ఏపీలో కూటమి ప్రభుత్వం ‘సూపర్ 6’ పథకాల అమలుకు పదును పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలకమైన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించి అధికారులు కసరత్తు పూర్తి చేశారు. వచ్చే ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయనున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు సహా మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళల జీవితాల్లో కొత్త మార్పు వస్తుందని చెబుతున్నారు.
ఇక, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణానికి సంబంధించి కొన్ని నిబంధనలను రెడీ చేసింది. అధికారికంగా ఇవి ప్రకటించాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు .. రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుందన్న చర్చకు ఈ నిబంధనలు చెక్ పెట్టాయి. అదేసమయంలో ఏయే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లభిస్తుందన్న విషయంపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ నియమాల ప్రకారమే ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు జరుగుతుందని తెలిపింది.
ఇదేసమయంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడిన ఆటో, ట్యాక్సీ, ఊబర్, ర్యాపిడో వంటివాటికి కూడా ఉపశమనం కల్పిస్తూ.. నిర్ణయాలు తీసుకున్నారు. లైనెస్సు ఉండి సొంత ఆటోలేని డ్రైవర్లకు నెల నెలా ఆర్థిక సాయం చేయనున్నారు. అలానే ట్యాక్సీ డ్రైవర్లకు కూడా నెల నెలా కొంత మొత్తం వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక, ర్యాపిడో, ఊబర్ వంటివాహనాలు నడుపుతూ.. వాటిపైనే ఆధారపడిన వారికి కూడా కొంత మొత్తం ఇస్తారు.
ఇక, ఆర్టీసీ నిబంధనలు ఇవీ..
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…