ఏపీలో కూటమి ప్రభుత్వం ‘సూపర్ 6’ పథకాల అమలుకు పదును పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలకమైన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించి అధికారులు కసరత్తు పూర్తి చేశారు. వచ్చే ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయనున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు సహా మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళల జీవితాల్లో కొత్త మార్పు వస్తుందని చెబుతున్నారు.
ఇక, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణానికి సంబంధించి కొన్ని నిబంధనలను రెడీ చేసింది. అధికారికంగా ఇవి ప్రకటించాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు .. రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుందన్న చర్చకు ఈ నిబంధనలు చెక్ పెట్టాయి. అదేసమయంలో ఏయే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లభిస్తుందన్న విషయంపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ నియమాల ప్రకారమే ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు జరుగుతుందని తెలిపింది.
ఇదేసమయంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడిన ఆటో, ట్యాక్సీ, ఊబర్, ర్యాపిడో వంటివాటికి కూడా ఉపశమనం కల్పిస్తూ.. నిర్ణయాలు తీసుకున్నారు. లైనెస్సు ఉండి సొంత ఆటోలేని డ్రైవర్లకు నెల నెలా ఆర్థిక సాయం చేయనున్నారు. అలానే ట్యాక్సీ డ్రైవర్లకు కూడా నెల నెలా కొంత మొత్తం వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక, ర్యాపిడో, ఊబర్ వంటివాహనాలు నడుపుతూ.. వాటిపైనే ఆధారపడిన వారికి కూడా కొంత మొత్తం ఇస్తారు.
ఇక, ఆర్టీసీ నిబంధనలు ఇవీ..
This post was last modified on July 9, 2025 10:08 am
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…
రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…