితికి అడ్డం పడుతుందనే చెప్పాలి. ఇలా ఇద్దరు మంత్రులు కూడా మా మంచి మంత్రులుగా పేరు తెచ్చుకున్న వారు కావడం విశేషం.

This post was last modified on July 9, 2025 3:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

3 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

6 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

6 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

8 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

9 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

10 hours ago