ఆయన ఓ ఎంపీ. అంతే కాదు కేంద్రంలో మంత్రి కూడా. తొలిసారి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో అనూహ్యమైన విజయాన్ని దక్కించుకున్నారు. టిడిపికి కంచుకోటగా భావించే గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి విజయం దక్కించుకున్నారు. ఆయనే పెమ్మసాని చంద్రశేఖర్. వృత్తిరీత్యా వైద్యుడు. అమెరికాలో వైద్యశాలలతో పాటు అక్కడ వైద్య వ్యాపారంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబు పిలుపుతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడమే కాకుండా అనూహ్యమైన విజయాన్ని దక్కించుకున్నారు.
కేంద్రంలో మంత్రి పదవిని కూడా ఆయన దక్కించుకున్నారు. ఏడాది కాలంలో కేంద్ర మంత్రిగా ఆయన ఎలా ఉన్నా నియోజకవర్గ స్థాయిలో మాత్రం ఖచ్చితంగా మంచి మార్కులు పడుతున్నాయని చెప్పాలి. వారంలో నాలుగు రోజులకు ఒకసారి నియోజకవర్గానికి రావడం.. స్థానికంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కూడా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తుండడం వంటివి ఎంపీ రాజకీయాల్లో కీలకమనే చెప్పాలి.
ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి అవరోధాలు రాకుండా, లేకుండా పెమ్మసాని ముందుకు సాగుతున్నారు. నిజానికి ఆయనకు రాజకీయాలు కొత్త కావడంతో స్థానికంగా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోవడం కొంత సమయం పడుతుంది అని అందరూ భావించారు. కానీ పెమ్మసాని మాత్రం పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా రాజకీయాల్లోకి వచ్చి రాగానే గుంటూరు నియోజకవర్గ పరిస్థితిపై అవగాహన చేసుకున్నారు. ఏ నేత పరిస్థితి ఏంటి? ఏ మండలంలో పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది ఏ మండల స్థాయిలో పార్టీ డెవలప్ కావాలి అనేదానిపై సుదీర్ఘ కసరత్తు చేశారు.
దీనిని అనుసరిస్తూ ఇప్పుడు ప్రతి వారం ఆయన ఆయా మండలాల్లో పర్యటిస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నారు. ఫస్ట్ టైం ఎంపీ అన్న ముద్రను దాదాపు చెరుపేసుకుంటూ ఆయన అనుభవం ఉన్న నాయకుడిగా ముందుకు సాగుతున్నారు. నిజానికి అనుభవం లేకపోయినా ప్రజలతోనూ ఇటు నాయకులు అల్లుకుపోతున్న తీరు నభూతో న భవిష్యత్తు అన్నట్టుగానే సాగుతోందని చెప్పాలి.
This post was last modified on July 9, 2025 11:32 am
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…